News October 23, 2025

మానవాళికి దైవానుగ్రహం ఎందుకు అవసరం?

image

మనం వేసిన విష బీజం విష ఫలాన్నే ఇస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలితంగా మనకు బాధలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ కర్మ బంధాన్ని తెంచుకోవడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదు. ఎందుకంటే, మన కర్మలన్నీ అసంఖ్యాకమైనవి. అందుకే, ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి దైవానుగ్రహం అవసరం. ఆ దేవుడి కృప మనకు లభించినప్పుడు, ఆయన శక్తి మన కర్మ ఫలాలను తొలగించి, కష్టాల నుంచి విముక్తిని, నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. <<-se>>#Daivam<<>>

News October 23, 2025

భారత్ ఓటమి

image

AUSతో జరిగిన రెండో వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఇంకో మ్యాచ్ ఉండగానే 0-2 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన IND 50 ఓవర్లలో 264-9 రన్స్ చేసింది. 265 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో గెలిచింది. షార్ట్(74), కాన్లీ(61), ఒవెన్(36) రాణించారు. IND బౌలర్లలో హర్షిత్ రాణా, సుందర్, అర్ష్‌దీప్ తలో 2 వికెట్లు తీశారు. 25న సిడ్నీలో మూడో వన్డే జరగనుంది.

News October 23, 2025

రావి చెట్టును ఎందుకు పూజించాలి?

image

రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. యజ్ఞాలలో జమ్మితో పాటు రావి కర్రలను కూడా ఉపయోగిస్తారు. దీని ఔషధ గుణాలు అనారోగ్యాలను దూరం చేస్తాయి. గర్భదోషాలు తొలగించే గుణం ఉన్నందున సంతానం లేనివారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం. బుద్ధునికి జ్ఞానోదయమైంది ఈ వృక్షం కిందే. అందుకే ఆలయాల్లో రావి వృక్షాలకు కూడా పూజలు చేస్తారు. ☞ ఇలాంటి ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.

News October 23, 2025

కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రతికూల పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కీలకంగా చర్చిస్తున్నారని సమాచారం. ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన కొండా సురేఖ సైతం క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు.

News October 23, 2025

మహిళలూ బండిపై ప్రయాణిస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఈ బిజీ ప్రపంచంలో మహిళలు కూడా నిత్యం వాహనాలు నడపడం తప్పనిసరైంది. అయితే ఈ సమయంలో ప్రమాదాలు నివారించడానికి కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బండి నడిపేటపుడు చీర కొంగు, చున్నీ ఎగరకుండా బిగించి కట్టుకోవాలి. లేదంటే చక్రాలకు శారీగార్డు ఏర్పాటు చేసుకోవాలి. హెల్మెట్ వాడటం తప్పనిసరి. పిల్లలతో ప్రయాణించేటపుడు టూ వీలర్​ బేబీ బెల్ట్​, ఛైల్డ్‌ క్యారియర్‌ వాడటం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది.

News October 23, 2025

సన్నధాన్యం: ఈ ప్రమాణాలు ఉంటేనే రూ.500 బోనస్

image

TG: సన్నధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు ₹500 బోనస్ ఇస్తోంది. అయితే బియ్యపు గింజ పొడవు, వెడల్పుల నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేర ఉంటేనే బోనస్ వస్తుంది. గ్రెయిన్ కాలిపర్ అనే మిషన్‌ ద్వారా గింజ పొడవు, వెడల్పు కొలుస్తారు. గింజ పొడవు 6mm, వెడల్పు 2mm కంటే తక్కువ ఉండాలి. పొడవు, వెడల్పుల నిష్పత్తి 2.5mm కంటే ఎక్కువ ఉండేవాటికి ప్రాధాన్యం ఇస్తారు. * రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News October 23, 2025

258 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. B.E./B.Tech/M.Tech పూర్తి చేసిన వారు అర్హులు. వారి గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 18-27 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఈ వారంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. వెబ్‌సైట్: https://www.mha.gov.in/

News October 23, 2025

బ్రహ్మచర్యంలో పాటించాల్సిన 8 నియమాలు

image

బ్రహ్మచర్యాన్ని పూర్వీకులు 8 విధాలుగా వివరించారు. అవి..
1. మహిళల రూపంపై దృష్టి సారించకుండా ఉండడం, 2. వారిని తాకకపోవడం, 3. స్త్రీలు నాట్యమాడుతుండగా చూడకపోవడం, 4. శారీరక సుఖాలకు సంబంధించిన సంభాషణలకు దూరంగా ఉండటం, 5. స్త్రీలతో ఒంటరిగా ఉండే అవకాశాలను నివారించడం, 6. మనస్సులో శృంగారపరమైన ఆలోచనలు రాకుండా ఉండటం, 7. వివాహ ప్రయత్నాలను ఆపడం, 8. శారీరక సుఖాన్ని కోరుకోకుండా ఉండడం. <<-se>>#Sankhya<<>>

News October 23, 2025

MLA కొలికపూడి vs MP కేశినేని చిన్ని

image

AP: MP కేశినేని చిన్నీపై తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. MLA టికెట్ కోసం MPకి రూ.5 కోట్లు ఇచ్చానంటూ బ్యాంక్ స్టేట్మెంట్‌ను వాట్సాప్‌ స్టేటస్ పెట్టారు. ‘తిరువూరులో దొంగే దొంగని అరుస్తున్నాడు. ఆరోపణలపై సాక్ష్యాలు ఇవ్వాలి. నేను సంపాదించుకోవాలనుకుంటే తిరువూరు దాకా వెళ్లక్కర్లేదు’ అని చిన్ని తెలిపారు. ఈ వివాదంపై MP, MLAని పల్లా శ్రీనివాసరావు రేపు NTR భవన్‌కు పిలిచారు.

News October 23, 2025

10వేలు కాదు.. 4వేల అడుగులు నడిచినా సేఫే: అధ్యయనం

image

ప్రతిరోజూ పది వేల అడుగులు నడవాలని వైద్యులు సూచించడంతో ఈ లక్ష్యాన్ని చేరుకోలేక చాలామంది ఆందోళన చెందుతుంటారు. అయితే వృద్ధ మహిళలు వారానికి ఒకట్రెండు రోజులు కేవలం 4వేల స్టెప్స్ నడిచినా చాలని, ఇది అకాల మరణం & గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. వారంలో ఎక్కువ రోజులు 4,000 స్టెప్స్ లేదా అంతకంటే ఎక్కువ నడిస్తే, మెరుగైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయని స్టడీ స్పష్టం చేసింది.