India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రస్తుత సమాజంలో కొందరు ఆడపిల్లలపై ఇప్పటికీ వివక్ష చూపుతున్నారు. అయితే ఇళ్లల్లోనూ బిడ్డల మధ్య వివక్ష చూపడం సాధారణం అని భావిస్తారు. అయితే మొదటి సంతానం అమ్మాయి అయితే ఆ తండ్రుల్లో లింగ వివక్ష ధోరణి తక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అమ్మాయి పెరిగే క్రమంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లే తండ్రి ఆలోచనా తీరులో ఈ మార్పుని తీసుకొస్తున్నాయని, దీన్నే మైటీ గర్ల్ ఎఫెక్ట్ అంటారని నిపుణులు చెబుతున్నారు.

దేహపోషణకే కాక, మోక్షప్రాప్తికి కూడా ఆహార నియమాలు ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆహార నియమాలు పాటించడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండి, మనస్సు స్థిరంగా, నిశ్చలంగా ఉంటుంది. దేవుడిపై మనస్సు లగ్నం కావాలంటే, కష్టపడి, నిజాయతీగా సంపాదించిన ఆహారాన్నే స్వీకరించాలి. దుఃఖం, కోపం, భయం కలిగించే ఆహారాలు భక్తికి ఆటంకం. కాబట్టి ఆత్మశుద్ధిని కాపాడే ఆహారం మాత్రమే భగవత్ చింతనకు, దైవ ప్రాప్తికి సహాయపడుతుంది. <<-se>>#Aaharam<<>>

ఇండియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లోని తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది.
IND ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
AUS ప్లేయింగ్ XI: మార్ష్(కెప్టెన్), హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, ఫిలిప్, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, కుహ్నెమాన్, హేజిల్వుడ్

SIR పేరిట CAA అమలుకు BJP, EC ప్రయత్నిస్తున్నాయని బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. అర్హులైన ఒక్కరి ఓటు తొలగినా ఊరుకొనేది లేదని, కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, మమత సీఎంగా ఉన్నన్నాళ్లూ రాష్ట్రంలో NRC అమలు కాబోదని స్పష్టం చేశారు. కాగా SIR పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగబోదని బెంగాల్ CEO స్పష్టం చేశారు.

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(IIIM)జమ్మూ 4 జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, మాస్టర్ డిగ్రీ( హిందీ / ఇంగ్లిష్) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iiim.res.in.

ఇటీవల మల్టీ నేషనల్ కంపెనీల్లోనూ భారీగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. లేఆఫ్స్ ఇచ్చిన కంపెనీలివే.. UPSలో 48,000, అమెజాన్లో 30,000, ఇంటెల్లో 24,000, Nestleలో 16,000, యాక్సెంచర్లో 11,000, ఫోర్డ్లో 11,000, నోవో నార్డిస్క్లో 9,000, మైక్రోసాఫ్ట్లో 7,000, PwCలో 5,600, సేల్స్ఫోర్స్లో 4,000 ఉద్యోగాల తొలగింపు వార్తలు వచ్చాయి.

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అమరావతి నుంచి ఆయన హెలికాప్టర్లో బయల్దేరారు. వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారని తెలుస్తోంది. వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనిపై ఉదయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమీక్ష కూడా నిర్వహించారు.

పొలంలో నిల్వ ఉన్న నీటిని 24-48 గంటలలోపు తొలగించాలి. పొలాలు ఎండిన తర్వాత లీటరు నీటికి 10గ్రా. యూరియా+5గ్రా. జింక్ సల్ఫేట్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి. కోతకు దగ్గరలో ఉన్న మొక్కజొన్న పొత్తులను వెంటనే కోసి వాటిని 12-13% తేమ స్థాయికి ఆరబెడితే మొలకెత్తదు, నాణ్యత తగ్గదు. కండె కుళ్ళు, ఆకుమచ్చ ఇతర శిలీంద్ర తెగుళ్ల నివారణకు లీటరు నీటికి ప్రాపికొనజోల్ 1ml లేదా మాంకోజెబ్ 2.5గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

AP: మొంథా తుఫాను శాంతించింది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడి AP, TG, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఐదు రోజుల్లోగా పంటనష్టం అంచనా వేయాలని ఆదేశించామన్నారు.

AP: మొంథా తుఫాన్ తీరం దాటిందని, ఇవాళ మధ్యాహ్నానికి సాధారణ స్థితి నెలకొంటుందని CM చంద్రబాబు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మరణించినట్లు చెప్పారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు 10వేల మందిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది బాగా పనిచేశారని అభినందించారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగిందని టెలీకాన్ఫరెన్స్లో వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.