India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం నేడు ప్రారంభం కానుంది. ‘న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్’ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీకానికి సమానమైన మాసము, కేశవుడికి సమానమైన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు శుభప్రదం. * రోజూ ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.

రబీలో నేల స్వభావం, నీటి తడులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల రైతులు అధిక దిగుబడి సాధించి లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. నీటి సౌకర్యం ఉన్న ఎర్ర, నల్లరేగడి నేలల్లో వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, అలసంద, కుసుమ, నువ్వులు సాగు చేయవచ్చు. వర్షాధార ఎర్ర నేలల్లో ఉలవలు, జొన్నలు.. వర్షాధార నల్ల రేగడి నేలల్లో శనగ, కుసుమ, ఆవాలు సాగు చేయవచ్చు.

వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల చైనా ఎరువుల ఎగుమతులు నిలిపివేయడంతో రబీ సీజన్లోనూ ఇబ్బందులు తప్పేలా లేవు. యూరియా, డీఏపీ తదితర ఎరువులను దాదాపు 95% ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఆంక్షలతో ధరలు 10-15% మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 5-6 నెలలు కొనసాగొచ్చని తెలుస్తోంది. దీంతో రైతులపై అదనపు భారం పడనుంది.

AP: తిరుమల శ్రీవారి ట్రస్టులకు గత 11 నెలల్లో రూ.918.59 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.338.8 కోట్లు, శ్రీవాణి ట్రస్టుకు రూ.252.83 కోట్లు, ఎస్వీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంకు రూ.97.97 కోట్లు, ప్రాణదానం ట్రస్టుకు రూ.66.53 కోట్లు, గోసంరక్షణకు రూ.56.77 కోట్లు, విద్యాదానం ట్రస్టుకు రూ.33.47 కోట్లను దాతలు అందించారు. ఆన్లైన్లో రూ.579.38 కోట్లు, ఆఫ్లైన్లో రూ.339.2 కోట్లు వచ్చాయి.

వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది మహిళలకు పేల సమస్య ఉంటుంది. వాటిని వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికి పరిష్కారంగా వచ్చిందే ఈ ఎలక్ట్రిక్ హెడ్ లైస్ కోంబ్. చూడటానికి ట్రిమ్మర్లా కనిపించే ఈ డివైజ్ పేలతో పాటు, వాటి గుడ్లనూ ఫిల్టర్లోకి లాగేస్తుంది. తర్వాత డివైజ్ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ప్రయత్నించి చూడండి.

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్తో పాటు ఒక టబ్లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.

NIT ఢిల్లీలో 14 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://nitdelhi.ac.in/

కార్తీక మాసంలో శివాలయాలను సందర్శించడం శుభప్రదం. APలో నంద్యాల(D) శ్రీశైలం, మహానంది, యాగంటి తూ.గో(D) ద్రాక్షారామం, తిరుపతి(D) శ్రీకాళహస్తి, గుంటూరు(D) కోటప్పకొండ, అమరావతి అమరేశ్వర ఆలయం, ప.గో.(D) క్షీరారామం, భీమవరంలోని సోమారామ ఆలయాలు ప్రసిద్ధి. TGలోని సిరిసిల్ల(D) వేములవాడ రాజరాజేశ్వరుడు, సిద్దిపేట(D) మల్లన్న, భూపాలపల్లి(D) కాళేశ్వరం, వరంగల్(D) వెయ్యిస్తంభాల గుడి, రామప్ప ఆలయాలు ప్రసిద్ధి.

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇవాళ నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరుపతి, కడప, ప్రకాశంలోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అక్కడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు 280కిపైగా నామినేషన్లు దాఖలు. ఇవాళ నామినేషన్లను పరిశీలించనున్న అధికారులు.. ఉపసంహరణకు 24వరకు గడువు
* ఈ నెల 25లోపు ‘తెలంగాణ రైజింగ్’ సర్వేలో పాల్గొనాలన్న ప్రభుత్వం.. ఇప్పటికే 3 లక్షల మంది పాల్గొన్నారని వెల్లడి
* రేపు మంత్రివర్గ భేటి. స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై చర్చ
* ఎప్సెట్ బైపీసీ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి.. బీ ఫార్మసీలో 96.67% మందికి సీట్లు అలాట్.
Sorry, no posts matched your criteria.