India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తేది: నవంబర్ 7, గురువారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:03 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:17 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:06 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:42 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
✒ తేది: నవంబర్ 7, గురువారం
✒ షష్ఠి: రాత్రి 12.35 గంటలకు
✒ పూర్వాషాఢ ఉ.11.46 గంటలకు
✒ వర్జ్యం: రా.7.52-9.29 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.9.56-10.42 గంటల వరకు
✒ తిరిగి: 2.31-3.16 గంటల వరకు
గ్యాస్ సమస్య వచ్చి గుండెల్లో మంటగా అనిపిస్తే ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల ఛాతీలో మంట వస్తుంటుంది. అప్పుడు ఆసరాగా దిండ్లు పెట్టుకొని పడుకుంటే మంట తీవ్రత తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. ఛాతీలో మంట రావడాన్ని గ్యాస్ట్రో ఒసోఫాగియల్ రిఫ్లక్స్ అంటారు. అయితే రాత్రంతా ఒకేవైపు పడుకోవాల్సిన అవసరం లేదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.
* అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం
* భూమి కబ్జా చేస్తే 10-14 జైలుశిక్ష.. ఏపీ క్యాబినెట్ నిర్ణయం
* కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ భేటీ
* మందకృష్ణతో పవన్ను తిట్టించింది చంద్రబాబే: VSR
* తెలంగాణలో కులగణన సర్వే ప్రారంభం
* కులగణన సిబ్బందికి ప్రజలు అందుబాటులో ఉండాలి: భట్టి
* కాంట్రాక్టులన్నీ సీఎం బామ్మర్ది, పొంగులేటికే: కేటీఆర్
* పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్రం ఆమోదం
TG: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన BC కమిషన్ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ నెల 18 నుంచి 26 వరకు ఈ పర్యటన ఉంటుంది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్లో పర్యటించనుంది. ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రత్యేక కమిషన్తో సమాచారం పంచుకోనుంది.
అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మరోసారి ఇద్దరం కలిసి పనిచేద్దామని, ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునే దిశగా చర్యలు తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచశాంతికి కృషి చేద్దామన్నారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని.. భారత్ అద్భుత దేశమని ట్రంప్ కొనియాడారు. భారత్, మోదీని నిజమైన స్నేహితులుగా భావిస్తానని ఆయన తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు తెలుపుతూ షేక్ హసీనా పేరుతో అవామీ లీగ్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇందులో హసీనాను బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రస్తావించడమే దీనికి కారణం. రిజర్వేషన్లపై నిరసనలతో హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడగా మహమ్మద్ యూనస్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ రూ.3.5 కోట్లతో ఇల్లు కొనుగోలు చేశారు. IPLలో KKR అతడిని రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్న కొద్ది రోజులకే యూపీ అలీగఢ్లోని ఓజోన్ సిటీలో ఖరీదైన 500 చదరపు గజాల బంగ్లాను కొన్నారు. కొద్ది రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. కాగా, రింకూ సింగ్ తండ్రి ఇదే ఓజోన్ సిటీలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారు. సక్సెస్ అంటే ఇదే కదా మరి!
తన ఐఫోన్-14 ప్రో మ్యాక్స్ ఫోన్ ఛార్జింగ్లో ఉండగా పేలిపోయిందని చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్కు చెందిన యువతి ఆరోపించారు. ఆ సమయంలో తాను నిద్రపోతున్నానని, పేలుడు కారణంగా చేతికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గది అంతటా మంటలు వ్యాపించి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. ఆమె ఆరోపణలపై యాపిల్ స్పందించింది. ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, దర్యాప్తు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘మొండితనానికి, సంకల్పబలానికి, మొక్కవోని దీక్షకు, తెగువకు ప్రతిరూపం ఎవరైనా ఉన్నారంటే అది డొనాల్డ్ ట్రంపే. అమెరికా వ్యవస్థాపక విలువల్ని రక్షిస్తూ ఆ దేశ ప్రజలకు ప్రజాస్వామ్యం ఇచ్చిన శక్తి ఓ అద్భుతం. అమెరికా 47వ అధ్యక్షుడికి కంగ్రాట్యులేషన్స్’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.