India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీలపై ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. 2019లో భీమవరంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్పై గ్రంథి శ్రీనివాస్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇటు పలు జిల్లాల్లో వ్యాపారుల ఇళ్లలో ఏసీబీ రైడ్స్ చేపట్టింది.
TG: ఆరోగ్య శ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఎంప్యానెల్ ఆస్పత్రుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిబంధనలను సులభతరం చేయనుంది. 50 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు ఎంప్యానెల్ అయ్యే అవకాశం కల్పించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న 347 ఆస్పత్రులకు మరో 150 జత అవుతాయి. ఆస్పత్రుల అనుమతులపై నిర్ణయం తీసుకునే ఎంప్యానెల్ డిసిప్లినరీ కమిటీని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.
AP: హైదరాబాద్లో మాజీ సీఎం ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ తెలిపారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన చోటే విగ్రహం ఆవిష్కరిస్తామని చెప్పారు. కాగా విగ్రహంతోపాటు కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం కూడా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్ను టీడీపీ నేతలు కలిసినట్లు సమాచారం.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్కు ఆమోదం పలికింది. ఏపీ ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. CRDA పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఆమోదం లభించింది.
మధ్యప్రదేశ్లో ఓ హత్య కేసు నిందితుడిని ఈగలు పట్టించాయి. జబల్పూర్ జిల్లాకు చెందిన మనోజ్ ఠాకూర్ (25) హత్యకు గురయ్యాడు. హత్యాస్థలంలో విచారణ చేస్తుండగా గుంపులోని ధరమ్ ఠాకూర్ (19) అనే వ్యక్తిపై ఈగలు వాలడాన్ని పోలీసులు గమనించారు. అతడి దుస్తులు, ఛాతిపై రక్తపు మరకలు ఉన్నాయి. ఫొరెన్సిక్ టెస్ట్లో మృతుడి రక్తపు మరకలేనని తేలింది. మద్యం తాగే క్రమంలో గొడవ జరిగి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు
జపాన్ ఇంపీరియల్ ఫోర్స్ ఆక్రమణలో ఉన్న అండమాన్ నికోబార్ దీవిని 1943లో ఇదేరోజున భారత సైన్యం సుప్రీం కమాండర్ సుభాష్ చంద్రబోస్ స్వాధీనం చేసుకున్నారు. టోక్యోలో జపాన్ ప్రధానిని కలిసిన తర్వాత నవంబర్ 6, 1943న A&N దీవులను భారత్కు అప్పగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అనంతరం 30 డిసెంబర్ 1943న భారత గడ్డపై తొలిసారిగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని నేతాజీ ఎగురవేశారు.
జపాన్ టెక్నాలజీలో దూసుకెళ్తూనే సరికొత్త పద్ధతులను తీసుకొస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. అక్కడ ఆఫీసుకు లేటుగా వచ్చే ఉద్యోగుల కోసం ఇంట్రెస్టింగ్ రూల్ను అమలు చేస్తున్నారు. ముందుగా కార్యాలయానికి వచ్చిన వారు తమ కారును దూరంగా పార్క్ చేయాలి. అలా చేయడం వల్ల ఆలస్యంగా వచ్చేవారు తమ కారును దగ్గరగా పార్క్ చేసి సమయానికి ఆఫీసుకు వచ్చేలా చేస్తుంది. ఉద్యోగులు పరస్పరంగా ఇలా ఒప్పందం చేసుకుంటారని తెలుస్తోంది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ప్రేక్షకులను అలరిస్తూనే మంచి కలెక్షన్లు రాబడుతోంది. అయితే, రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 30న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి బడ్జెట్, నూతన క్రీడా విధానం, డ్రోన్, సెమీ కండక్టర్ పాలసీలు, ప్రభుత్య ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంపుదలపై క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఇటు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లపైనా చర్చించనున్నారు.
బాలీవుడ్ ‘రామాయణ’ మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. 2026 దీపావళికి మొదటి, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి. నితేశ్ తివారీ రూపొందించనున్న ఈ మూవీలో బాబీ డియోల్, యశ్ కీలకపాత్రలు పోషిస్తారు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తారు.
Sorry, no posts matched your criteria.