News August 10, 2025

పంచాయతీ ఎన్నికలు.. BIG UPDATE

image

TG: పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్న రూల్‌ను రద్దు చేసే ఛాన్సున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు చర్చ మొదలైంది. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

News August 10, 2025

పాక్‌తో సైన్యం చెస్ ఆడింది: ఆర్మీ చీఫ్ ద్వివేది

image

ఆపరేషన్ సిందూర్ సమయంలో దాయాది పాక్‌తో భారత సైన్యం చెస్ ఆడిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. శత్రు కదలికలు తెలియనప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ ఆ దేశానికి చెక్ పెట్టామన్నారు. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు చెప్పారు. దీంతో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. కాగా పాక్‌కు చెందిన 5 ఫైటర్ జెట్లు, ఓ విమానాన్ని కూల్చేశామని IAF చీఫ్ <<17350664>>చెప్పిన<<>> విషయం తెలిసిందే.

News August 10, 2025

IPL: వైభవ్ వల్లే RRను వీడుతున్న సంజూ?

image

రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడాలని సంజూ <<17338073>>శాంసన్<<>> నిర్ణయించుకోవడానికి కారణం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది IPLలో RR ఓపెనర్‌గా దిగిన అతడు విధ్వంసం సృష్టించారు. ఇకపైనా వైభవ్‌నే ఓపెనర్‌గా కొనసాగించాలని యాజమాన్యం నిర్ణయించుకుందని సమాచారం. దీంతో అప్పటివరకు యశస్వీతో కలిసి ఓపెనింగ్ చేసిన సంజూకు మొండిచేయి ఎదురైంది. అందుకే అతడు జట్టును వీడాలనుకుంటున్నట్లు సమాచారం.

News August 10, 2025

ఆదివాసీలకు చదువు ఉచితం: చక్రపాణి

image

TG: ఆదివాసీ బిడ్డలకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా ఉన్నత విద్యను అందించనున్నట్లు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ VC ఘంటా చక్రపాణి తెలిపారు. ‘ఆదివాసీలకు చదువును చేరువ చేయాలని ప్రణాళిక రూపొందించాం. ఉచితంగా చదువు చెప్తాం. గోండు, కోయ, చెంచు తదితర తెగల వారికి ఫీజు లేకుండా కేవలం రూ.500తోనే అడ్మిషన్, పుస్తకాలు అందిస్తాం’ అని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 040-23680333, 23680555 నంబర్లను సంప్రదించాలన్నారు.

News August 10, 2025

రాజసానికి మారుపేరు మృగరాజు

image

ఇవాళ ప్రపంచ సింహాల దినోత్సవం. సింహాలు నీళ్లు లేకుండా 4 రోజులు జీవిస్తాయి. కానీ ప్రతి రోజూ తినాల్సిందే. రోజుకు దాదాపు 7-8 కిలోల మాంసం తింటాయి. 20 గంటలు విశ్రాంతి తీసుకుంటాయి. జీబ్రా, అడవి దున్నలు, జింకలు వంటి పెద్ద జంతువులనే వేటాడుతాయి. ఇవి గంటకు 80 km వేగంతో పరుగెత్తుతాయి. 36 అడుగుల దూరం దూకగలవు. అడవికి రాజైనా మైదానాల్లో నివసించేందుకే ఇష్టపడతాయి. ఇవి 150 నుంచి 250 కిలోల వరకు బరువు పెరుగుతాయి.

News August 10, 2025

రేపటి నుంచి నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ

image

TG: ఆగస్టు 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో మాత్రల పంపిణీ చేస్తామని, 1-19 సంవత్సరాలున్న వారంతా ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. పేగుల్లో ఉండే నులిపురుగులను నివారించి, రక్తహీనతను అధిగమించేందుకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు ఇవి దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు.

News August 10, 2025

కోహ్లీ, రోహిత్‌కు BCCI బిగ్ షాక్?

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు BCCI బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2027 ODI WC ప్లాన్ నుంచి వీరిద్దరిని తప్పించనున్నట్లు సమాచారం. ఒకవేళ వీరు WC ఆడాలనుకుంటే విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలనే రూల్ విధిస్తున్నట్లు టాక్. వీరి స్థానంలో కుర్రాళ్లను ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా కోహ్లీ, రోహిత్ వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

News August 10, 2025

‘సృష్టి’ కేసు.. రంగంలోకి ఈడీ

image

TG: ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్‌ కేసులో ED రంగంలోకి దిగింది. ఇందులో మనీలాండరింగ్ కూడా జరిగిందని, కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులకు లేఖ రాసింది. ప్రధాన నిందితురాలు డా.నమ్రత 8 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగించి, చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. 80 మంది పిల్లలను విక్రయించి సుమారు రూ.25 కోట్లు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు భావిస్తున్నారు.

News August 10, 2025

భారీగా పడిపోయిన ధరలు

image

అమెరికా టారిఫ్‌ల ప్రభావం ఏటా రూ.20 వేల కోట్ల ఎగుమతులు చేసే APలో ఆక్వా రంగంపై పడింది. ట్రంప్ 50% సుంకం విధించడంతో ఉమ్మడి గోదావరి, కృష్ణా, GNT, ప్రకాశం, NLR జిల్లాల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. సుంకం పెంచుతున్నట్లు ఆయన చెప్పగానే ఎగుమతిదారులు రొయ్యల ధరలను భారీగా తగ్గించేశారు. 25 కౌంట్ KG రొయ్య ధర ₹565 నుంచి ₹430కు తగ్గింది. మిగతా వాటి ధరలూ KGపై ₹35-80 మేర తగ్గాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

News August 10, 2025

చికెన్ బ్రెస్ట్ VS లెగ్ పీస్.. ఏది మంచిదంటే?

image

*చికెన్ బ్రెస్ట్‌ పీస్‌: కొవ్వు, క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది బరువు తగ్గడం, మజిల్ బిల్డింగ్‌కి మంచిది.
*లెగ్ పీస్: మీట్ సాఫ్ట్‌గా, రుచిగా ఉంటుంది. కానీ కొవ్వు, క్యాలరీలు ఎక్కువ, ప్రొటీన్ కొంచం తక్కువ. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.
*మీ ఇష్టాన్ని బట్టి బరువు తగ్గాలి అనుకుంటే బ్రెస్ట్ పీస్, రుచిగా తినాలనుకుంటే లెగ్ పీస్ ఎంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.