News January 26, 2025

క్రేజీ.. రామ్ చరణ్ సినిమాలో బాలీవుడ్ హీరో?

image

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘RC16’లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రణ్‌బీర్‌కు దర్శకుడు కథ వినిపించగా ఆయన ఓకే చెప్పారని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం.

News January 26, 2025

పద్మ అవార్డు గ్రహీతలకు YS జగన్ విషెస్

image

పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారికి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం), నంద‌మూరి బాల‌కృష్ణ (క‌ళ‌లు), మంద కృష్ణ మాదిగ (ప్ర‌జా వ్య‌వ‌హారాలు), మాడుగుల నాగ‌ఫ‌ణి శ‌ర్మ (క‌ళ‌లు), కేఎల్ కృష్ణ (విద్య‌, సాహిత్యం), మిరియాల అప్పారావు (మ‌ర‌ణానంత‌రం) (క‌ళ‌లు), వాదిరాజు రాఘ‌వేంద్రాచారి పంచ‌ముఖి (విద్య, సాహిత్యం)’ అని వారి పేర్లను ట్వీట్ చేశారు.

News January 26, 2025

రోహిత్ రిటైరవ్వకండి.. 15 ఏళ్ల అభిమాని లేఖ

image

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ అభిమాని లేఖ రాశారు. ‘నేను క్రికెట్ చూసేందుకు మీరే కారణం. ఈ మధ్య కాలంలో మీరు విఫలమవుతున్నా ఛాంపియన్స్ ట్రోఫీలో తిరిగి ఫామ్‌లోకి వస్తారని ఆశిస్తున్నా. రంజీలో మీరు కొట్టిన సిక్సర్లు అద్భుతం. మీరు ఎప్పుడూ రిటైరవ్వకండి. మైదానంలో ప్రతి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా, ప్లేయర్‌గా అదరగొడుతారు’ అని ఇన్‌స్టా ఐడీతో ఫ్యాన్ రాసుకొచ్చారు. ఈ లేఖను రోహిత్ టీమ్ షేర్ చేసింది.

News January 26, 2025

అదరగొట్టిన భారత బౌలర్లు

image

ఐసీసీ U19 ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచులో భారత బౌలర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 64/8కే పరిమితమైంది. ఆ జట్టు ప్లేయర్లలో సుమియా (21) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో వైష్ణవి 3 వికెట్లు పడగొట్టగా, షబ్నమ్, జోషిత, త్రిష తలో వికెట్ తీశారు. భారత్ గెలవాలంటే 20 ఓవర్లలో 65 పరుగులు చేయాలి.

News January 26, 2025

రాజమౌళిపై నెటిజన్లు ఫైర్.. కారణమిదే!

image

పద్మ అవార్డులకు ఎంపికైన వారిని అభినందిస్తూ ఫిల్మ్ డైరెక్టర్ రాజమౌళి పెట్టిన పోస్టుపై పలువురు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ‘ఈసారి ఏడుగురు తెలుగు వాళ్లకు పద్మ అవార్డులు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భారతీయ పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ‘అందరూ భారతీయులే. తెలుగు, ఇండియన్స్ అంటూ ఎందుకు మాట్లాడటం. ప్రాంతీయ భేదాలు ఎందుకు?’ అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

News January 26, 2025

కడపలో వైసీపీ, జనసేన ఫ్లెక్సీల కలకలం

image

కడప ఆర్ట్స్ కాలేజీ వద్ద YSRCP, జనసేన ఫ్లెక్సీలు హాట్ టాపిక్‌గా మారాయి. అధికారం ఉన్నా లేకపోయినా, ఎవరు వెళ్లిపోయినా కార్యకర్తలంతా జగన్ వెంటే ఉంటామని ఆ పార్టీ వారు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక మరో ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ 50 కాకుండా 21 సీట్లే తీసుకుని నష్టపోయారని జనసేన పేరిట ఫ్లెక్సీలు వెలిశాయి. పవన్‌ను వదిలేసి టీడీపీ నేతలు దావోస్ వెళ్లారంటూ అందులో విమర్శలున్నాయి. వీటిపై స్థానికంగా చర్చ నడుస్తోంది.

News January 26, 2025

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. మరో ట్విస్ట్!

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు మరో మలుపు తీసుకుంది. ఈ నెల 15న సైఫ్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సైఫ్ నివాసంలో 19 సెట్ల వేలిముద్రల్ని క్లూస్ టీమ్ సేకరించగా, వాటిలో ఒక్కటి కూడా నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ వేలిముద్రలతో సరిపోలేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ముంబై పోలీసులు మరోమారు ఘటనాస్థలాన్ని, సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

News January 26, 2025

ఒత్తిడి వల్లే పరుగులు చేయలేకపోతున్నా: గిల్

image

రెడ్ బాల్ క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని తనపై తాను ఒత్తిడి పెట్టుకుంటున్నట్లు శుభ్‌మన్ గిల్ తెలిపారు. దాని వల్లే కొన్నిసార్లు ఏకాగ్రతను కోల్పోయి ఔట్ అవుతున్నట్లు చెప్పారు. కర్ణాటకVSపంజాబ్ రంజీ మ్యాచులో సెంచరీ చేసిన గిల్, ఇటీవల జరిగిన BGTలో విఫలమైన సంగతి తెలిసిందే. 6 ఇన్నింగ్స్‌లలో 18.60 సగటుతో కేవలం 93 ​​పరుగులు చేశారు. దీంతో అతడిపై విమర్శలొచ్చాయి.

News January 26, 2025

వర్సిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఎం

image

TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పదేళ్లు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో మాట్లాడుతూ వర్సిటీల పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. VCలుగా అన్ని సామాజిక వర్గాల వారు ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను ఆదేశించారు. UGC ద్వారా వీసీల నియామకాలు చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందన్నారు.

News January 26, 2025

BREAKING: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం

image

TG: అన్ని రెగ్యులర్ కాలేజీల మాదిరే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకూ ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని CM రేవంత్ ప్రకటించారు. HYDలోని డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఓపెన్ వర్సిటీలో ఫీజులు చాలా తక్కువే ఉంటాయని, ఇది ప్రభుత్వానికి పెద్ద భారమేమీ కాదన్నారు. ఆయా వివరాలను వెంటనే సేకరించాలని సీఎస్‌ను రేవంత్ ఆదేశించారు.