India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యూపీ సంభల్లోని అల్లీపూర్లో దాదాపు 300-400 ఏళ్ల నాటి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. గురు అమరపతి మెమోరియల్ సైట్ వద్ద బయటపడిన ఈ నాణేల్లో ఒక దానిపై సీతారాములు, లక్ష్మణుని చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కొన్ని బ్రిటిష్ కాలం నాటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక్కడ 21 మంది సాధువుల సమాధులు ఉన్నాయని, ఇటీవల ఓ అస్థిపంజరం బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ స్మారక ప్రదేశం 1920 నుంచి ASI రక్షణలో ఉంది.

ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన 5 నెలలకే తనను వదిలిపెట్టిన భార్యకు భర్త గట్టిగా బుద్ధి చెప్పాడు. రాజస్థాన్ కోటాకు చెందిన మనీశ్ మీనా తన భార్య సప్నను చదివించేందుకు భూమిని తాకట్టు పెట్టి రూ.15 లక్షల లోన్ తీసుకున్నాడు. సప్న 2023లో రైల్వేలో ఉద్యోగం సాధించింది. ఉద్యోగం లేదని భర్తను దూరం పెట్టింది. సప్నకు బదులు డమ్మీ క్యాండిడేట్ ఎగ్జామ్ రాశాడని మనీశ్ ఆధారాలు సమర్పించడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.

థాయ్లాండ్లో ఒకేసారి వందలాది మంది LGBTQ జంటలు వివాహం చేసుకున్నాయి. సేమ్ సెక్స్ మ్యారేజ్కు చట్టబద్ధత కల్పించడంతో వారంతా వరుస కట్టి పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో ఆగ్నేయాసియాలో ఈ చట్టం కలిగిన తొలి దేశంగా థాయ్లాండ్ నిలిచింది. 18 కంటే ఎక్కువ వయసున్న వారెవరైనా లింగంతో సంబంధం లేకుండా పెళ్లిచేసుకోవాలని. అలాగే వైఫ్ & హస్బెండ్ అనే పదాలను కూడా ‘స్పౌస్’గా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.

రంజీల్లో ఓ వైపు భారత స్టార్ బ్యాటర్లు విఫలమవుతుండగా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన ఆల్రౌండర్ జడేజా అదరగొట్టారు. ఢిల్లీతో జరిగిన మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఏకంగా 12 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్సులో 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. బ్యాటుతోనూ రాణించి 38 పరుగులు చేశారు. ఈ మ్యాచులో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024ను ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు పాట్ కమిన్స్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. టీమ్ ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు. జట్టు: కమిన్స్, జైస్వాల్, బెన్ డకెట్, విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్, జడేజా, హెన్రీ, బుమ్రా.

TG: హైదరాబాద్లోని అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును CIDకి అప్పగించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా 6 నెలలుగా ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్కు రూ.50 లక్షలు వసూలు చేశారని సమాచారం.

చాలా మంది తమ రోజును టీతో ప్రారంభిస్తారు. కానీ పదే పదే వేడి చేసిన టీ తాగడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ టీలో రుచి మారి పోషకాలు తగ్గిపోతాయి. చాలాసేపు ఉడికించిన టీ తాగడం వల్ల కడుపు నొప్పి, పొత్తి కడుపువాపు రావచ్చు. చర్మంపై మొటిమలు కూడా ఏర్పడతాయి. ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది. డీహైడ్రేషన్ ఏర్పడి శరీర ఆరోగ్యం క్షీణించేలా చేస్తుంది. టీ కాచిన 15 నిమిషాల్లోగా తాగడం ఉత్తమం.

యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. ఇంటర్నెట్ లేకుండా వాయిస్, SMS ప్లాన్లను ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన రూ.458 ప్లాన్లో అపరిమిత కాల్స్, వెయ్యి SMSలు పంపుకోవచ్చు. రూ.1958 ప్లాన్లో 365 రోజుల పాటు అపరిమిత కాల్స్, 3600 SMSలు పంపుకోవచ్చు. డేటా అవసరం లేని వారి కోసం ప్లాన్లు తీసుకురావాలని TRAI టెలికం సంస్థలను ఆదేశించింది.

TG: మీర్పేట్కు చెందిన మాధవి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మాధవి ఇద్దరు పిల్లల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. తమ తల్లి కనిపించకుండా పోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని చెప్పారు. మరోవైపు నిందితుడు చెప్పిన విషయాలపైనే కాకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను వేధిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ‘ఒప్పందాలు పేపర్కే పరిమితం కావొద్దు. రాష్ట్రానికి చెందిన వారిని దావోస్కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి? పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.