India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘దసరా’ తర్వాత రెండో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దానికి ‘పారడైజ్’ అన్న పేరును ప్రకటిస్తూ హీరో నాని ట్వీట్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సికింద్రాబాద్లోని ఓ హోటల్ నేపథ్యంలో కథ జరుగుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. దసరా విలేజ్ బ్యాగ్రౌండ్ రస్టిక్ డ్రామా కాగా.. ఈ మూవీ సిటీలో రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండనుందని టాక్.
TG: గ్రూప్-4 పరీక్ష తుది ఫలితాల కోసం అభ్యర్థులు వినూత్న నిరసనకు దిగారు. పరీక్ష జరిగి దాదాపు 500 రోజులు కావస్తున్నా నియామకాలు జరగకపోవడంతో TGPSCకి భారీ సంఖ్యలో పోస్ట్ కార్డుల ద్వారా వినతిపత్రాలు పంపించారు. ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి 8 వేల మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా దేశం నుంచి అక్రమ వలసదారులను పంపించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రచార ప్రతినిధి కరోలిన్ వెల్లడించారు. తక్షణమే ఈ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. కాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల మందిని వెనక్కి పంపుతామని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. దాదాపు 15 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా అమిత్ షాకు శ్రీవారి విగ్రహాన్ని పవన్ బహుకరించారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన ఏపీకి తిరిగి పయనమవుతారు.
భారత స్టాక్ మార్కెట్లో అతిపెద్ద FPIగా సింగపూర్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. సావరిన్ ఫండ్స్ ద్వారా ఏకంగా రూ.2.69 లక్షల కోట్ల విలువైన షేర్లను హోల్డ్ చేసింది. 2, 3 ప్లేసుల్లోని నార్జెస్ బ్యాంక్ రూ.1.42 లక్షల కోట్లు, US క్యాపిటల్ గ్రూప్ రూ.1.33 లక్షల కోట్ల కన్నా ఇదెంతో ఎక్కువ. HDFC బ్యాంకు, RIL, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, ఇన్ఫీ, LT, NTPC, M&Mలో ఎక్కువ పెట్టుబడి పెట్టింది.
US అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్పై డొనాల్డ్ ట్రంప్ విజయంతో తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు నిరాశకు గురయ్యారు. కమల పూర్వీకులది అదే ఊరు కావడంతో ఆమె ఈ ఎన్నికల్లో గెలవాలని వాళ్లు పూజలు చేశారు. ఆమె గెలిచాక సంబరాల కోసం బాణసంచా సిద్ధం చేసుకున్నారు. అంచనాలకు భిన్నంగా ట్రంప్ గెలవడంతో వారు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఓడినా కమలకు మద్దతిస్తామని, ఆమెకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందంటున్నారు.
AP: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్-ఛైర్మన్, ఎండీగా ఐఏఎస్ ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్తో సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఆమ్రపాలి ఏపీకి వచ్చి రిపోర్ట్ చేశారు. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని చేశారు. ఆమె విద్యాభ్యాసం విశాఖలో సాగింది. 2010లో ఆమె IASకు సెలెక్ట్ అయ్యారు.
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రపంచ నలుమూలల క్రేజ్ ఉంటుంది. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇది రుజువైంది. ఎన్నికల్లో ఒక ఓటరు తన ఓటును బాలయ్యకు వేశారు. ఏ అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేస్తారనే విభాగంలో ఇష్టమైన వ్యక్తి పేరు రాసి ఓటు వేసే అవకాశం ఉండటంతో సదరు వ్యక్తి ‘బాలయ్య’ అని రాశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
భారతదేశంలో ఎన్నో మిస్టీరియస్ ప్రదేశాలున్నాయి. అందులో ఒకటి రూప్కుండ్ లేక్ (స్కెలిటెన్ లేక్). ఉత్తరాఖండ్లోని హిమాలయ శ్రేణుల్లో 16,740 అడుగుల ఎత్తులో ఈ సరస్సు ఉంది. దీని అంచున మానవ అస్థిపంజరాలు ఉండటంతో బాగా ప్రసిద్ధి చెందింది. ఇవి 800CE-1800 CEకి చెందిన మానవ అవశేషాలుగా గుర్తించారు. ఈ మరణాలకు గల కచ్చితమైన కారణం ఇప్పటికీ కనుగొనలేకపోయారు. తుఫాను లేదా యుద్ధ సమయంలో వీరు చనిపోయి ఉండొచ్చని అంచనా.
AP: టీటీడీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించాక బీఆర్ నాయుడు తొలిసారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తామని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీవాణి నిధుల వినియోగంపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.