News January 29, 2025

మూవీలో లీడ్ రోల్‌లో తమన్!

image

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి యాక్టర్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. తమిళ నటుడు అథర్వ హీరోగా నటించే సినిమాలో తమన్ లీడ్ యాక్టర్‌గా చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్‌ దశలో ఉందని వెల్లడించాయి. దీంతో చాలా కాలం తర్వాత తమన్ సినిమాలో నటుడిగా కనిపించే అవకాశం ఉంది. కాగా, 2003లో రిలీజైన బాయ్స్ మూవీలో తమన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

News January 29, 2025

రేపు మాంసం దుకాణాలు బంద్

image

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రేపు హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మేక, గొర్రెల మండీలు, దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కూడా నిఘా ఉంచాలని సూచించారు. ఏపీ, తెలంగాణలోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

News January 29, 2025

అమ్మకానికి పులి మూత్రం.. పావు లీటర్ రూ.600!

image

చైనాలోని ఓ వైల్డ్ లైఫ్ జూ నిర్వాహకులు పులి మూత్రాన్ని విక్రయిస్తున్నారు. 250mlకి 50 యువాన్లు (₹600) తీసుకుంటున్నారు. టైగర్ మూత్రంలో అద్భుత ఔషధాలు ఉన్నాయని, దీనితో కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ నయం అవుతాయని చెబుతున్నారు. పులి మూత్రాన్ని వైట్ వైన్, అల్లం ముక్కలతో మిక్స్ చేయాలని సూచిస్తున్నారు. అయితే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదని, మూత్రాన్ని అమ్మడానికి లైసెన్స్ లేదని పలువురు సందర్శకులు అంటున్నారు.

News January 29, 2025

రేపు బీఆర్ఎస్ రాష్ట్ర‌వ్యాప్త నిరసనలు

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపటికి 420 రోజులవుతుందని, కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేదని BRS ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాయి. అలాగే, రేపు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అయినా ప్రభుత్వం కళ్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది.

News January 29, 2025

‘అణు’ దాడి జరిగిన ప్రాంతాలకు రండి.. ట్రంప్‌కు జపాన్ ఆహ్వానం

image

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడి జరిగి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్కడ పర్యటించాలని ఆ నగరాల మేయర్లు US అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ‘అణుశక్తిపై ఆధారపడటాన్ని తగ్గించి అణ్వాయుధ నిషేధానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. తద్వారా ప్రపంచశాంతిని నెలకొల్పుతారని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్‌పై US అణుబాంబులు జారవిడవగా 2.10 లక్షలమందికిపైగా కన్నుమూశారు.

News January 29, 2025

ఎమోషన్స్‌ను దాచుకోండి గురూ..!

image

కోపం, బాధ, దుఃఖం వంటి భావోద్వేగాలను ఏదో ఒక సందర్భంలో చూపిస్తాం. అయితే, ప్రతికూల భావోద్వేగాలను అతిగా చూపిస్తే అనారోగ్యపడతామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతికోపం వల్ల కాలేయం బలహీనమవుతుంది. దుఃఖం ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. శ్వాసకోస సమస్యలొస్తాయి. చింత వల్ల జీర్ణక్రియ సమస్యలు, భయం వల్ల మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి పెరిగితే గుండె & మెదడు పనితీరు మందగిస్తుంది.

News January 29, 2025

BREAKING: రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్

image

దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది. త్వరలోనే మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సాప్‌లోనే ప్రభుత్వ సేవలు పొందుతారని సీఎం చంద్రబాబు చెప్పారు.

News January 29, 2025

హిందుత్వాన్ని ముప్పుగా పరిగణిస్తున్న UK!

image

హిందూ జాతీయ‌వాదం (హిందుత్వ‌), ఖ‌లిస్థానీ తీవ్ర‌వాదాన్ని దేశంలో పెరుగుతున్న ముప్పుగా UK ప‌రిగ‌ణిస్తోందని The Guardian కథనాన్ని ప్రచురించింది. ఇటీవల లీకైన హోం శాఖ నివేదిక ప్రకారం హిందుత్వాన్ని మొదటిసారిగా ఆందోళనకరమైన ఐడియాలజీగా UK గుర్తించింది. 2022లో Ind-Pak ఆసియా క‌ప్ మ్యాచ్ సంద‌ర్భంగా బ్రిటిష్ హిందూ- బ్రిటిష్ ముస్లింల మ‌ధ్య లీసెస్టర్‌లో జరిగిన అల్లర్ల తర్వాత హిందుత్వాన్ని ముప్పుగా చేర్చారు.

News January 29, 2025

30ఏళ్ల తర్వాత రాష్ట్రానికి బహుమతి: సీఎం హర్షం

image

AP: రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రానికి చెందిన శకటానికి తృతీయ బహుమతి రావడంపై CM చంద్రబాబు, Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై CM అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల తర్వాత RD పరేడ్‌లో బహుమతి వచ్చిందని చెప్పారు. మరోవైపు, హస్తకళలు చాటేలా శకటం ప్రదర్శన, బహుమతి రావడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏటికొప్పాక శకటానికి SMలో సైతం పెద్దఎత్తున మద్దతు లభించిన విషయం తెలిసిందే.

News January 29, 2025

గురుమూర్తికి 14 రోజుల రిమాండ్

image

HYD మీర్‌పేటలో భార్యను <<15292119>>ముక్కలుగా <<>>నరికి ఉడికించిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అతడే హత్య చేసినట్లు పోలీసులు సాక్ష్యాలను న్యాయమూర్తి ముందు ఉంచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నెల 16న మాధవిని చంపి శవాన్ని ముక్కలుగా చేసి ఉడికించి ఆ తర్వాత ఎముకల్ని దంచి పొడిగా మార్చాడు. బూడిదను చెరువులో పడేశాడు.