News November 7, 2024

నా భార్యతో ఉపయోగం లేదు: పంజాబ్ కాంగ్రెస్ స్టేట్ చీఫ్

image

పంజాబ్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టేట్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు మరొకరిని భార్యగా తీసుకురావాలంటూ ఆయన మద్దతుదారులను కోరారు. ‘నా భార్య ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి లిప్‌స్టిక్ పెట్టుకొని బయలుదేరి మళ్లీ అర్ధరాత్రి తిరిగి వస్తుంది. కాబట్టి ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదు’ అని చెప్పడం తీవ్ర దుమారం రేపుతోంది. మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ పట్టుబట్టింది.

News November 7, 2024

రేపటి నుంచి ఇండియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్

image

ఇండియా, సౌతాఫ్రికా మధ్య 4 మ్యాచుల టీ20 సిరీస్ రేపటి నుంచి జరగనుంది. 2024 టీ20 WC ఫైనల్ తర్వాత ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకూ రెండు జట్ల మధ్య 27 మ్యాచులు జరిగాయి. భారత్ 15, దక్షిణాఫ్రికా 11 మ్యాచుల్లో గెలవగా, ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. తొలి టీ20 రేపు రా.8.30 గంటలకు డర్బన్ వేదికగా ప్రారంభం అవుతుంది. జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18 టీవీ ఛానల్‌లో లైవ్ చూడొచ్చు.

News November 7, 2024

CSK అలా చేయకూడదు: ఊతప్ప

image

NZ క్రికెటర్ రచిన్ రవీంద్రను CSK అకాడమీలో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతించడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ ఊతప్ప అభిప్రాయపడ్డారు. ‘ప్రాంచైజీలు దేశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మన జట్టుకు ప్రత్యర్థిగా ఆడే విదేశీ ప్లేయర్లకు ఇక్కడ ప్రాక్టీస్ చేసే అవకాశం ఇవ్వొద్దు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడారు. IPLలేని సమయంలోనూ రచిన్ చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల INDతో టెస్టుల్లో బ్యాట్‌తో రాణించారు.

News November 7, 2024

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సెల్లర్స్‌పై ED దాడులు

image

FEMA ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ED దేశవ్యాప్తంగా ఒకే సారి సోదాలు నిర్వహిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇ-కామర్స్ సెల్లర్స్ కేంద్రాలు, ఇళ్లలో దాడులు చేపట్టింది. ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, బెంగళూరులో సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. సెల్లర్స్‌లో కొందరు విదేశాలకు అక్రమంగా నగదు పంపినట్టు ED అనుమానిస్తోందని తెలిసింది. దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 7, 2024

సమగ్ర సర్వే దేని కోసమో ప్రభుత్వం చెప్పాలి: DK అరుణ

image

TG: ప్రభుత్వం చేస్తోన్న సమగ్ర కుటుంబ సర్వే దేని కోసమో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని BJP MP డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళి కులగణనకు విరుద్ధంగా ఉందన్నారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అనే విషయాలు అడుగుతున్నారని, అవన్నీ ప్రభుత్వానికి ఎందుకు చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

News November 7, 2024

హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలిపోతుందా?

image

చాలా మంది హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలిపోతుందనుకుని బాధపడుతుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాన్ని సరిగ్గా శుభ్రం చేయకుండా ధరిస్తే చుండ్రు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫ్రిక్షన్ వల్ల తల చర్మంపై రంధ్రాలు మూసుకుపోయి కొంత జుట్టు రాలే ప్రమాదం ఉంది. హెల్మెట్ పెట్టుకోవడానికి ముందు తలకు కర్చీఫ్ కట్టుకోవాలి. అలాగే సరైన సైజ్ హెల్మెట్ కొనుక్కోవాలి.

News November 7, 2024

సీఎం చంద్రబాబుతో పవన్, హోం మంత్రి అనిత భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. ఇటీవల హోం మంత్రిపై పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో ముగ్గురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, అత్యాచార ఘటనలపై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హోంమంత్రి బాధ్యత వహించాలని, అవసరమైతే తానే ఆ బాధ్యతలు చేపడతానని పవన్ అన్నారు. కాగా నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సైతం పవన్ భేటీ అయ్యారు.

News November 7, 2024

అభిషేక్-ఐశ్వర్య జంటగా మూవీ?

image

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడాకుల రూమర్ల నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిషేక్, ఐశ్వర్య జంటగా మణిరత్నం ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. హిందీలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు టాక్. గతంలో ఆయన దర్శకత్వంలో గురు, రావన్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. కాగా అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.

News November 7, 2024

స్వచ్ఛమైన గాలి దొరికే పట్టణాలివే

image

తీవ్రమైన వాయు కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అక్కడ AQI 300-350 మధ్య నమోదవుతోంది. ఇదిలా ఉంటే దేశంలోనే స్వచ్ఛమైన గాలి దొరికే ప్రదేశంగా సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నిలిచింది. అక్కడ AQI 29 మాత్రమే. ఆ తర్వాతి స్థానాల్లో ఐజ్వాల్-మిజోరాం(32), మంగళూరు(32), తిరునెల్వేలి(35), చామరాజనగర్(40), కోలార్(40), కలబురగి(41), ఉడుపి(45), త్రిస్సూర్(46), ట్యుటికోరిన్(46), కొల్లామ్(48) ఉన్నాయి.

News November 7, 2024

వాస్తు పిచ్చితో రూ.3కోట్లు వృథా: హరీశ్ రావు

image

AP: సచివాలయంలో <<14547237>>మార్పులపై<<>> మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. వాస్తు పిచ్చితో రేవంత్ రెడ్డి పూటకో మార్పు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క గేటు మార్పు కోసం రూ.3.2కోట్ల దుబారా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్ టెక్నాలజీ, ఫైర్ సేఫ్టీ నార్మ్స్‌తో సచివాలయాన్ని నిర్మించామని తెలిపారు. కాగా సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ప్రధాన ద్వారంను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.