India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో ఓ మహిళ అరెస్టైంది. పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో ఆమెను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ వాడిన సిమ్ ఈ మహిళ పేరు మీద రిజిస్టరై ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ముంబై తీసుకెళ్లి విచారించేందుకు ఆ రాష్ట్ర పోలీసుల అనుమతి తీసుకోనున్నారు. సైఫ్పై తన ఇంట్లోనే ఈ నెల 16న దాడి జరిగిన విషయం తెలిసిందే.

మనిషి సహా ఉపరితల జీవుల చెవులు చేపల మొప్పల నుంచి అభివృద్ధి చెందాయని అమెరికా పరిశోధకులు తేల్చారు. ‘మన చెవుల్లో ఉండే జన్యువుల్ని జీబ్రాఫిష్ జినోమ్లోకి ప్రవేశపెడితే ఆ చేప మొప్పల్లో మార్పు కనిపించింది. ఇక జీబ్రా ఫిష్ నుంచి జన్యువుల్ని చిట్టెలుకల్లో ప్రయోగించగా వాటి చెవుల్లో మార్పులు కనిపించాయి. పరిణామక్రమంలో చేపల మొప్పలే భూమ్మీద జీవులకు చెవులయ్యాయనేది మా అధ్యయనంలో తేలింది’ అని పేర్కొన్నారు.

నానాటికీ పెరుగుతున్న<<15262482>>murder<<>>, అత్యాచారాలు, ఘోరాల వెనుక OTT సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రధాన కారణమవుతున్నాయా? గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల బట్టి ఇవే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీ కంటెంట్పై నియంత్రణ లేదు. దీంతో హింసాత్మక, జుగుప్సాకరమైన కంటెంట్ సులువుగా నెట్టింట లభిస్తోంది. బలహీన మనస్కులపై అది ప్రభావం చూపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మీ కామెంట్?

* మెన్స్ వన్డే క్రికెటర్-అజ్మతుల్లా(ఆఫ్గానిస్థాన్)
* మెన్స్ టెస్ట్ క్రికెటర్ -బుమ్రా(ఇండియా)
* మెన్స్ టీ20 క్రికెటర్ -అర్ష్దీప్(ఇండియా)
* మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్-కమిందు మెండిస్(శ్రీలంక)
* ఉమెన్స్ వన్డే క్రికెటర్-స్మృతి మంధాన(ఇండియా)
* ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్-డెర్క్సెన్(దక్షిణాఫ్రికా)
* ఉమెన్స్ టీ20 క్రికెటర్-మెలి కెర్(న్యూజిలాండ్)
* అంపైర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్

AP: YCP ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని CM చంద్రబాబు మరోసారి విమర్శించారు. 2022-23కు గాను నీతి ఆయోగ్ నివేదికపై ఆయన మాట్లాడారు. అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు తప్పవని, తిరిగి తీర్చే శక్తి రాష్ట్రానికి లేదని చెప్పారు. అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకుంటే ప్రజలే బాధపడతారని పేర్కొన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు.

TG: హైదరాబాద్ RTC X రోడ్డులోని బస్భవన్లో RTC యాజమాన్యానికి కార్మిక సంఘాల JAC సమ్మె నోటీస్ ఇచ్చింది. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వంలో విలీనం, 2PRCలు, CCS, పీఎఫ్ డబ్బులు రూ.2700 కోట్ల చెల్లింపులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేర్చకుంటే ఫిబ్రవరి 9 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేసింది.

నాని ‘పిల్ల జమిందార్’ హీరోయిన్ హరిప్రియ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త వశిష్ఠ సోషల్ మీడియాలో వెల్లడించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా బాలకృష్ణ సరసన ‘జైసింహ’తో పాటు పలు కన్నడ చిత్రాల్లో హరిప్రియ నటించారు.

APలో పలు మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్ల ఎంపికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 30లోగా సమావేశం ఏర్పాటు చేయాలని, FEB 3న ఎన్నిక జరపాలని ఆదేశించింది. TPTY, NLR, ఏలూరు కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్లు, నందిగామ, హిందూపురం, పాలకొండలో ఛైర్పర్సన్, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్లలో వైస్ ఛైర్పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి.

CT-2025 జట్టులో సిరాజ్ చేరే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. CTకి బుమ్రా, షమీ, అర్ష్దీప్లను బీసీసీఐ ఎంపిక చేసిందన్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత షమీ ఒక్క మ్యాచ్ ఆడలేదని, జట్టు ప్రకటన సమయంలో బుమ్రా ఫిట్నెస్పై రోహిత్ డౌట్ వ్యక్తం చేశారని గుర్తు చేశారు. వీరిద్దరిలో ఒకరు మిస్ అయితే కచ్చితంగా జట్టులో సిరాజ్ చేరతారని, ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై 90% మంది సంతృప్తిగా ఉన్నారని CM చంద్రబాబు తెలిపారు. ధాన్యం సేకరణలో 89.92% మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. దేవాలయాల్లో దర్శనాలపై 70% మంది సంతృప్తి, వసతులపై 37% మందిలో అసంతృప్తి నెలకొందని తెలిపారు. ఆస్పత్రుల్లో సేవలపై 35% మంది అసంతృప్తి, అవినీతిపై 37% ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై IVRS, వివిధ రూపాల్లో CM ప్రజాభిప్రాయం సేకరించారు.
Sorry, no posts matched your criteria.