India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంట్రల్ జోన్ ప్లేయర్ డానిష్ మలేవార్ డబుల్ సెంచరీతో అదరగొట్టారు. నార్త్ జోన్తో మ్యాచులో 222 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్సర్తో 203 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన తొలి విదర్భ ఆటగాడిగా డానిష్ రికార్డ్ సృష్టించారు. గతేడాది రంజీ ట్రోఫీలో రాణించడంతో ఆయన సెంట్రల్ జోన్కి ఎంపికయ్యారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ 488/3 రన్స్ చేసింది.

BSNL తన మొబైల్ కస్టమర్ల కోసం కొత్త BiTV ప్రీమియం ప్యాక్ను లాంచ్ చేసింది. నెలకు రూ.151 చెల్లిస్తే 25కి పైగా OTT ప్లాట్ఫామ్స్, 450కి పైగా లైవ్ టీవీ ఛానల్స్ పొందొచ్చు. ఈ ప్యాక్లో ZEE5, SonyLIV, Shemaroo, Sun NXT, Chaupal, Lionsgate Play, Discovery+, Epic ON వంటి ప్రముఖ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. న్యూస్, స్పోర్ట్స్, ప్రాంతీయ ఛానళ్లతో సహా అనేక లైవ్ టీవీ ఛానళ్లూ చూడొచ్చు.

దేశంలో మహిళల జీవనం, భద్రతకు అత్యంత సురక్షిత నగరంగా విశాఖ నిలిచింది. కోహిమా, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఈటానగర్, ముంబైలతో కలిసి సంయుక్తంగా టాప్ ప్లేస్ను కైవసం చేసుకుంది. మహిళల భద్రత, సురక్షిత జీవన పరిస్థితులపై నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ సర్వే చేసింది. మహిళలకై మౌలిక సదుపాయాలు, పోలీసింగ్, పౌరభాగస్వామ్యం ఈ నగరాల్లో ఉన్నట్లు తేలింది. దక్షిణాదిలో కేవలం విశాఖకే చోటు దక్కడం విశేషం.

తేనెకన్నా తియ్యనిది, పాలమీగడల కన్నా స్వచ్ఛమైనది మన భాష. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణ దేవరాయలు ఊరికే అనలేదు. క్రీ.పూ.400 నుంచి తెలుగు భాష ఉనికిలో ఉంది. తెలుగు చరిత్ర, పదకోశం చాలా గొప్పవి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేరు గాంచింది. తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతినే నేడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్నాం. తెలుగులోనే మాట్లాడదాం.. భావి తరాలకు తెలుగు భాష తియ్యదనాన్ని అందిద్దాం.

ఇటీవల నోయిడాలో కట్నం కోసం <<17498888>>భార్యకు<<>> నిప్పంటించి చంపిన ఘటన మరువకముందే తాజాగా బెంగళూరులో మరో సంఘటన చోటు చేసుకుంది. శిల్ప(27) అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమెకు ఏడాదిన్నర కొడుకు ఉండగా, ప్రస్తుతం 5 నెలల గర్భిణి. కట్నం కోసమే భర్త ప్రవీణ్, అత్తింటివారు హత్య చేశారని శిల్ప ఫ్యామిలీ ఆరోపిస్తోంది. పెళ్లికి ముందు రూ.15లక్షల నగదు, 150 గ్రాముల బంగారం, ఇళ్లు కట్నంగా అడిగినట్లు తెలిపారు.

AP: గ్రామ/వార్డు సచివాలయాల పాలనపై ప్రభుత్వం పర్యవేక్షణ పెట్టనుంది. సచివాలయాల శాఖ నుంచి ఆరుగురు, డైరెక్టరేట్ నుంచి ఆరుగురిని ఫంక్షనల్ అసిస్టెంట్లుగా, 17 మంది జాయింట్ డైరెక్టర్/DLDA స్థాయి వారిని సచివాలయ శాఖ అధికారులుగా నియమిస్తారు. మండలంలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవల్ గెజిటెడ్ అధికారిని.. మున్సిపాలిటీల్లో ఇద్దరు అప్పిలేట్ కమిషనర్లు, ఆరుగురు జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులతో పర్యవేక్షిస్తారు.

రెండు రోజుల వరుస నష్టాల అనంతరం స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 80,209 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు వృద్ధి చెంది 24,537 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ వేళ ఈ లాభాలు కొనసాగుతాయా? లేక మళ్లీ నష్టాల్లోకి జారుకుంటాయా అనేది చూడాలి. ప్రస్తుతానికి హిందూస్థాన్ యునిలీవర్, ఏషియన్ పెయింట్స్, ITC, ట్రెంట్, కొటక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ GROWW పబ్లిక్ ఇష్యూకు సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గ్రో మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ ఈ IPOతో ₹6,000-₹8,500 కోట్లు సమీకరించనుంది. సంస్థ విలువను ₹60,000 కోట్లుగా లెక్కగట్టారు. IPOలో కొత్త షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులూ షేర్లను విక్రయిస్తారు. గ్రోలో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల, పీక్ XV, టైగర్ క్యాపిటల్కు వాటాలున్నాయి.

దేశంలో టీచర్ల సంఖ్య కోటి దాటినట్లు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదికలో కేంద్ర విద్యాశాఖ తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరంలో టీచర్ల సంఖ్య 98,07,600 కాగా, 2024-25లో 1,01,22,420కి చేరింది. ఒకే టీచరున్న స్కూల్స్ 1,04,125, ఒక్క విద్యార్థీ లేని పాఠశాలలు దేశంలో 7,993 ఉన్నాయి. అత్యధిక టీచర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఫస్ట్ UP ఉండగా.. TG 10, AP 12వ స్థానంలో ఉన్నాయి.

మొగలిరేకులు ఫేమ్ RK సాగర్ హీరోగా ‘ది 100’ మూవీ జులై 11న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ మూవీ సడెన్గా OTTలో ప్రత్యక్షమైంది. ఇదే విషయాన్ని డైరెక్టర్ కూడా సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘ది 100 చిత్రం వరల్డ్ వైడ్గా అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది’ అంటూ పోస్ట్ పెట్టారు.
Sorry, no posts matched your criteria.