India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31న ఆయన రిటైర్ కావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో సర్వీసును 7 నెలలు పొడిగించింది. దీంతో రామకృష్ణారావు వచ్చే ఏడాది మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు.

Vertebral artery dissection (VAD) అనేది వెన్నెముక ధమని లోపలి పొరల్లో సంభవించే చీలిక. ఈ ధమని మెదడుకు రక్త సరఫరా చేసే ప్రధాన రక్తనాళాల్లో ఒకటి. VAD వల్ల రక్త ప్రవాహం తగ్గి స్ట్రోక్ రావొచ్చు. హైబీపీ, స్మోకింగ్, మైగ్రేన్ లాంటి కారణాలతో VAD వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, బలహీనత, మాట్లాడేందుకు ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తాను VAD నుంచి కోలుకుంటున్నానని తెలంగాణ IAS <<17546623>>స్మిత<<>> ట్వీట్ చేశారు.

AP: రాష్ట్రంలో రూ.1,129 కోట్లతో 4,472 విలేజ్ క్లినిక్లు నిర్మిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. 80 శాతం నిధులను కేంద్రమే భరిస్తుందని చెప్పారు. శ్రీకాకుళం-284, NDL-272, ఏలూరు-263, కోనసీమ-242, కృష్ణా-240, అల్లూరి-239, చిత్తూరు-229, బాపట్ల-211, మన్యం-205, ప్రకాశం, నెల్లూరు-203, అనకాపల్లి-200, తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 100 M చొప్పున క్లినిక్లు నిర్మిస్తామన్నారు.

AP: ఉచిత బస్సు ప్రయాణం విషయంలో చంద్రబాబు మహిళలను వెన్నుపోటు పొడిచారని YS జగన్ ఆరోపించారు. ‘11,256 ఆర్టీసీ బస్సుల్లో కేవలం 6,700 బస్సుల్లోనే ఉచిత ప్రయాణమా? అమ్మఒడి తొలి ఏడాది ఇవ్వలేదు. 87 లక్షల మంది పిల్లల్లో 30 లక్షల మందికి ఇవ్వడం లేదు. మహిళలకు మేం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. ఉచిత సిలిండర్ల పథకానికి ₹4,100 కోట్లు అవసరమైతే ₹747 కోట్లే ఇచ్చారు. బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ’ అని Xలో జగన్ ఫైరయ్యారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే BJP నేతృత్వంలోని NDA 324 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని India Today-CVoter Mood of the Nation survey తెలిపింది. బీజేపీకి సొంతంగా 260 సీట్లు వస్తాయంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండీ కూటమికి 208 సీట్లు వస్తాయని అంచనా వేసింది. JUL 1 నుంచి AUG 14 వరకు దేశవ్యాప్తంగా 2.06 లక్షల మంది అభిప్రాయాలు సేకరించామని తెలిపింది. కాగా 2024 ఎన్నికల్లో BJP 240 సీట్లు సాధించింది.

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు డిమాండ్ దృష్ట్యా కోచ్ల సంఖ్యను 16 నుంచి 20కి పెంచనున్నారు. జులై 31 నాటికి ఈ రైలుకున్న ఆక్యుపెన్సీ ఆధారంగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం మినహా రోజూ ఉ.6.10 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరే ఈ రైలు మ.2.35కి తిరుపతి చేరుతుంది. అక్కడ 3.15కు బయల్దేరి రాత్రి 11.40కి SC చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

AP: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూసి, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 8న ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రేపు మెదక్ జిల్లాలో సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇచ్చింది. అటు కామారెడ్డి జిల్లాలో శుక్ర, శనివారాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు జిల్లాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD HYD తెలిపింది. దీంతో సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మరి మీ ప్రాంతంలో వాన పడుతోందా? కామెంట్ చేయండి.

టారిఫ్స్ పెంచి భారత్ను ఇబ్బంది పెడుతోన్న అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టాలనే చర్చ నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే <<17536241>>LPUలో<<>> US సాఫ్ట్ డ్రింక్స్ను బ్యాన్ చేశారు. ఇలాంటి నిర్ణయాన్నే దేశమంతా తీసుకుని అగ్రరాజ్యానికి బుద్ధి చెప్పాలనే అభిప్రాయం వినిపిస్తోంది. స్వదేశీ ప్రొడక్ట్లు వాడాలని, టారిఫ్స్ తగ్గించకపోతే USకు చెందిన సోషల్ మీడియా యాప్స్, మొబైల్స్ను కూడా ఇదే విధంగా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు.

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.