India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించగా.. కీలక రంగాలకు కేటాయింపులు ఇలా (కోట్లలో)…* ట్రాన్స్పోర్ట్ – ₹5,98,520 * రక్షణ రంగం – ₹5,94,585 * గ్రామీణాభివృద్ధి – ₹2,73,108 * హోంశాఖ – ₹2,55,234 * వ్యవసాయం – ₹1,62,671 * విద్య – ₹1,39,289 * వైద్యారోగ్యం – ₹1,04,599 * పట్టణాభివృద్ధి – ₹85,522 * IT, టెలికం – ₹74,560 * వాణిజ్యం, పరిశ్రమలు – ₹70,296

ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీ, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో స్పెషల్ మైనింగ్ మిషన్ ఏర్పాటుచేస్తామన్నారు. ప్రపంచ స్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ నెలకొల్పుతామని పేర్కొన్నారు. కాగా రేర్ ఎర్త్ మినరల్స్ జాబితాలో మోనాజైట్, జెనోటైమ్, బాస్ట్నేసైట్, లోపరైట్ ఉన్నాయి. ఇవి ఎలక్ట్రానిక్స్ రంగానికి కీలకం.

TG: కాసేపట్లో సిట్ విచారణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ గదిని పరిశీలించారు. ఇంటి చుట్టూ భారీ భద్రత ఏర్పాటుచేశారు. మరోవైపు కేసీఆర్కు సిట్ నోటీసులపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి.

ట్రేడర్లు ఊహించిందొకటైతే నిర్మలమ్మ ఇచ్చింది మరొకటి. షేర్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ కొనేటప్పుడు వేసే సెక్యూరిటీ ట్రాన్జాక్షన్స్ ట్యాక్స్ (STT)ను తగ్గిస్తారని ఆశించారు. ఆప్షన్స్పై 0.1 నుంచి 0.15%, ఫ్యూచర్స్పై 0.05 శాతానికి పన్ను పెంచడంతో ఉసూరుమంటున్నారు. ఉద్రేకంతో అమ్మకాలు చేపట్టడంతో సూచీలు కుదేలయ్యాయి. అనిశ్చితి, రాబోయే సంక్షోభాన్ని ఊహించి స్పెక్యులేషన్ నివారించేందుకే ఇలా చేసినట్టు తెలుస్తోంది.

నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయి. అందుకే సముద్రంలో స్నానం చేయడం వల్ల సకల నదులలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. సముద్రుడి అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం. ఒకవేళ సముద్రం లేదా నదులు అందుబాటులో లేకపోతే, బావుల వద్ద స్నానం చేసేటప్పుడు గంగ, యమున, కావేరి వంటి పవిత్ర నదుల పేర్లను భక్తితో స్మరిస్తే అదే ఫలితం కలుగుతుందని పద్మపురాణం వివరిస్తోంది.

<

విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, అక్కడ వైద్యం చేయించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. బడ్జెట్లో భాగంగా LRS కింద విదేశాలకు పంపే నగదుపై TCSను 5% నుంచి 2%కి తగ్గించారు. గ్లోబల్ ఖర్చులు పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించి నగదు లభ్యతను పెంచుతుంది. దివ్యాంగుల కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన పథకాన్ని ప్రకటించారు.

దేశంలోని రూరల్, అర్బన్ లోకల్ బాడీలకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ₹1.40 లక్షల కోట్లను గ్రాంటుగా అందించాలని కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదించింది. అలాగే 16వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. వివిధ పన్నుల నుంచి రాష్ట్రాల వాటాగా 41 శాతం నిధులను అందించనున్నట్లు ప్రకటించింది.

బ్యాంకింగ్ రంగాన్ని మరింత పటిష్ఠం చేసేలా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. ‘ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు హెల్తీ బ్యాలెన్స్ షీట్లు, లాభాలతో మెరుగ్గా ఉన్నాయి. మొండి రుణాలపై నియంత్రణతో ఉన్నాయి. మరింత మెరుగైన రీతిలో వీటిని పటిష్ఠం చేసేందుకు, సంస్కరణల అమలుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీ పనిచేస్తుంది. తదుపరి ఎకనమిక్ గ్రోత్ సాధనకు ఇది దోహదపడుతుంది’ అని వివరించారు.

IT, సాఫ్ట్వేర్ రంగంలో పన్నుల గందరగోళానికి చెక్ పెడుతూ నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. IT, ITeS, KPO, కాంట్రాక్ట్ R&D సేవలను విడివిడిగా కాకుండా వాటన్నింటినీ కలిపి IT సర్వీసెస్ అనే ఒకే కేటగిరీగా గుర్తిస్తారు. వీటన్నింటికీ ఒకే ‘Safe Harbour Framework’ వర్తించడం వల్ల ట్యాక్స్ రూల్స్ సింపుల్గా మారతాయి. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది.
Sorry, no posts matched your criteria.