News September 16, 2025

శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం: భూమన

image

AP: శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం జరిగిందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి వాపోయారు. ‘అలిపిరిలో మలమూత్రాలు విసర్జించే చోట, మద్యం బాటిల్స్ మధ్య శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హైందవ ధర్మానికి తూట్లు పొడిచేలా టీటీడీ తీరు ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయి. హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.

News September 16, 2025

పిల్లలకు పాలు ఎలా పట్టించాలి?

image

బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించాలి. అయితే జాగ్రత్తగా పాలు పట్టించకపోతే గొంతులోకి బదులు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బిడ్డకు ప్రాణాంతకమవుతుంది. పాలిచ్చేటప్పుడు శరీరం కంటే బిడ్డ తల పైకి ఉండాలి. చేతులతో బిడ్డ భుజాలు, తల, వీపు భాగానికి ఆసరా ఇవ్వాలి. పాలివ్వడానికి తల్లి ముందుకు ఒంగకూడదు. కుర్చీలో వెనక్కి ఆనుకొని పట్టించాలి. పాలు పట్టాక జీర్ణం అయ్యేందుకు కొద్దిసేపు బిడ్డ వీపు నెమ్మదిగా నిమరాలి.

News September 16, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో నూతన పాస్‌పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
* ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్. రేపు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి హాజరు.
* నల్గొండలో పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైలు శిక్ష విధించిన పొక్సో కోర్టు. బాధితురాలికి రూ.10 లక్షలు చెల్లించాలని తీర్పు.

News September 16, 2025

నో మేకప్.. మేకప్ లుక్ కావాలా?

image

ప్రస్తుతకాలంలో ‘నో మేకప్- మేకప్ లుక్‌’ ట్రెండ్ అవుతోంది. దీనికోసం తేలిగ్గా ఉండే మాయిశ్చరైజర్, రేడియన్స్ ప్రైమర్, ల్యుమినైజింగ్ ఫౌండేషన్ వాడాలి. డార్క్ సర్కిల్స్ కనిపించకుండా లైట్‌గా కన్సీలర్ రాయాలి. ఐ ల్యాష్ కర్లర్, మస్కారా, ఐ లైనర్ అప్లై చెయ్యాలి. చీక్ బోన్స్‌పై బ్రాంజర్, బ్లషర్ రాయాలి. మ్యూటెడ్ లిప్ కలర్, టింటెడ్ లిప్ బామ్ పెదవులకు అద్దాలి. అంతే మీ నో మేకప్ లుక్ రెడీ.

News September 16, 2025

పాడి పశువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు

image

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.

News September 16, 2025

విద్యార్థి తలపై కొట్టిన టీచర్.. విరిగిన పుర్రె ఎముక

image

AP: అల్లరి చేస్తోందని విద్యార్థినిని కొట్టడంతో తలకు తీవ్రగాయమైన ఘటన చిత్తూరు(D) పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో జరిగింది. ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీ(11)ని ఈ నెల 10న ఓ టీచర్ స్కూల్ బ్యాగ్‌తో కొట్టాడు. తలనొప్పిగా ఉండటంతో పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా పుర్రె ఎముక చిట్లినట్లుగా పరీక్షల్లో తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 16, 2025

పంటకు అధిక యూరియాతో కలిగే నష్టాలు

image

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.

News September 16, 2025

ప్రీఎక్లంప్సియాను ముందుగానే గుర్తించొచ్చు!

image

కొందరు మహిళలకు ప్రెగ్నెన్సీలో మూత్రం నుంచి ప్రొటీన్ వెళ్లిపోతుంది. దీన్నే ప్రీఎక్లంప్సియా అంటారు. సరైన సమయంలో గుర్తించి, చికిత్స చేయకపోతే తల్లీబిడ్డల ప్రాణాలకు ప్రమాదం వస్తుంది. దీనికోసం IITమద్రాస్ పరిశోధకులు ఒక టెస్ట్‌కిట్‌ అభివృద్ధి చేశారు. ఒక్కచుక్క రక్తంతో టెస్ట్ చేస్తే అరగంటలోనే ఫలితం వస్తుంది. P-FAB టెక్నాలజీతో ఇది పనిచేస్తుందని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ VV రాఘవేంద్రసాయి వెల్లడించారు.

News September 16, 2025

వరికి అధికంగా యూరియా వేస్తున్నారా?

image

వరి నాట్లు వేసిన 2-3 వారాల మధ్య.. పైరు చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు రెండుసార్లు యూరియా వేయాలి. ప్రతిసారీ ఎకరాకు 35 నుంచి 45 కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. చాలామంది రైతులు మాత్రం ఎకరాకు ఒకటిన్నర నుంచి రెండు బస్తాల వరకు యూరియా వేస్తున్నారు. అధిక యూరియా వల్ల అధిక దిగుబడి వస్తుందనే ఉద్దేశంతో రైతులు ఇలా చేస్తున్నారు. దీని వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

News September 16, 2025

‘ఆరోగ్యశ్రీ’ బంద్.. చర్చలకు అంగీకరించని సర్కార్

image

TG: ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేట్ ఆసుపత్రుల సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఇప్పటికే ₹140 కోట్ల బకాయిల్లో ₹100 కోట్లు విడుదలయ్యాయి. 150 కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు కొనసాగుతాయి. ఎమర్జెన్సీ సేవలు అందుతాయి. మిగతా 330 చిన్న, మధ్య తరహా ఆసుపత్రులు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాయి’ అని హెల్త్ మినిస్టర్ కార్యాలయ అధికారి Way2Newsకు తెలిపారు.