India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్ర ఎన్నికల్లో నేతలు విచిత్రమైన హామీలు ఇస్తున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని బ్యాచిలర్స్కు పెళ్లిళ్లు చేయించి జీవనోపాధి కల్పిస్తానని పర్లీ NCP (SCP) అభ్యర్థి రాజాసాహెబ్ దేశ్ముఖ్ హామీ ఇవ్వడం వైరల్గా మారింది. మంత్రి, తన ప్రత్యర్థి ధనంజయ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉపాధి కల్పించకపోవడంతో వారికి పెళ్లిళ్లు కావడం లేదని విమర్శించారు. దీనిపై మీడియా వివరణ కోరగా దేశ్ముఖ్ అందుబాటులోకి రాలేదు.
ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత చదువులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందించేందుకు కేంద్రం <<14544821>>పీఎం విద్యాలక్ష్మి<<>> పథకాన్ని ప్రకటించింది. ఇందులో రూ.7.5 లక్షల లోపు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ ఉంటుంది. రూ.10 లక్షల వరకు రుణాలకు 3% వడ్డీ రాయితీ వర్తిస్తుంది. అయితే వార్షిక ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉన్నవారికే స్కీమ్ వర్తిస్తుంది. ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్లు, వడ్డీ రాయితీ పథకాలు పొందుతున్న వారు అనర్హులు.
సంపదను సృష్టించడం గొప్పకాదు. ఆ సంపదను పేదలకు దానం చేసే మనసుండటం గొప్ప. అలా తమ సంపదను దాతృత్వంతో విరాళంగా ఇచ్చిన బిలియనీర్లు ఎవరో తెలుసుకుందాం. ఇండియాకు చెందిన జమ్షెడ్జీ టాటా ఏకంగా $102.4 బిలియన్లు విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత బిల్ గేట్స్($75.8 బిలియన్), వారెన్ బఫెట్ ($32.1 బిలియన్), జార్జ్ సోరోస్($32B), అజీమ్ ప్రేమ్జీ($21B), మైఖేల్ బ్లూమ్బెర్గ్($12.7B), ఎలాన్ మస్క్($7.6B) ఉన్నారు.
TG: మాజీ మంత్రి, BRS MLA మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. పీజీ మెడికల్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేశారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. గత ఏడాది జూన్లో మల్లారెడ్డికి చెందిన 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లు, పెన్డ్రైవ్లు, హార్డ్డిస్క్లను స్వాధీనం చేసుకుంది. వాటిని పరిశీలించిన అనంతరం నోటీసులిచ్చింది.
బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ పెద్ద, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్కు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తారని నిపుణుల అంచనా. 2016లో ట్రంప్ గెలిచాక బంగ్లా డెలిగేట్స్ ఆయన్ను కలిశారు. అప్పుడు ఆయన ప్రత్యేకంగా యూనస్ను గుర్తుచేశారు. ‘ఆ ఢాకా మైక్రో ఫైనాన్స్ వ్యక్తి ఎక్కడ? నేను ఓడిపోవాలని ఆయన విరాళం ఇచ్చినట్టు విన్నాను’ అని హసీనాకు షాకిచ్చారు. బంగ్లాలో హిందువులపై దాడి, ఇతర అంశాలపై ట్రంప్ సీరియస్గా ఉన్నారు.
Jet Airways ఆస్తుల అమ్మకానికి సుప్రీంకోర్టు అనుమతించింది. దివాలా ప్రక్రియ ఆరంభించాలని ఆదేశించింది. రిజల్యూషన్ ప్లాన్ అమల్లో JKC విఫలమైందని పేర్కొంది. ప్లాన్ ప్రకారం వారు రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టలేదని, రూ.226 కోట్ల ఉద్యోగ బకాయిలు చెల్లించలేదని గమనించిన కోర్టు NCLAT తీర్పును పక్కన పెట్టేసింది. రుణదాతలు, ఉద్యోగులు, స్టేక్ హోల్డర్ల ప్రయోజనం కోసం లిక్విడేషన్ తప్పనిసరని వెల్లడించింది.
TG: సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా పర్యటన ఖరారైంది. రేపు కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రేపు ఉ.11 గంటలకు YTDA అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం వలిగొండ(మ) సంగెం భీమలింగంకత్వాలో రైతులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టనున్నారు. పాదయాత్ర ద్వారా భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను పరిశీలించి, స్థానిక రైతులతో సమావేశం కానున్నారు.
TG: 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయని విమర్శించారు. HYDలో సంస్థాగత ఎన్నికల వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. సంస్థాగత ఎన్నికల వ్యవస్థ బీజేపీకి ఊపిరి అని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
డా.యల్లాప్రగడ <<14550601>>సుబ్బారావు<<>> భీమవరంలో 1895లో జన్మించారు. రాజమండ్రిలో మెట్రిక్యులేషన్, మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి PhD పొందారు. కణాల్లో ATP పనితీరును కనుగొన్నారు. క్యాన్సర్ చికిత్సకు మెథోట్రెక్సేట్ను అభివృద్ధి చేశారు. హెట్రోజెన్, టెట్రాసైక్లిన్ వంటి యాంటీ బయోటిక్స్ను ప్రపంచానికి అందించారు. వండర్ డ్రగ్స్ మాంత్రికుడిగా పేరొందిన ఆయన 1948లో కన్నుమూశారు.
క్రికెట్ ఆడేందుకు తన శరీరం సహకరించడం లేదని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తెలిపారు. అందుకే రిటైర్మెంట్ పలికానని ఆయన చెప్పారు. ‘నాకెంతో ఇష్టమైన క్రికెట్ను ఆస్వాదించలేకపోతున్నా. అందుకే గతేడాదే వీడ్కోలు పలుకుదామనుకున్నా. కానీ సౌరవ్ గంగూలీ, నా భార్య నన్ను మార్చారు. ఈ సీజన్లో రంజీల్లో ఆడాలని సూచించారు. ఈడెన్ గార్డెన్స్లో నా చివరి మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.