India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రేపు హైదరాబాద్లో మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మేక, గొర్రెల మండీలు, దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు కూడా నిఘా ఉంచాలని సూచించారు. ఏపీ, తెలంగాణలోనూ ఇదే తరహా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

చైనాలోని ఓ వైల్డ్ లైఫ్ జూ నిర్వాహకులు పులి మూత్రాన్ని విక్రయిస్తున్నారు. 250mlకి 50 యువాన్లు (₹600) తీసుకుంటున్నారు. టైగర్ మూత్రంలో అద్భుత ఔషధాలు ఉన్నాయని, దీనితో కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ నయం అవుతాయని చెబుతున్నారు. పులి మూత్రాన్ని వైట్ వైన్, అల్లం ముక్కలతో మిక్స్ చేయాలని సూచిస్తున్నారు. అయితే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదని, మూత్రాన్ని అమ్మడానికి లైసెన్స్ లేదని పలువురు సందర్శకులు అంటున్నారు.

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపటికి 420 రోజులవుతుందని, కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేదని BRS ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాయి. అలాగే, రేపు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అయినా ప్రభుత్వం కళ్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది.

జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడి జరిగి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్కడ పర్యటించాలని ఆ నగరాల మేయర్లు US అధ్యక్షుడు ట్రంప్కు లేఖ రాశారు. ‘అణుశక్తిపై ఆధారపడటాన్ని తగ్గించి అణ్వాయుధ నిషేధానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. తద్వారా ప్రపంచశాంతిని నెలకొల్పుతారని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్పై US అణుబాంబులు జారవిడవగా 2.10 లక్షలమందికిపైగా కన్నుమూశారు.

కోపం, బాధ, దుఃఖం వంటి భావోద్వేగాలను ఏదో ఒక సందర్భంలో చూపిస్తాం. అయితే, ప్రతికూల భావోద్వేగాలను అతిగా చూపిస్తే అనారోగ్యపడతామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతికోపం వల్ల కాలేయం బలహీనమవుతుంది. దుఃఖం ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. శ్వాసకోస సమస్యలొస్తాయి. చింత వల్ల జీర్ణక్రియ సమస్యలు, భయం వల్ల మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి పెరిగితే గుండె & మెదడు పనితీరు మందగిస్తుంది.

దేశంలోనే తొలిసారిగా APలో రేపు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. తొలి విడతలో పౌరులకు దేవదాయ, ఎనర్జీ, APSRTC, రెవెన్యూ, అన్న క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లోని 161 సేవలు అందించనుంది. త్వరలోనే మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సాప్లోనే ప్రభుత్వ సేవలు పొందుతారని సీఎం చంద్రబాబు చెప్పారు.

హిందూ జాతీయవాదం (హిందుత్వ), ఖలిస్థానీ తీవ్రవాదాన్ని దేశంలో పెరుగుతున్న ముప్పుగా UK పరిగణిస్తోందని The Guardian కథనాన్ని ప్రచురించింది. ఇటీవల లీకైన హోం శాఖ నివేదిక ప్రకారం హిందుత్వాన్ని మొదటిసారిగా ఆందోళనకరమైన ఐడియాలజీగా UK గుర్తించింది. 2022లో Ind-Pak ఆసియా కప్ మ్యాచ్ సందర్భంగా బ్రిటిష్ హిందూ- బ్రిటిష్ ముస్లింల మధ్య లీసెస్టర్లో జరిగిన అల్లర్ల తర్వాత హిందుత్వాన్ని ముప్పుగా చేర్చారు.

AP: రిపబ్లిక్ డే పరేడ్లో రాష్ట్రానికి చెందిన శకటానికి తృతీయ బహుమతి రావడంపై CM చంద్రబాబు, Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై CM అభినందనలు తెలిపారు. 30 ఏళ్ల తర్వాత RD పరేడ్లో బహుమతి వచ్చిందని చెప్పారు. మరోవైపు, హస్తకళలు చాటేలా శకటం ప్రదర్శన, బహుమతి రావడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏటికొప్పాక శకటానికి SMలో సైతం పెద్దఎత్తున మద్దతు లభించిన విషయం తెలిసిందే.

HYD మీర్పేటలో భార్యను <<15292119>>ముక్కలుగా <<>>నరికి ఉడికించిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు రిమాండ్కు తరలించారు. అతడే హత్య చేసినట్లు పోలీసులు సాక్ష్యాలను న్యాయమూర్తి ముందు ఉంచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ నెల 16న మాధవిని చంపి శవాన్ని ముక్కలుగా చేసి ఉడికించి ఆ తర్వాత ఎముకల్ని దంచి పొడిగా మార్చాడు. బూడిదను చెరువులో పడేశాడు.

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను అర్హులందరికీ ఇవ్వకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయకపోవడం బాధాకరమని సీఎం రేవంత్కు లేఖ రాశారు. కేంద్రమే ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తోందని, కార్డులపై మోదీ ఫొటో ఉండాలని డిమాండ్ చేశారు. ప్రధాని ఆవాస్ యోజన ఇళ్లకు అదే పేరు కొనసాగించాలన్నారు.
Sorry, no posts matched your criteria.