News May 7, 2025

ఆర్మీ నర్సింగ్ కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్.. పాకిస్థానీల పనేనా?

image

పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ నర్సింగ్ కాలేజీ వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య రెచ్చగొట్టే నినాదాలతో ఓ ఇమేజ్ పోస్ట్ చేశారు. హ్యాకర్ల బృందం తమను ‘టీమ్ ఇన్‌సేన్ పీకే’ అంటూ రాసుకుంది. దీనిని పరిష్కరించేందుకు భారత సైన్యం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను సంప్రదించింది.

News May 7, 2025

IPL: APR 25 అంటే CSKకు పండగే..!

image

ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో SRHతో CSK తలపడనుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ధోనీ సారథ్యంలో ఏప్రిల్ 25న జరిగిన మ్యాచుల్లో సీఎస్కే ఓటమే ఎరుగలేదు. ఇదే తేదీల్లో ఆ జట్టు 7 మ్యాచులాడి అన్నింట్లోనూ గెలిచింది. 2010-MI, 2011-PWI, 2013-SRH, 2014-MI, 2015-PBKS, 2018-RCB, 2021లో RCBపై గెలుపొందింది. ఇందులో ఓ ఫైనల్ మ్యాచ్ కూడా ఉండటం విశేషం. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.

News May 7, 2025

ఇంటర్‌లో తెలుగుకు బదులు సంస్కృతం?.. బోర్డు క్లారిటీ

image

TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజీగా తెలుగుకు ప్రత్యామ్నాయంగా సంస్కృతం ప్రవేశపెడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. 10 సంస్కృత లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం వివరాలు తెలుసుకునేందుకే అంతర్గత మెమో జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తెలుగు పట్ల ఇంటర్మీడియట్ విద్యా శాఖకు గౌరవం, అభిమానం ఉన్నాయని స్పష్టం చేశారు.

News May 7, 2025

సమాజానికి సేవ చేస్తే ఆ ఆనందమే వేరు: తమన్

image

సమాజానికి సేవ చేస్తే ఆనందం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన తలసేమియా సెంటర్ ప్రారంభించారు. ‘నారా భువనేశ్వరి చేసే మంచి పనులకు నేనెప్పుడూ అండగా ఉంటా. తలసేమియా రోగుల కోసం బ్లడ్ డొనేట్ చేయాలని ప్రచారం చేస్తా. జనాలకు మనం ఎంతో కొంత తిరిగిస్తేనే సంతోషం’ అని ఆయన పేర్కొన్నారు.

News May 7, 2025

చైనా కాదు.. US iPhones భారత్ నుంచే?

image

US-చైనా వాణిజ్య సంబంధాలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. US తమకు సంబంధించిన అన్నీ iPhone మోడల్స్ అసెంబ్లీ యూనిట్స్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 2026 మొదటికల్లా ఈ పని పూర్తవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే INDలో తమిళనాడు శ్రీపెరుంబుదూర్, కర్ణాటక బెంగళూరులోని Foxconn ప్లాంట్లలో ఐఫోన్స్ తయారవుతున్నాయి.

News May 7, 2025

LoC అంటే ఏంటి?

image

LoC అంటే జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ ప్రాంతాల్లో ఇండియా- పాక్ ఆర్మీలను వేరు చేసే నియంత్రణ రేఖ. 1972 సిమ్లా ఒప్పందం తర్వాత ఇరు దేశాల సమ్మతితో LoC అమలులోకి వచ్చింది. మొదట 1947 యుద్ధం ముగిశాక 1949లో CeaseFire Line(CFL) అని ఉండేది. ఆ ఒప్పందాన్ని మీరి పాక్ 1965, 1971లో భారత్‌పై యుద్ధం చేసింది. ఆ తర్వాత జులై 2, 1972లో ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో సిమ్లాలో ఒప్పందం మీద సంతకం చేసి తీసుకొచ్చిందే ఈ LoC.

News May 7, 2025

పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలి: DGP

image

పాకిస్థానీలను వెనక్కి పంపాలన్న కేంద్ర హోంమంత్రి <<16211349>>అమిత్ షా<<>> ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే ఇండియాను వీడాలని స్పష్టం చేశారు. ఈ నెల 27న వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, HYDలో 200 మంది పాకిస్థానీలు ఉన్నట్లు తెలుస్తోంది.

News May 7, 2025

భారత్‌ను వీడిన 188 మంది పాకిస్థానీలు.. అట్నుంచి 286 మంది రాక

image

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొని, ఇరు దేశాలు ఆంక్షలు విధించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ అట్టారీ- వాఘా బార్డర్ ద్వారా 188మంది పాకిస్థాన్ ప్రజలు ఆ దేశానికి వెళ్లారు. పాక్‌లోని 286 మంది భారతీయులు స్వదేశానికి తిరిగొచ్చారు. పహల్‌గామ్ ఉగ్రదాడి వేళ పాకిస్థాన్ దేశస్థులను భారత్ నుంచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా, ఆపై పాక్ కూడా ఇవే ఆంక్షలను భారతీయులపై విధించింది.

News May 7, 2025

కర్రెగుట్టలో ఏం జరగబోతోంది?

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్ట వద్ద మావోయిస్టులు దిగొచ్చినట్లు తెలుస్తోంది. సైనిక ఆపరేషన్ వెంటనే ఆపేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు రావాలని బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేశ్ పేరిట ప్రెస్‌నోట్ విడుదలైంది. ఈ లేఖపై పోలీసులు ఇంకా స్పందించలేదు. ప్రభుత్వాలు సైతం శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురు మావోయిస్టులు మరణించారు.

News May 7, 2025

ప్రధాని మోదీతో CM చంద్రబాబు భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మే 2న జరగబోయే అమరావతి పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అమరావతి నిర్మాణానికి తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్ర పరిస్థితులతో పాటు.. పహల్గామ్ ఉగ్రదాడి గురించి కూడా ప్రధానితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.