News November 7, 2024

క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం

image

నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమె బరువు తగ్గి చిక్కిపోయినట్లు ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత, విల్‌మోర్, సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. వచ్చే FEBలో భూమిపైకి తిరిగి వచ్చే అవకాశముంది.

News November 7, 2024

శ్రీశైలంలో నీటి నిల్వ తగ్గడంపై ఆందోళన

image

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. <<14540990>>KRMB <<>>హెచ్చరించినప్పటికీ జల విద్యుత్ ఉత్పత్తి కోసం బుధవారం 19,820 క్యూసెక్కులను తెలుగు రాష్ట్రాలు తరలించాయి. మరో 16 వేల క్యూసెక్కులను పోతిరెడ్డిపాడు నుంచి AP తరలించింది. శ్రీశైలంలో ప్రస్తుతం 182.99(215.81) TMCల నీరు ఉంది. ఆల్మట్టి నుంచి ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయడంపై నిపుణులు ఆక్షేపిస్తున్నారు.

News November 7, 2024

‘మేరుగు’పై నాతో తప్పుడు ఫిర్యాదు చేయించారు: పద్మావతి

image

AP: మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన లైంగిక వేధింపుల <<14511104>>కేసులో<<>> ట్విస్ట్ చోటుచేసుకుంది. తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని, కొందరు రాజకీయ నేతల ఒత్తిడితోనే ఫిర్యాదు చేసినట్లు పద్మావతి హైకోర్టుకు నివేదించారు. కేసును ఉపసంహరించుకుంటున్నానని, పోలీసులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో కేసు వివరాలను తమ ముందుంచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

News November 7, 2024

కులగణన సర్వే.. ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?

image

TG: పలు కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సర్వేలో తమ పేరును ఎక్కడ నమోదు చేయించుకోవాలనే దానిపై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి డోర్ నంబర్, యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభంకానుంది. ఈలోపు మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆధార్‌లో అడ్రస్ ఉన్నచోటే వివరాలు నమోదు చేయించుకోవాలని సమాచారం.

News November 7, 2024

KTRపై FIR నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం!

image

TG: ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో KTR కార్నర్ కాబోతున్నట్లు మీడియా, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై FIR నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ న్యాయసలహా కోరినట్లు సమాచారం. ఈ అంశంపై విచారణ జరపాలని ఇప్పటికే ACBకి MAUD లేఖ రాసింది. అప్పటి పురపాలక శాఖ స్పెషల్ CS అర్వింద్ కుమార్‌పైనా చర్యలకు అనుమతి కోరగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.

News November 7, 2024

అగ్రరాజ్య అధ్యక్షుడికి సకల సౌకర్యాలు!

image

అమెరికా నూతన అధ్యక్షుడికి సకల సౌకర్యాలు లభిస్తాయి. ఆయనపై ఈగ వాలకుండా చూసుకునే సీక్రెట్ సర్వీస్ భద్రత ఉంటుంది. అధికారంలో ఉన్న నాలుగేళ్లు వైట్‌హౌస్‌కు అధిపతిగా ఉంటారు. ఇదే కాకుండా బ్లెయిర్ హౌస్, క్యాంప్ డేవిడ్ అనే మరో 2 గెస్ట్ హౌసుల్లో బస చేయొచ్చు. ఆయన విందుల కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు. ప్రయాణించడానికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్, బీస్ట్ కారు అందుబాటులో ఉంటాయి.

News November 7, 2024

మూసీ వరదపై మళ్లీ అధ్యయనం

image

TG: మూసీ నది గరిష్ఠ వరదపై ఐఐటీ హైదరాబాద్ సహకారంతో మళ్లీ అధ్యయనం చేపట్టనున్నారు. ఇటీవల హైడ్రాలజీ విభాగం మూసీ గరిష్ఠ వరద 1.5 లక్షల క్యూసెక్కులే అని నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారంతో పున:పరిశీలన చేయించిన తర్వాత నిర్ధారణకు రావాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే మూసీ నది సరిహద్దులు ఖరారు చేయాలని నిర్ణయించింది.

News November 7, 2024

11 నుంచి భవానీ దీక్షల స్వీకరణ

image

AP: విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల స్వీకరణ జరగనుంది. డిసెంబర్ 1న అర్ధమండల దీక్షల స్వీకరణ ప్రారంభమై 5వ తేదీతో ముగుస్తుంది. DEC 21 నుంచి 25 వరకు దీక్షల విరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21-26 వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలు నిర్వహిస్తారు. దీక్షల విరమణ సందర్భంగా ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు జరుగుతాయి.

News November 7, 2024

ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే

image

TG: ప్రభుత్వం నిన్నటి నుంచి కులగణన సర్వే ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి ఇంటికీ వెళ్తున్న సిబ్బంది ఇంటి నంబర్, యజమాని పేరు నమోదు చేసుకుంటున్నారు. రేపటి వరకు ఆ వివరాలన్నీ సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే మొదలవుతుంది. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను ఎంటర్ చేస్తారు. ఈ ప్రక్రియను నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

News November 7, 2024

2 రోజుల్లో అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో రేపు లేదా ఎల్లుండిలోగా అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడుగా ఈశాన్య రుతుపవనాలు బలపడి రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడతాయంది. అటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.