News November 6, 2024

OFFICIAL: రాముడిగా రణ్‌బీర్.. సీతగా సాయిపల్లవి

image

బాలీవుడ్ ‘రామాయణ’ మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. 2026 దీపావళికి మొదటి, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి. నితేశ్ తివారీ రూపొందించనున్న ఈ మూవీలో బాబీ డియోల్, యశ్ కీలకపాత్రలు పోషిస్తారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారు.

News November 6, 2024

US ELECTIONS: ఇండియన్ అమెరికన్స్ హవా

image

అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ హవా కొనసాగుతోంది. వర్జీనియా నుంచే కాకుండా మొత్తం ఈస్ట్ కోస్ట్‌లో తొలిసారి ప్రతినిధుల సభకు ఎంపికైన సుహాస్ సుబ్రహ్మణ్యం చరిత్ర సృష్టించారు. ఐదుగురు ఇండియన్ అమెరికన్స్ ఉండే కాంగ్రెస్ సమోసా కాకస్‌లో చోటు దక్కించుకున్నారు. మిచిగన్ నుంచి శ్రీ తానేదార్ రెండోసారి, ఇల్లినాయిస్ నుంచి రాజా కృష్ణమూర్తి విజయఢంకా మోగించారు. మరికొందరి ఫలితాలు రావాల్సి ఉంది.

News November 6, 2024

నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

image

AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసుతో పాటు టీడీపీ ఆఫీసు, బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై గతంలో అమరావతిలో జరిగిన దాడి ఘటనల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో నందిగం సురేశ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News November 6, 2024

క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఢిల్లీకి పవన్

image

ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరనున్నారు. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల మధ్యలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News November 6, 2024

‘పుష్ప 2’ మేకర్స్ భారీ ప్లాన్?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రానున్న ‘పుష్ప 2’ మూవీ ప్రమోషన్లు భారీగా చేపట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు టాక్. పుణే, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, హుబ్లీ, చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌తోపాటు దుబాయ్ లేదా అమెరికాలో ప్రెస్ మీట్లు, పబ్లిక్ ఈవెంట్లు నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 5న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News November 6, 2024

గెలిచేదెవరైనా US మరింత ఒంటరవ్వడం ఖాయం: జైశంకర్

image

ప్రెసిడెంట్‌గా గెలిచేదెవరైనా అమెరికా మరింత ఒంటరి (Isolationist) అవ్వడం ఖాయమేనని EAM జైశంకర్ అన్నారు. ఇతర దేశాలపై వారి పెత్తనం, రాజకీయ జోక్యం తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఒబామా హయాం నుంచి గ్లోబల్ కమిట్‌మెంట్స్‌ అంశంలో అమెరికా అప్రమత్తంగా ఉంటోందని వివరించారు. డొనాల్డ్ ట్రంప్ దీనిని బాహాటంగానే చెప్తుంటారని పేర్కొన్నారు. ఏదేమైనా అమెరికాతో భారత్ సంబంధాలు మరింత మెరుగవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

News November 6, 2024

BIG BREAKING: అల్లు అర్జున్‌కు ఊరట

image

AP: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. నంద్యాలలో ఆయనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాలకు వెళ్లగా, అనుమతి లేని పర్యటన, కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పిచ్చింది.

News November 6, 2024

పుంజుకున్న కమలా హారిస్.. తేడా 20 ఓట్లే

image

అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ అనూహ్యంగా పుంజుకున్నారు. ప్రత్యర్థితో పోలిస్తే కేవలం 20 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ 230, కమల 210తో నిలిచారు. ఒకానొక దశలో 100 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమెను కాలిఫోర్నియా, హవాయి, వర్జీనియా, నెబ్రాస్కా, న్యూమెక్సికో, వాషింగ్టన్ ఆదుకున్నాయి. నార్త్ కరోలినాను దక్కించుకోవడంతో వైట్‌హౌస్‌కు ట్రంప్ మార్గం సుగమమైందని తెలుస్తోంది.

News November 6, 2024

T-HUB స్టార్టప్‌ కంపెనీ ఘనత.. KTR విషెస్

image

TG: హైదరాబాద్‌లోని టీహబ్‌లో ఏర్పాటైన తెలంగాణకు చెందిన స్టార్టప్ కంపెనీ మారుత్ డ్రోన్స్ 6.2మిలియన్ డాలర్ల ఫండింగ్ సాధించడం పట్ల కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. T-HUB 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించడం సంతోషంగా ఉందన్నారు. మారుత్ డ్రోన్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

News November 6, 2024

సర్వేకు ప్రజలు సహకరించాలి: మంత్రి పొన్నం

image

తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే మొదలైంది. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని మంత్రి కోరారు. అందరికీ న్యాయం చేయడం కోసమే సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను, అపోహలను నమ్మొద్దని సూచించారు.