India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీలో బంగారం ధర రూ.లక్షకు చేరువైంది. ఇవాళ సాయంత్రం రూ.1650 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఆల్టైం హైకి చేరి రూ.98,100గా నమోదైంది. US, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లు బంగారంపైకి భారీగా పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ ధరకు అనుగుణంగా దేశీయంగా గోల్డ్ రేట్స్కు రెక్కలొచ్చాయి. అతిత్వరలోనే ఇది రూ.లక్షను తాకనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పాక్, బంగ్లా మధ్య 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు రేపు ఢాకాలో భేటీ కానున్నారు. వాణిజ్య, భద్రతాపరమైన అంశాలపై వారు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగ్లాకు తమ ఎగుమతుల్ని పెంచే ఆలోచనలో పాక్ ఉంది. అఫ్గాన్, ఇరాన్ నుంచి కూడా ఉత్పత్తుల్ని పాక్ ద్వారా బంగ్లాకు చేరవేయాలని ఆ దేశం భావిస్తున్నట్లు సమాచారం.
వృద్ధాప్య అమెరికన్లకు కనీస ఆదాయం అందించే సోషల్ సెక్యూరిటీ ఏజెన్సీ నిధులను US ప్రభుత్వం తగ్గించిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. DOGE పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఫైరయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం 100రోజుల పాలన కాకముందే ప్రభుత్వం చరిత్రలో చూడని విధ్వంసం, నష్టం సృష్టించిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రసంగించారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగుల పాలిట గేమ్ ఛేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బ్యాంకర్లు ముందుకు వస్తే యువత ఆర్థికంగా ఎదుగుతారని, రూ.6వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశాలు ఉంటాయని తెలిపారు. కాగా ఈ పథకం దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగిసింది.
అల్లు అర్జున్-అట్లీ సినిమా ఖరారు కావడంతో ఈ గ్యాప్లో ఓ సినిమా చేయడంపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలో తమిళ హీరో శివకార్తీకేయన్కు ఆయన కథ చెప్పగా రెమ్యునరేషన్ రూ.70 కోట్లు అడిగినట్లు సమాచారం. ఇంత అమౌంట్ వెచ్చిస్తే వర్కౌట్ కాదని త్రివిక్రమ్ ఆసక్తి కనబరచనట్లు టాక్. దీంతో ప్రస్తుతం ఆ సినిమాను చేయట్లేదని తెలుస్తోంది. మరోవైపు వెంకీకి గురూజీ కథ చెప్పగా ఆయన ఓకే చెప్పాల్సి ఉంది.
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో హింస చెలరేగేలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కుట్ర పన్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. BSF బలగాలు బంగ్లాదేశ్ ఆగంతకులను దేశంలోకి చొరబడేలా అనుమతించాయన్నారు. అమిత్షా కేంద్ర బలగాలను తమ రాష్ట్రంపై ప్రయోగించకుండా ప్రధాని నియంత్రించాలని కోరారు. కాగా ఈ నిరసనల్లో ముగ్గురు చనిపోగా అనేకమంది గాయపడ్డారు.
వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ జరిగిన <<16100810>>ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై<<>> సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఘటనలు తమను బాధించాయని పేర్కొంది. అనంతరం వక్ఫ్ చట్టంపై ప్రశ్నించగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జవాబిచ్చారు. ‘వక్ఫ్ చట్టం కోసం చాలా కసరత్తు చేశాం. బిల్లుపై JPC 38 సమావేశాలు నిర్వహించింది. 98.2 లక్షల విజ్ఞప్తుల్ని పరిశీలించింది’ అని తెలిపారు.
APకి కీలకమైన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానానికి నిధులు ఇవ్వాలని CM చంద్రబాబు 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్, తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి నిధులు కోరారు. అమరావతి, తిరుపతి, విశాఖలను గ్రోత్ సెంటర్లుగా మార్చేందుకు గ్రాంట్లు, పోర్టులు, హార్బర్లు, లాజిస్టిక్ పార్కులు, ఎయిర్పోర్టులు నిర్మించేలా సాయానికి విజ్ఞప్తి చేశారు.
గుజరాత్ నుంచే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటమికి నాంది పలుకుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘ఇప్పుడు జరుగుతున్న ఫైట్ కేవలం రాజకీయపరమైనది కాదు. ఇది BJP-RSS, కాంగ్రెస్ భావజాలాల మధ్య పోరు. బీజేపీని ఓడించగలిగే ఏకైక పార్టీ కాంగ్రెసేనని యావత్ దేశానికి తెలుసు. త్వరలో పార్టీలో సమూల మార్పులు చేయనున్నాం’ అని వ్యాఖ్యానించారు.
AP: 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల పిల్లలకు 1వ క్లాసులో 25% సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం <
Sorry, no posts matched your criteria.