India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఛత్తీస్గఢ్లో తాజా ఎన్కౌంటర్ జరిపిన భద్రతా బలగాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మాణంలో బలగాలు మరో పెద్ద విజయం సాధించాయన్నారు. ‘నక్సలిజానికి ఇది మరో బలమైన ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులో ఇరు రాష్ట్రాల బలగాలు, CRPF జాయింట్ ఆపరేషన్లో 14 మంది నక్సల్స్ చనిపోయారు. దేశంలో నక్సలిజం ఊపిరులు చివరికి చేరాయి’ అని ట్వీట్ చేశారు.

దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఒకానొక దశలో 800pts పతనమైన సెన్సెక్స్ 77,337 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. కాసేపటికే పుంజుకొని 70pts లాభంతో 77,141 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు 150pts తగ్గిన నిఫ్టీ 23,426 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇప్పుడు 30pts పెరిగి 23,376 వద్ద చలిస్తోంది. ట్రంప్ టారిఫ్స్, అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణాలు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా నిలిచేందుకు అర్ష్దీప్ సింగ్ 2 వికెట్ల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం చాహల్ (80 మ్యాచుల్లో 96 వికెట్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రేపటి నుంచి ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్లో అర్ష్దీప్ 2 వికెట్లు తీస్తే చాలు చాహల్ను అధిగమిస్తారు. ఆయన ఇప్పటివరకు 60 మ్యాచులాడి 95 వికెట్లు తీశారు. కాగా ENGతో సిరీస్కు చాహల్ సెలక్ట్ కాని విషయం తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తొలిరోజు ట్రంప్ బిజీబిజీగా గడిపారు. ఎక్కడా సమయాన్ని వృథా చేయకుండా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన తొలిరోజున 42 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్/ మెమోరాండం/ ప్రకటనలు చేశారు. 115 మంది సిబ్బందిపై, 200 కంటే ఎక్కువ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 60 నిమిషాల పాటు ప్రెస్తో మాట్లాడారు. ఒక్కరోజులో 3 చారిత్రక ప్రసంగాలు ఇచ్చి తన మార్క్ చూపించారు.

హీరో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. మార్చి 24న అఖిల్-జైనబ్ రవ్జీల వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య జరగనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. త్వరలోనే పెళ్లి పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనిపై అక్కినేని కుటుంబం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కొన్ని నెలల కింద వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

ఆటోమేటిక్ బర్త్రైట్ రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రభావం భారతీయులపై విపరీతంగా ఉండనుంది. ఇకపై పిల్లలకు ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వర్తించాలంటే వారి పేరెంట్స్లో ఒకరు US పౌరులు/ గ్రీన్ కార్డు హోల్డర్ (PR)/ US మిలిటరీలో పనిచేస్తుండాలి. గతంలో మాదిరిగా టెంపరరీ వర్క్ వీసా (H1B), స్టూడెంట్ వీసా (F1), గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వారు, విజిటింగ్ వీసాపై అక్కడ కన్న పిల్లలకు వర్తించదు.

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ హిందీ వెర్షన్ ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. ఎమోషన్, సహజత్వం కొనసాగేలా ఇందులో కూడా తన రోల్కు బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బీటౌన్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

TG: ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటి అమలు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి జరుగుతుందని చెప్పారు. నేటి నుంచి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని, అర్హత ఉండి లిస్టులో పేరు లేని వారు గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు.

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో రెండో రోజున CM రేవంత్ పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు. అమెజాన్, యుని లివర్, స్కై రూట్ ఏరో స్పేస్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరుపుతారు. అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. IT, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఛత్తీస్గఢ్లో జరిగిన <<15211460>>ఎన్కౌంటర్లో <<>>14 మంది మావోయిస్టులు మృతి చెందగా, వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నట్లు సమాచారం. చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు వాసి కాగా, ఆయనపై గతంలోనే రూ.కోటి రివార్డు ప్రకటించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో రెండ్రోజులుగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.