India's largestHyperlocal short
news App
            Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

✒ తిథి: శుక్ల పాడ్యమి సా.5.47 వరకు
✒ నక్షత్రం: శ్రవణం ఉ.8.49 వరకు
✒ శుభ సమయములు: సా.5.20 నుంచి 6.08 గంటల వరకు
✒ రాహుకాలం: మ.1.30-3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48 వరకు, మ.2.48 నుంచి 3.36 గంటల వరకు
✒ వర్జ్యం: మ.12.42-2.15 వరకు
✒ అమృత ఘడియలు: రా.10.02-11.39 వరకు 

కుంభమేళాలో 30 మంది భక్తులు తొక్కిసలాటలో మృతి చెందడం ఓ చిన్న ఘటన అంటూ UP మంత్రి సంజయ్ నిషాద్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ఈవెంట్లలో ఇలాంటివి చిన్న ఘటనలని, పైగా అనివార్యమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. తొక్కిసలాట ఘటన బాధాకరమని చెబుతూనే ఈ తరహా కార్యక్రమాలను నిర్వహించడం పెద్ద సవాల్ అని సంజయ్ నిషాద్ పేర్కొన్నారు.

☛ మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 30 మంది మృతి
☛ కుంభమేళా తొక్కిసలాటపై నేతల దిగ్భ్రాంతి
☛ ISRO 100వ ప్రయోగం సక్సెస్
☛ APలో రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్
☛ పెద్దిరెడ్డి ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
☛ ఫిబ్రవరి 10లోపు టూరిజం పాలసీ: రేవంత్ రెడ్డి
☛ రేపు BRS రాష్ట్ర వ్యాప్త నిరసనలు
☛ రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఉండాలి: బండి సంజయ్
☛ భారీగా పెరిగిన బంగారం ధరలు

యమునా జలాల్లో హరియాణా విషం కలిపిందన్న AAP అధినేత కేజ్రీవాల్ వ్యాఖ్యలపై EC సీరియస్ అయి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ఆ నోటీసులకు వివరణ ఇస్తూ.. యమునా జలాల విషయంలో తన వాదనలపై EC దర్యాప్తు చేయాలన్నారు. ఢిల్లీ ప్రజలను రక్షించేందుకే తన ప్రయత్నం అని చెప్పారు. కేజ్రీ వ్యాఖ్యల నేపథ్యంలో తాను యమునా నీళ్లే తాగుతానని PM మోదీ, నది వద్దకు వెళ్లి హరియాణా CM నీళ్లు తాగి కౌంటర్ ఇచ్చారు.

TG: ‘ఇందిరమ్మ ఇళ్లు’ మొదటి విడతలో మంజూరైన 72 వేల ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగిస్తున్నట్లు చెప్పారు. నిర్మాణాల పురోగతి, బిల్లుల చెల్లింపుల నిరంతర పర్యవేక్షణకు అధికారులు AI వినియోగించాలన్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఏపీ ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. రేపటి వరకు రూ.3వేల ఫైన్తో తత్కాల్ స్కీమ్లో ఫీజు చెల్లించవచ్చని ప్రకటనలో తెలిపింది. కాలేజీలు, విద్యార్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో ఈ అవకాశం కల్పించింది. మరోసారి పెంపు ఉండబోదని స్పష్టం చేసింది.

AP: రాష్ట్ర నూతన DGP హరీశ్ కుమార్ గుప్తా సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్న ఆయన తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అటు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత DGP ద్వారకా తిరుమలరావును ఏడాది పాటు RTC MDగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ, రైల్వేస్ మధ్య రేపు రంజీ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ ప్లేయర్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగనున్నట్లు ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ బదోని తెలిపారు. అటు 13 ఏళ్ల తర్వాత విరాట్ రంజీ క్రికెట్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోవాలని DDCA కోరగా కోహ్లీ తిరస్కరించిన విషయం తెలిసిందే. Jiocinema ఈ మ్యాచ్ను టెలికాస్ట్ చేయనుంది.

AP: ప్రభుత్వ స్కూళ్లలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా కార్యక్రమం చేపట్టాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ప్రైమరీ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి క్లాస్కు ఒక టీచర్ను నియమించే అంశం పరిశీలించాలన్నారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు, పేరెంట్స్ అభిప్రాయాలు IVRS ద్వారా తీసుకోవాలని సూచించారు. బాలికల స్వీయరక్షణ ట్రైనింగ్ కోసం శిక్షకులను నియమించాలని చెప్పారు.
Sorry, no posts matched your criteria.