India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత జట్టులోకి తిరిగిరావడానికి ప్రయత్నిస్తున్న పేసర్ మహ్మద్ షమీకి షాక్ తగిలింది. రంజీ ట్రోఫీ నెక్స్ట్ రెండు రౌండ్లకు బెంగాల్ టీమ్లో అతనికి చోటు దక్కలేదు. అక్కడ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలనుకున్న అతనికి ఇది బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు. 2023 ODI WC తర్వాత గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన షమీ, సర్జరీ తర్వాత కోలుకుని బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇటీవల తాను 100% ఫిట్నెస్ సాధించినట్లు చెప్పారు.
AP: భారీగా పెరిగిన నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరలపై సరకులు అందజేసేందుకు సిద్ధమవుతోంది. లీటర్ పామాయిల్ రూ.110, కేజీ కందిపప్పు రూ.67, అరకేజీ చక్కెర 16 రూపాయలకే అందించాలని మంత్రులు నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నాయుడుతో కూడిన కమిటీ నిర్ణయించింది. రైతు బజార్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2200 రిటైల్ ఔట్లెట్ల ద్వారా సరకులు విక్రయించనుంది.
TG: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదు గడువు రేపటితో ముగియనుంది. 2019తో (1.96లక్షలు) పోల్చితే ప్రస్తుతం ఓటరు దరఖాస్తుల సంఖ్య(2.40 లక్షలు) పెరిగింది. అయినా ఇంకా సగం మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈనెల 23న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 30న ఫైనల్ లిస్ట్ను రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.
1876లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో US చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ఆ ఎలక్షన్లలో ఏకంగా 81.8 శాతం మంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 1792 ఎలక్షన్స్లో కేవలం 6.3 శాతం మందే ఓట్లు వేశారు. ఇదే అమెరికా చరిత్రలో అత్యల్ప ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో దాదాపు 66 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి అది పెరుగుతుందని అంచనా.
Zerodha టెక్ టీమ్ గత 4 ఏళ్లలో కొత్తగా ఐదుగురినే తీసుకుంది. టీమ్సైజ్ 35 మాత్రమే కావడం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ₹4000 కోట్లకు పైగా ప్రాఫిట్ ఆర్జిస్తున్న ఈ కంపెనీ ఎక్కువగా AIపై ఆధారపడుతోందని తెలుస్తోంది. ఆర్డర్స్, ట్రాన్జాక్షన్స్ సహా చాలా పనుల్లో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ తక్కువేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ విధానం సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ల ఉపాధికి గండికొట్టొచ్చన్న భయాలూ పెరుగుతున్నాయి.
TG: టెస్లా సంస్థను రాష్ట్రానికి రప్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నించడం లేదని కేటీఆర్ విమర్శించారు. తమిళనాడు, గుజరాత్, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఏదైనా ఒక రాష్ట్రంలో టెస్లా యూనిట్ ఏర్పాటయ్యే ఛాన్సుందనే వార్తలపై ఆయన స్పందించారు. తెలంగాణను ఆ సంస్థ కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడం అవమానకరమని అన్నారు. పెట్టుబడుల కోసం విదేశాల్లో పర్యటించిన సీఎం, మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు.
AP: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తన స్వగ్రామం అనకాపల్లి జిల్లా పెదగోగాడలో ఇవాళ మరణించారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. NTR హయాంలో మంత్రిగా పనిచేశారు. TTD బోర్డు మెంబర్గా కూడా ఆయన సేవలందించారు. కాగా మంత్రిగా కొనసాగుతున్నప్పుడు కూడా ఆయన నిరాడంబర జీవితం గడిపారు. RTC బస్సుల్లోనే ఆయన ప్రయాణించేవారు.
AP: జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను అభ్యర్థుల వినతి మేరకు వాయిదా వేయడంపై అధికారులు చర్చిస్తున్నారు. DSC పరీక్షల తేదీలను అనుసరించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మెయిన్స్కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని, డీవైఈవో పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీలు చిరంజీవి, లక్ష్మణరావు APPSC ఛైర్పర్సన్ అనురాధకు విజ్ఞప్తి చేశారు.
పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్ బుక్ ఫెయిర్ మళ్లీ వచ్చేస్తోంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రకటించింది. స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునేవారు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో పుస్తక ప్రదర్శన మ.2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేదని, ఈసారి మ.12 గంటల నుంచి రా.9 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
AP: ఎన్టీఆర్ భరోసా కింద జనవరిలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత 6 నెలలకోసారి అర్హతను బట్టి కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు. భర్త చనిపోయినవారు డెత్ సర్టిఫికెట్ సమర్పించిన మరుసటి నెల నుంచే పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానం డిసెంబర్ నుంచే అమలు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.