News January 21, 2025

అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ: ట్రంప్

image

2025 అమెరికా ప్రజలకు స్వేచ్ఛాయుత సంవత్సరం అని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘అమెరికా దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధిస్తాం. అక్రమ వలసలు అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటాం. భిన్న సంస్కృతుల, సంప్రదాయాల కలయికే అమెరికా. దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి బయటపడ్డా. అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తా. రాజ్యాంగబద్ధంగా, ప్రజస్వామ్యబద్ధంగా పని చేస్తాం’ అని ట్రంప్ అన్నారు.

News January 21, 2025

సంచలనం: కుటుంబసభ్యులకు బైడెన్ క్షమాభిక్ష

image

అధికారం నుంచి దిగిపోయే 20 ని.ల ముందు బైడెన్ తన కుటుంబానికి చెందిన ఐదుగురికి క్షమాభిక్ష ప్రకటించారు. వారు ఎలాంటి తప్పు చేయలేదని, ట్రంప్ రాజకీయ దాడులకు బలవుతారనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. క్షమాభిక్ష పొందినవారిలో బైడెన్ సోదరుడు జేమ్స్, అతడి భార్య సారా, బైడెన్ సోదరి వలేరి, ఆమె భర్త జాన్, బైడెన్ మరో సోదరుడు ఫ్రాన్సిస్ ఉన్నారు. 2024 DECలోనూ తన కుమారుడికి క్షమాభిక్ష ప్రకటించారు బైడెన్.

News January 20, 2025

మొబైల్ రీఛార్జ్‌లపై GOOD NEWS

image

రీఛార్జ్ చేయకపోయినా సిమ్ ఎక్కువ కాలం యాక్టివేట్‌‌గా ఉండేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది. జియో, ఎయిర్‌టెల్, Vi యూజర్స్ 90 రోజులు, BSNLకు 180 రోజుల పాటు యాక్టివేట్‌‌గా ఉంటాయని తెలిపింది. అనంతరం సిమ్ Deactivate కాకుండా ఉండాలంటే నెట్‌వర్క్‌ను అనుసరించి రీఛార్జ్ చేసుకోవాలంది. ఇది రూ.20తో స్టార్ట్ చేయాలని ట్రాయ్ సూచించింది. 2 సిమ్ కార్డులు వాడేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

News January 20, 2025

ట్రంప్ వ్యక్తిగత సమాచారం

image

డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్‌లో మేరీ, ఫ్రెడ్ దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి ఫ్రెడ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 1971లో తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని స్వీకరించారు. ట్రంప్ తొలుత ఇవానాను పెళ్లి చేసుకొని 1990లో విడాకులిచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత నటి మార్లాను పెళ్లాడారు. వీరికి ఒక కూతురు. 1999లో విడాకులు తీసుకుని 2005లో మెలానియాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.

News January 20, 2025

లోకేశ్ సీఎం అవుతారన్న మంత్రి.. సీఎం ఆగ్రహం

image

AP: దావోస్ పర్యటనలో మంత్రి <<15206909>>భరత్<<>> ప్రసంగంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసందర్భ ప్రసంగాలు చేయొద్దని ఆయన్ను మందలించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వ్యక్తిగత అభిప్రాయాలు బహిరంగ వేదికపై మాట్లాడవద్దని భరత్‌కు చంద్రబాబు హితబోధ చేశారు. భవిష్యత్తులో లోకేశే సీఎం అంటూ జ్యూరిచ్‌లో మంత్రి భరత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

News January 20, 2025

మీ SBI అకౌంట్ నుంచి రూ.236 కట్ అయ్యాయా?

image

ఎస్బీఐ బ్యాంకు డెబిట్ కార్డుల వాడే యూజర్ల నుంచి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ వసూలు చేస్తోందన్న విషయం తెలుసా? డెబిట్ కార్డు రకాన్ని బట్టి ఈ ఛార్జీలు ఉంటాయి. క్లాసిక్/సిల్వర్/గ్లోబల్ కాంటాక్ట్ లెస్ కార్డులకు ₹236 (₹200+18%GST), గోల్డ్/కాంబో/మై కార్డ్(ఇమేజ్) కార్డులకు ₹250+GST, ప్లాటినం కార్డులకు ₹325+GST, ప్రైడ్/ప్రీమియం కార్డులకు ₹350+GST ఛార్జ్ చేస్తోంది.

News January 20, 2025

26 మంది IASలు బదిలీ

image

ఏపీలో 26 మంది IASలు బదిలీ అయ్యారు.
*CRDA కమిషనర్- కన్నబాబు
*సీఎం ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- సాయి ప్రసాద్
*పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- బి.రాజశేఖర్
*GVMC కమిషనర్- సంపత్ కుమార్

News January 20, 2025

డొనాల్డ్ ట్రంప్ రికార్డులివే

image

US అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న ట్రంప్ (78) పెద్ద వయస్కుడిగా రికార్డుల్లోకెక్కారు. గతంలో ఇది బైడెన్ పేరిట ఉండేది. క్రిమినల్ కేసులు ఉండి ప్రెసిడెంట్ అవుతున్న వ్యక్తీ ఈయనే. హష్‌మనీ కేసులో ట్రంప్ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. రెండుసార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని ప్రజామద్దతు సంపాదించిన వ్యక్తిగా చరిత్రకెక్కారు. నాలుగేళ్ల విరామం తర్వాత అధికారం సాధించిన రెండో ప్రెసిడెంట్ ట్రంపే.

News January 20, 2025

భోజనం తర్వాత ఈ రెండూ చేయకండి

image

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొద్దు. ఎందుకంటే మనం తినే సమయంలో పొట్టలోకి జీర్ణరసాలు వచ్చి ఆహారం డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి. తినగానే నీళ్లు తాగితే ఈ రసాలు పలుచబడి జీర్ణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనేది డాక్టర్ల సూచన. ఇక రాత్రి మోతాదుగా, తేలిక ఆహారం, అది కూడా పడుకునే 2-3 గంటల ముందు తింటే మంచిది. తిన్న అరగంట లోపు పడుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి లైట్ యాక్టివిటీ ట్రై చేయండి.

News January 20, 2025

చైనా దూకుడు.. ఏడాదిలో 800KMS మెట్రో మార్గం పొడిగింపు!

image

దేశంలోని నగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలను గట్టెక్కిస్తోన్న మెట్రో రైళ్లను విస్తరించడంలో ఇండియా స్పీడు పెంచాల్సి ఉంది. 2024లో ఇండియాలో కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు తాజా నివేదికలో వెల్లడైంది. అదే చైనాలో మాత్రం ఒకే ఏడాదిలో 800+కి.మీలు మెట్రో మార్గాన్ని విస్తరించారు. కాగా, ఇండియాలో మొత్తం 1,000 కి.మీల మెట్రో మార్గం ప్రస్తుతం అందుబాటులో ఉంది.