News October 12, 2025

రాష్ట్ర బంద్ వాయిదా: BC JAC

image

TG: రిజర్వేషన్ల సాధన కోసం బీసీ నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ అక్టోబర్ 14 నుంచి 18వ తేదీకి వేశారు. రిజర్వేషన్ల కోసం ఇవాళ పలు బీసీ సంఘాలు ఒక్కటై BC JACగా ఏర్పడ్డాయి. ఆ జేఏసీ ఛైర్మెన్‌గా ఆర్.కృష్ణయ్య, వైస్ ఛైర్మన్‌గా వీజీఆర్ నారగొని తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చర్చలు జరిపి బంద్‌ను వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో అమలుపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.

News October 12, 2025

అది టెక్నికల్ ఎర్రర్: అఫ్గాన్ మంత్రి

image

మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టులకు అనుమతివ్వకపోవడంపై అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ క్లారిటీ ఇచ్చారు. అది కావాలని చేసింది కాదని, టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగిందని తెలిపారు. భారత మీడియా, పొలిటీషియన్స్ నుంచి విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. ఇందులో వివక్ష లేదని, కొద్ది మంది జర్నలిస్టులకే ఆహ్వానం పంపడంతో ఇలా జరిగిందన్నారు. కాగా ఇవాళ్టి ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించడం గమనార్హం.

News October 12, 2025

ఇతిహాసాలు క్విజ్ – 33 సమాధానాలు

image

1. రామాయణాన్ని విభజించే ముఖ్య భాగాలను ‘కాండము’ అని పిలుస్తారు.
2. సంస్కృత మహాభారతంలో 100 ఉప పర్వాలు ఉన్నాయి.
3. వేద వ్యాసుడి తండ్రి పరాశరుడు.
4. నేపాల్‌లో జరిపే తిహార్ పండుగలో శునకాన్ని సత్కరిస్తారు.
5. ‘క్షీరం’ అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ‘పాలు’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 12, 2025

మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు

image

మహిళల్లో మెనోపాజ్ తర్వాత అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడంతో గుండెసంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యం కోసం రెగ్యులర్ హార్ట్ చెకప్స్, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కొలెస్ట్రాల్, బీపీ, బ్లడ్‌లో గ్లూకోజ్‌‌లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఫైబర్, నట్స్, పండ్లు, కూరగాయలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News October 12, 2025

ఫుట్‌వేర్ కొంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

image

పాదాల సంరక్షణకు ఫుట్‌వేర్ అవసరం. వీటిని కొనేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. మీ పాదాల సైజ్‌కు సరిపోయేవే కొనాలి. టైట్/ లూజ్‌గా ఉన్నా నడవడానికి ఇబ్బందవుతుంది. స్టైల్‌తో పాటు మనం పెట్టే డబ్బుకి తగ్గ క్వాలిటీ ఉందో..లేదో చూడాలి. రెగ్యులర్ వేర్, ఫంక్షనల్ వేర్, ఆఫీస్ వేర్ ఇలా ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి ఫుట్‌వేర్ ఎంచుకోవాలి. వైట్, బ్లాక్, క్రీమ్ కలర్స్ ఏ డ్రెస్‌కైనా మ్యాచ్ అవుతాయి.

News October 12, 2025

తురకపాలెం బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన పెమ్మసాని

image

గుంటూరు(D) తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధితోనే మరణాలు సంభవించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలియకుండానే వ్యాధి వ్యాప్తి జరిగిందని చెప్పారు. మరణించిన 28 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ ప్రాంతంలో బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించేందుకు వైద్య నిపుణులను తీసుకొచ్చామన్నారు.

News October 12, 2025

రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షం

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. APలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు TGలో భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని పేర్కొంటూ HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 12, 2025

3వ రోజు ముగిసిన ఆట.. పోరాడుతున్న వెస్టిండీస్

image

INDvsWI రెండో టెస్టులో తొలి 2 రోజులు టీమ్‌ఇండియా డామినెన్స్ కనిపించింది. కాగా మూడో రోజు ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ పోరాడుతోంది. 35కే 2 వికెట్లు పడిపోయినా బ్యాటర్లు హోప్(66), క్యాంప్‌బెల్(87) క్రీజులో పాతుకుపోయారు. మరో వికెట్ పడకుండా 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ జట్టు ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు.

News October 12, 2025

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

image

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోనున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. అట్లీ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న AA22 కోసం ఆయన ఏకంగా రూ.175 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభాస్ కొన్ని సినిమాలకు రూ.150 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నాయి. దీంతో రాబోయే సినిమాలతో ఐకాన్ స్టార్ హాలీవుడ్ రేంజ్‌కు వెళ్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News October 12, 2025

అర్ధరాత్రి అమ్మాయి ఎలా బయటికి వచ్చింది: మమత

image

MBBS స్టూడెంట్ గ్యాంగ్‌రేప్ ఘటనపై బెంగాల్ CM మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలేజీ నుంచి అర్ధరాత్రి 12.30గం.కు అమ్మాయి ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. రాత్రిపూట బయటకు రానివ్వకూడదని అన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవాలని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘మణిపుర్, బిహార్, UP, ఒడిశాలో ఇలాంటివి జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.