India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూట్యూబర్ హర్షసాయిపై నమోదైన అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. అతడు దేశం వదిలి వెళ్లకుండా చూడాలని బాధితురాలు సైబరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసు జారీచేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇక సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని బాధితురాలు సీపీని కోరారు.
PPF, SSY, SCSS వంటి స్కీముల వడ్డీరేట్లను కేంద్రం 3 నెలలకోసారి రివ్యూ చేస్తుంది. పదేళ్ల G-Sec యీల్డుల కన్నా కనీసం 25BPS ఎక్కువ వడ్డీ ఇస్తుంది. ఇన్ఫ్లేషన్ తగ్గడంతో RBI రెపోరేట్ల కోత చేపట్టొచ్చని అంచనా. అప్పుడు G-Sec యీల్డులూ తగ్గుతాయి. దాంతో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ తగ్గిస్తారని విశ్లేషకుల అంచనా. అక్టోబర్లోనే రివ్యూ ఉంటుంది. మరి కేంద్రం వడ్డీని తగ్గిస్తుందో, పెంచుతుందో చూడాలి. మీ కామెంట్.
దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరగడంపై సామాన్యుడు భగ్గుమంటున్నాడు. ఇప్పటికే నూనె ధరలు లీటరుపై రూ.20-45 వరకూ పెరిగాయి. అల్లం కిలో రూ.100 నుంచి రూ.150, వెల్లుల్లి రూ.300 నుంచి రూ.360, ఎండు మిర్చి రూ.200 నుంచి రూ.240, కందిపప్పు కిలో రూ.150 నుంచి రూ.175, పెసరపప్పు రూ.30 పెరిగి రూ.150, మినపపప్పు రూ.135కి చేరింది. ఇక ఉల్లి ధరలు రూ.60 నుంచి కిందకు దిగడం లేదు. కూరగాయల ధరలూ అంతే ఉన్నాయి.
* ఉత్తమ చిత్రం-జైలర్(తమిళం)
* ఉత్తమ నటుడు- నాని(దసరా), విక్రమ్(పొన్నియన్ సెల్వన్-2)
* ఉత్తమ నటి- ఐశ్వర్యా రాయ్(పొన్నియన్ సెల్వన్-2)
* ఉత్తమ విలన్-ఎస్జే సూర్య(తమిళం-మార్క్ ఆంటోనీ)
* ఉత్తమ విలన్-షైన్ టామ్ చాకో(తెలుగు-దసరా)
* ఉత్తమ దర్శకుడు-మణిరత్నం (PS-2)
* ఉత్తమ సంగీత దర్శకుడు-ఏఆర్ రెహమాన్
ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు FIR రిజిస్టర్ చేశారు. IPC 351, 420, 240, 09, 120B సెక్షన్లను ప్రయోగించారు. సిద్దరామయ్య భార్య పార్వతి, బావమరిది, ఇతరుల పేర్లను అందులో మెన్షన్ చేశారు. బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఈ చర్యలు చేపట్టింది. రూ.56 కోట్ల విలువైన 14 సైట్లను పార్వతికి ముడా కేటాయించడంతో సీఎం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
TG: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో AR కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి కలెక్టరేట్లో డ్యూటీలో ఉండగా తన తుపాకీతో కాల్చుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారత్ సహా ఆసియాలోని చాలా దేశాలు ACH వంటి పాత పేమెంట్ మెథడ్స్కు ముగింపు పలుకుతున్నాయని JP MORGAN ఎగ్జిక్యూటివ్ మ్యాక్స్ న్యూకిర్చెన్ అన్నారు. UPI వంటి రియల్టైమ్ పేమెంట్ సిస్టమ్స్ మూమెంటమ్ బాగా పెరిగిందన్నారు. ఈ పాపులారిటీ హెల్త్కేర్ సహా అన్ని రంగాల్లో UPIని వాడేలా పుష్ చేస్తోందన్నారు. అందుకే క్లైంట్లకు నేరుగా సేవలు అందించేందుకు ONDCతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,158 మంది భక్తులు దర్శించుకోగా 24,938 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీల ద్వారా ఆదాయం రూ.3.31 కోట్లు సమకూరింది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు బెంగళూరు చట్టసభ ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. ఆమెపై కేసు నమోదు చేయాలని తిలక్నగర్ పోలీసులను ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరిట వ్యాపారవేత్తలను ఆమె బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని ఆదర్శ్ అయ్యర్ అనే వ్యక్తి తిలక్నగర్ పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, పోలీసులు తీసుకోలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా, FIR నమోదుకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
కుటుంబ తగాదాలతో చాలా కాలం తర్వాత సొంత ఊరుకు వెళ్లిన వ్యక్తికి ఎదురైన పరిణామాలే ‘సత్యం సుందరం’. సూపర్ హిట్ ‘96’ మూవీ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సారి పల్లెటూరి కథను ప్రేక్షకులకు అందించారు. కార్తీ, అరవింద్ స్వామి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సన్నివేశాలకు అనుగుణంగా వచ్చే కామెడీ, ఎమోషనల్ టచ్, మ్యూజిక్, డైలాగ్స్ చిత్రానికి ప్రధాన బలం. స్లో నెరేషన్, సినిమా లెంగ్త్ మైనస్.
రేటింగ్: 3.25/5
Sorry, no posts matched your criteria.