India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2024 జులై-సెప్టెంబర్లో HYDలో రెసిడెన్షియల్ సేల్స్ 20%, లావాదేవీలు 7% పెరిగాయని స్క్వేర్ యార్డ్స్ సంస్థ తెలిపింది. గత ఏడాది జులై-సెప్టెంబర్(18,314)తో పోలిస్తే ఈ ఏడాది(19,527) ట్రాన్సక్షన్స్లో పెరుగుదల కనిపించిందని పేర్కొంది. మొత్తం రిజిస్టర్డ్ సేల్స్ విలువ ₹11,718కోట్లకు చేరిందని తెలిపింది. యావరేజ్ రిజిస్టర్డ్ హోమ్ సేల్స్ వాల్యూ ₹60లక్షలుగా ఉందని, వార్షిక వృద్ధి 13%గా నమోదయిందని వివరించింది.
ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాకింగ్స్లో టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 22వ స్థానానికి పడిపోయారు. ఇలా కోహ్లీ టాప్20 నుంచి పడిపోవడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆయన టెస్టుల్లో 2 సార్లు అగ్రస్థానానికి ఎగబాకారు. 2011లో 116, 2012లో 37, 2013లో 11, 2014 &15లో 15, 2016 &17లో 2, 2018 &19లో 1వ ర్యాంకు, 2020లో 2, 2021లో 9, 2022లో 15, 2023లో 9, ఈ ఏడాది 22వ స్థానానికి చేరుకున్నారు.
TG: రేషన్కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను తొలగించేందుకే ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందన్న ప్రచారాన్ని డిప్యూటీ సీఎం భట్టి ఖండించారు. ‘సర్వే ఆధారంగా పాలన, ప్రణాళిక రూపకల్పన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు ఉంటాయి. సర్వే పూర్తయ్యాక సామాజిక వర్గాల వారీగా ప్రజల స్థితిగతులపై వివరాలను బహిర్గతం చేస్తాం. మేధావులు, అన్నివర్గాల అభిప్రాయాలతో కులగణన ప్రశ్నలు రూపొందించాం’ అని వెల్లడించారు.
హిందాల్కో షేర్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో 8.42% నష్టపోయాయి. యూఎస్కు చెందిన అనుబంధ సంస్థ Novelis Q2 లాభం 18 శాతం క్షీణించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే గత ఏడాది కాలంలో 165% రిటర్న్ ఇచ్చిన TRENT షేర్లు 6.12% నష్టపోయాయి. Q2 రిజల్ట్స్ 39% (YoY) మేర పెరిగినా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి. అలాగే ఇతరత్రా లాభాలు తగ్గడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
తాము సక్రమంగా పెరగడం వెనుక తన పెదనాన్న చిరంజీవిది ప్రధాన పాత్ర అని నటుడు వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘చిరంజీవిగారు మాకు గర్వం తలకెక్కకుండా పెంచారు. ఆయనో హెడ్మాస్టర్ తరహా. బెత్తంతో నన్ను, చరణ్, బన్నీని దారిలో పెట్టారు. చిన్నవాడిని కాబట్టి నాకంటే ఎక్కువగా వాళ్లిద్దరికే బడితెపూజ జరిగేది. ప్రతి సంక్రాంతికి అందరం 4రోజులు కచ్చితంగా పెదనాన్న ఇంట్లో గడుపుతాం’ అని గుర్తుచేసుకున్నారు.
ఫైనాన్స్, మెటల్, ఆటో, ఫార్మా సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వడంతో స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడడంతో సెన్సెక్స్ 836 పాయింట్లు నష్టపోయి 79,541 వద్ద, నిఫ్టీ 284 పాయింట్ల నష్టంతో 24,199 వద్ద స్థిరపడ్డాయి. 24,180 పరిధిలో నిఫ్టీ, 79,420 పరిధిలో సెన్సెక్స్ సపోర్ట్ తీసుకుంటూ కన్సాలిడేట్ అయ్యాయి.
IPL వేలంలో ఆర్సీబీ ఏ ఆటగాళ్లపై దృష్టి పెట్టాలనేదానిపై ఆ జట్టు మాజీ ఆటగాడు AB డివిలియర్స్ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ‘లెగ్ స్పిన్నర్ చాహల్ను RCB టార్గెట్ చేయాలి. తను ఒకప్పుడు ఆర్సీబీకి అద్భుతంగా ఆడారు. అశ్విన్ లేదా వాషింగ్టన్ ఇద్దరిలో ఒకర్ని కొనాలి. రబాడ, భువనేశ్వర్, షమీ, అర్ష్దీప్ను కొనేందుకు చూడాలి. వీళ్లలో సగంమంది దక్కినా బెంగళూరు దుర్భేద్యమైన బౌలింగ్ టీమ్ అవుతుంది’ అని పేర్కొన్నారు.
HCL టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ అసలైన శ్రీమంతుడిగా నిలిచారు. ఆయన 2024లో రోజుకు రూ.5.9 కోట్లు విరాళంగా అందించినట్లు హురున్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో ఇండియాలోని దాతృత్వ జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారని తెలిపింది. శివ్ నాడార్ తన ఫౌండేషన్ ద్వారా రూ.2,153 కోట్లు వార్షిక విరాళమిచ్చి మూడోసారి అత్యధికంగా విరాళమిచ్చిన వ్యక్తిగా నిలిచారు. ఆయన ఎక్కువగా విద్య కోసమే అందించారు.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్శెట్టి షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ‘హంటర్’ సెట్లో ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఆయన పక్కటెముకలకు గాయమైనట్లు సమాచారం. అటు ఆయనకు తీవ్ర గాయం కాలేదని తలకు స్వల్పంగా దెబ్బ తగిలినట్లు కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.
AP: గ్రామీణ స్థాయి నుంచి క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఎంపీ అధ్యక్షతన ఏసీఏ కౌన్సిల్ సమావేశమైంది. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనపై చర్చించినట్లు పేర్కొన్నారు. విశాఖ, మంగళగిరి క్రికెట్ మైదానాల్లో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. 35 ఎకరాలు కావాలని సీఆర్డీఏకు లేఖ రాసినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.