India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు మూలాలున్న <<14543492>>ఉషా వాన్స్ <<>>చరిత్ర సృష్టించారని మెచ్చుకున్నారు. ‘ప్రపంచంలోని తెలుగువారందరికీ ఇది గర్వకారణం. వారిని ఏపీకి ఆహ్వానించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు. అటు డొనాల్డ్ ట్రంప్కు సీఎం శుభాకాంక్షలు చెప్పారు.
టెస్టు జట్టులో ఛతేశ్వర్ పుజారాకు ఇంకా చోటు ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయకపోవడం భారత మేనేజ్మెంట్ చేసిన తప్పిదమని అభిప్రాయపడ్డారు. ‘ఈ జట్టులో పుజారాకు చోటు ఇవ్వడం ప్రస్తుతం ఓ అవసరం. ఓపెనింగ్ నుంచి 6వ ప్లేస్ వరకు అందరూ దూకుడుగా ఆడే ఆటగాళ్లే. పుజారా, ద్రవిడ్, విలియమ్సన్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో చోటు ఎప్పుడూ ఉంటుంది’ అని వివరించారు.
TG: సచివాలయ ‘<<14547237>>బాహుబలి<<>>’ గేటును శాశ్వతంగా మూసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తు బాగాలేదనే కారణంతో ఈ చర్యలు చేపట్టినట్లు మరోవైపు ప్రచారం జరుగుతోంది. కాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపలే పెట్టాలని ప్రజలు అడిగారా? రూ.3.2కోట్ల ప్రజాధనం వృథా చేయడమెందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపించడంలో మూత్రపిండాలది కీలక పాత్ర. మరి మన కిడ్నీలు అనారోగ్యంగా ఉన్నాయనడానికి సూచనలేంటి? వైద్య నిపుణుల ప్రకారం.. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఒళ్లు, కాళ్లు నీరు పట్టినట్లు కనిపిస్తున్నా, మూత్రంలో రక్తం వస్తున్నా అనుమానించాల్సిందే. ప్రధానంగా మధుమేహం, బీపీ ఉన్నవారు, ధూమపాన ప్రియులు కచ్చితంగా కిడ్నీ పరీక్షల్ని తరచూ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
సెలబ్రిటీలు తరచూ ఫొటోలు దిగే ఓర్రీ US ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు ఓటేశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. తన US సిటిజెన్షిప్కు సంబంధించిన పత్రాలను కూడా షేర్ చేశారు. ‘మనం సాధించాం ట్రంప్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అదే పోస్టులో ట్రంప్ తనకు మెసేజ్ చేసినప్పుడు తీసిన స్క్రీన్షాట్ను కూడా పంచుకున్నారు. కాగా ట్రంప్ వచ్చి ఓర్రీతో ఫొటో దిగాల్సిందేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ బోర్డర్ గవాస్కర్ సిరీస్లో తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండని నేపథ్యంలో ఆ సిరీస్ అంతటికీ కొత్త కెప్టెన్ను నియమించాలని గవాస్కర్ ఇటీవల పేర్కొన్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫించ్ ఆ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ‘రోహిత్ భారత్కి కెప్టెన్. బిడ్డ పుట్టే సందర్భాన్ని ఎంజాయ్ చేసే హక్కు అతడికి కచ్చితంగా ఉంటుంది. తిరిగి వచ్చాక అతడే మళ్లీ కెప్టెన్గా ఉండాలి’ అని స్పష్టం చేశారు.
మన పొరుగు దేశం భూటాన్లో నిలువ నీడ లేనివారు, బిచ్చగాళ్లు ఏమాత్రం కనిపించరు. ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో క్రమం తప్పకుండా చోటు సంపాదించే అక్కడ ప్రజల అవసరాల్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. వారికి నివాసం, భూమి, ఆహార భద్రత వంటివన్నీ చూసుకుంటుంది. దీంతో ఇతర దేశాల్లో కనిపించే సహజమైన సమస్యలు ఇక్కడ కనిపించవు. అన్నట్లు ఇక్కడ వైద్య చికిత్స ఉచితం కావడం విశేషం.
చాలామంది భక్తులు పూజల్లో అగరబత్తుల్ని విపరీతంగా వెలిగిస్తుంటారు. కానీ ఆ పొగ అంత మంచిది కాదని అమెరికాకు చెందిన NIH పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అగరబత్తుల పొగ ఎక్కువగా పీలిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరించారు. ఒక అగరబత్తిని వెలిగిస్తే 45 మి.గ్రాముల కంటే ఎక్కువ కణాలు విడుదలవుతాయని, అవి సిగరెట్కంటే ఎక్కువని తెలిపారు. ఆ పొగలో ప్రమాదకరమైన పలు కర్బన సమ్మేళనాలు ఉంటాయని వివరించారు.
డొనాల్డ్ ట్రంప్నకు కమలా హారిస్ ఫోన్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ట్రంప్నకు కాల్ చేసి కంగ్రాట్స్ తెలిపారు. అధికార మార్పిడిపై చర్చించేందుకు వైట్హౌస్కు రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై US ప్రజలను ఉద్దేశించి బైడెన్ త్వరలోనే ప్రసంగించనున్నట్లు వైట్హౌస్ వర్గాలు తెలిపాయి.
ఎన్నో అంచనాల నడుమ అల్లు అర్జున్ ‘పుష్ప2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ప్యాచ్వర్క్ షూట్ నిన్న ముగిసింది. కాగా శ్రీలీలతో ఐటెమ్ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. నవంబర్ 12 లేదా 13 నాటికి షూటింగ్ మొత్తం ముగియనుందని సమాచారం. కాగా ఈ మూవీ ట్రైలర్ 3 నిమిషాల 45 సెకన్లకు లాక్ చేసినట్లు టాక్. NOV 15న ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. DEC 5న మూవీ విడుదలవనుంది.
Sorry, no posts matched your criteria.