India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
UP మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. విద్యాసంస్థలు స్థాపించి, నిర్వహించే మైనార్టీల హక్కులను అడ్డుకోవద్దని UP ప్రభుత్వానికి CJI చంద్రచూడ్ సూచించారు. UP మదర్సా బోర్డ్ ఎడ్యుకేషన్ యాక్ట్- 2004కు రాజ్యాంగబద్ధత ఉందన్నారు. మదర్సాల్లో మత బోధనలు చేస్తుండటంతో సెక్యులరిజ సూత్రాలకు విరుద్ధమని AHC ఈ APRలో ఈ యాక్టును కొట్టేయగా బోర్డు SCని ఆశ్రయించింది.
ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవితవ్యం తేలిపోతుందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. వారికి ఆ టూర్ అగ్ని పరీక్ష లాంటిదేనని అభిప్రాయపడ్డారు. ‘సీనియర్ల బ్యాటింగ్ టెక్నిక్లో ఎలాంటి తప్పులు లేవు. కానీ 10, 12 ఓవర్లకు మించి ఆడలేకపోతున్నారు. బ్యాటింగ్ చేసేటప్పుడు కొంచెం సహనంతో ఉండాలి. మళ్లీ వారి బ్యాట్ నుంచి పరుగులు రాలడం చూడాలనుకుంటున్నా’ అని ఆయన పేర్కొన్నారు.
TG: HYD మధురానగర్లో దారుణం జరిగింది. ఓ మహిళ(50)పై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. కూలీ చేసుకునే సదరు మహిళ కొండాపూర్లో పని ముగించుకుని నిన్న రాత్రి ఇంటికి వస్తుండగా ముగ్గురు అడ్డుకున్నారు. తమ గదిలో బట్టలు ఉతకాలని, డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి ఓ రూమ్లో బంధించారు. అనంతరం నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేశారు. వారి నుంచి తప్పించుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది.
అసత్య, పక్షపాత సమాచార అభియోగాలపై వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వికీని పబ్లిషర్గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా ఎవరైనా ఈ ప్లాట్ఫాంలో సమాచారం చేర్చే అవకాశం ఉండటంతో తాము పబ్లిషర్ కాదు అని వికీ గతంలో పేర్కొంది. పరిమిత ఎడిటోరియల్ టీమ్తో డేటాను మానిటర్ చేస్తున్నామని చెప్పింది. ANI బీజేపీ అనుకూల మీడియా అని పేర్కొనగా, సదరు సంస్థ కోర్టుకెక్కడంతో దీనిపై వివాదం మొదలైంది.
AP: ఓ విలేకరి హత్య కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. తుని నియోజకవర్గం తొండంగికి చెందిన విలేకరి సత్యనారాయణ 2019 అక్టోబర్లో హత్యకు గురయ్యారు. దీనికి సూత్రధారి దాడిశెట్టి రాజా అని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రాజా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.
లిస్టెడ్ కంపెనీల స్టాక్ ప్రైసెస్ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ సర్వీసెస్, పేపర్ ట్రేడింగ్, ఫాంటసీ గేమ్స్ అందించే యాప్స్, వెబ్ అప్లికేషన్ల జోలికి పోవొద్దని సెబీ వార్నింగ్ ఇచ్చింది. అవి చట్టవిరుద్ధమని సూచించింది. తమ వద్ద రిజిస్టరైన అడ్వైజరీలను మాత్రమే ఫాలో అవ్వాలని తెలిపింది. వారి రిజిస్ట్రేషన్ సరైందో కాదో చెక్ చేసుకోవాలంది. స్టాక్ లీగ్స్, స్కీమ్స్, పోటీల జోలికెళ్లి బాధితులుగా మారొద్దని పేర్కొంది.
అమెరికా ఎన్నికల్లో ట్రంప్కు మద్దతునిస్తూ ప్రచారంలో హోరెత్తించిన కుబేరుడు ఎలాన్ మస్క్ కాలేజీ టైమ్లో రాసిన నోట్ బుక్ పేజీలు వైరలవుతున్నాయి. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆయన ఫిజిక్స్ హోమ్వర్క్ ఎలా చేశారో చూపుతూ ఓ వ్యక్తి సదరు ఫొటోలను Xలో పంచుకున్నారు. దీనికి మస్క్ స్పందిస్తూ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా డెరివేషన్లోని కొన్ని పేజీలు లేవని రిప్లై ఇవ్వడంతో వాటినీ అతను పంచుకున్నారు.
నటి కస్తూరి నిత్యం వివాదాల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ తమిళ సభలో తెలుగుజాతిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. ‘300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. తెలుగువారు తమిళుల బానిసలు’ అని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో కూడా నయనతారకు లేడీ సూపర్ స్టార్ బిరుదు వద్దని, రజినీకాంత్ అమెరికా పర్యటనల మిస్టరీ ఏమిటని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అతి సర్వత్ర వర్జయేత్! టెక్నాలజీతో మానవ జీవితం మారిపోయింది. శ్రమ తగ్గింది. కన్వీనియెన్స్ పెరిగింది. మరీ ఎక్కువ కన్వీనియెన్స్ మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది మన బేసిక్ ఇన్స్టింక్ట్స్ను మార్చేస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. EX. పిక్నిక్ వెళ్లినప్పుడు పులి ఎదురైతే అక్కడ్నుంచి పారిపోవడం మానవ నైజం. లేదు అదే వెళ్లిపోతుందిలే అని సెల్ఫీ దిగడం లేజీనెస్. కన్వీనియెన్స్తో వచ్చే ప్రమాదాలు ఇలాంటివే.
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ను ఆయన వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్నారని, 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా క్రిష్ గతంలో రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అనుష్క శెట్టితో ‘ఘాటీ’ మూవీ తెరకెక్కిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.