News January 21, 2025

ఒకే చోట రూ.82 లక్షల కోట్లు

image

ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఒకే దగ్గర నిలబడ్డారు. ఈ నలుగురి నికర ఆదాయం $950 billion+గా ఉంది. అంటే అక్షరాలా రూ.82లక్షల కోట్లు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ $433 బిలియన్లతో ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు.

News January 21, 2025

టీమ్ ఇండియా జెర్సీలో మహ్మద్ షమీ

image

స్టార్ పేసర్ మహ్మద్ షమీ చాన్నాళ్ల తర్వాత టీమ్ ఇండియా జెర్సీ ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు షమీ ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యారు. కాలి గాయంతో బాధపడుతూ ఆయన దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరంగా ఉన్నారు.

News January 21, 2025

కాంగ్రెస్ ‘జైబాపూ’ ఈవెంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు అవమానం

image

కర్ణాటక బెలగావిలో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు ఘోర అవమానం జరిగింది. గౌరవిస్తామని జై బాపూ ఈవెంట్‌కు కాంగ్రెస్ వారిని ఆహ్వానించింది. తీరా వచ్చాక వారినెవరూ కన్నెత్తి చూడలేదు. ఐడీ కార్డులు ఇవ్వకపోవడంతో పోలీసులు లోపలికి రానివ్వలేదు. దాంతో 92 ఏళ్ల ఆ వృద్ధులు బాంక్వెట్ హాల్ మెట్లమీదే పడిగాపులు పడ్డారు. నీళ్లు, ఆహారం లేక అలమటించారు. రానంటున్నా పిలిచి అవమానించారని ఆవేదన చెందారు. మీడియా కలగజేసుకొని వారికి సాయపడింది.

News January 21, 2025

సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జనవరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు.

News January 21, 2025

PHOTOS: ఫ్యామిలీతో అల్లు అర్జున్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భార్య స్నేహా రెడ్డితో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ వైట్ టీషర్టు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. మొన్నటి వరకు ‘పుష్ప-2’ సినిమా కోసం హెయిర్, బియర్డ్ పెంచిన బన్నీ.. తాజాగా తన లుక్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి నెల నుంచి త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది.

News January 21, 2025

భారత్‌తో తొలి T20.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన

image

భారత్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రేపు జరిగే తొలి T20 కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, సాల్ట్(కీపర్), డక్కెట్, బ్రూక్, లివింగ్ స్టోన్, బెథెల్, ఓవర్టన్, అట్కీన్‌సన్, అర్చర్, రషీద్, వుడ్ జట్టులో ఉండనున్నారు. ఈ మేరకు జట్టును కోచ్ మెక్‌కల్లమ్ ప్రకటించారు.

News January 21, 2025

రేపటి నుంచి INDvsENG టీ20 సిరీస్

image

భారత్, ఇంగ్లండ్ మధ్య రేపటి నుంచి 5 మ్యాచుల టీ20 సిరీస్ జరగనుంది. రేపు తొలి మ్యాచ్ కోల్‌కతా వేదికగా రా.7 గంటలకు ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, హాట్ స్టార్ యాప్‌లో లైవ్ చూడవచ్చు. తర్వాతి మ్యాచులు ఈనెల 25 (చెన్నై), 28 (రాజ్‌కోట్), 31 (పుణే), ఫిబ్రవరి 2(ముంబై) తేదీల్లో జరగనున్నాయి. 3 మ్యాచుల వన్డే సిరీస్ (నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్) FEB 6 నుంచి జరగనుంది.

News January 21, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 20కి చేరిన మృతుల సంఖ్య

image

ఛత్తీస్ గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 20కి చేరింది. ఇప్పటివరకు 20 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి, కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్, గుడ్డూ తదితరులు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. కాగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.

News January 21, 2025

రేప్ కేసుపై సీఎం స్పందించే తీరు ఇదేనా..

image

బెంగళూరు రేప్ కేసుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందన విమర్శలకు దారితీసింది. ఆ దారుణాన్ని ఖండించాల్సింది పోయి BJP హయాంలో అత్యాచారాలు జరగలేదా అని ప్రశ్నించారు. ‘BJP ప్రభుత్వ పాలనలోనూ అత్యాచారాలు జరిగాయి కదా. మహిళలు జాగ్రత్తగా ఉండాలి. వారిని కాపాడాలి. కానీ బయట కొందరు సంఘ విద్రోహులు ఉన్నారు. వారివల్లే ఇదంతా’ అని అన్నారు. ఒంటరి యువతిని ఇంటి వద్ద దించుతామని ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

News January 21, 2025

అమితాబ్ అపార్ట్‌మెంట్‌కు రూ.83కోట్లు!

image

అమితాబ్ బచ్చన్ ముంబై ఓషివారాలోని తన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను ₹83కోట్లకు అమ్మేశారు. ఆయనకు 168% ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. 2021 ఏప్రిల్‌లో ఆయన దీనిని ₹31కోట్లకు కొన్నారు. నవంబర్‌లో హీరోయిన్ కృతి సనన్‌కు నెలకు ₹10లక్షలకు రెంట్‌కు ఇచ్చారు. ఈ అపార్ట్‌మెంట్ విస్తీర్ణం 5,185 sq ft ఉంటుందని సమాచారం. కాగా బిగ్ బి ఫ్యామిలీ గత ఏడాది రియల్ ఎస్టేట్‌లో ₹100cr ఇన్వెస్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.