News January 25, 2025

నేడే భారత్, ఇంగ్లండ్ రెండో T20

image

భారత్, ఇంగ్లండ్ మధ్య చెన్నైలో ఇవాళ రెండో T20 జరగనుంది. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచి సిరీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. నిన్న ప్రాక్ట్రీస్‌లో గాయపడిన అభిషేక్‌శర్మ మ్యాచ్‌కు దూరమైతే ధ్రువ్‌ జురెల్ జట్టులో చేరొచ్చు. అటు, షమీ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్ కొనసాగుతుండగా నేడు మ్యాచ్ ఆడతారో? లేదో? వేచి చూడాలి. రాత్రి 7గంటలకు స్టార్‌ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో మ్యాచ్ LIVE చూడొచ్చు.

News January 25, 2025

మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత

image

TG: మాజీ సీఎం కేసీఆర్ ఐదో సోదరి చీటి సకలమ్మ (82) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని HYD ఓల్డ్ అల్వాల్‌లోని ఆమె నివాసానికి తరలించారు. సకలమ్మ మృతిచెందడంతో సోదరుడు కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సకలమ్మ భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు.

News January 25, 2025

కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం ఇష్టం: శార్దూల్

image

జమ్మూకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ ‘సాధారణ పరిస్థితుల్లో ఎవరైనా రాణిస్తారు. ప్రతికూల సమయాల్లో ఎలా ఆడామనేదే ముఖ్యం. నాకు కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం ఇష్టం. అలాంటి వాటిని సవాలుగా తీసుకొని ఎలా అధిగమించాలో ఆలోచిస్తా’ అని అన్నారు. శార్దూల్ రాణించడంతో ముంబై జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది.

News January 25, 2025

నాలుగు పథకాలపై నేడు సీఎం సమీక్ష

image

TG: ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నాలుగు పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అధికారులతో మాట్లాడనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో కొన్నిచోట్ల నెలకొన్న గందరగోళ పరిస్థితులపై చర్చించనున్నారు. అటు, రాష్ట్ర వ్యాప్తంగా 16,348 గ్రామ, వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.

News January 25, 2025

ప్రేక్షకుల అభిప్రాయమే నాకు ముఖ్యం: అనిల్ రావిపూడి

image

వరుస విజయాలు కట్టబెడుతూ ప్రేక్షకులు చాలా ఇచ్చారని, ప్రతిఫలంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే తన లక్ష్యమని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఆడియన్స్ ఖర్చు పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేస్తానన్నారు. థియేటర్లకు వచ్చే జనం, కలెక్షన్లనే సక్సెస్‌గా మాట్లాడుకుంటున్నామని చెప్పారు. క్రిటిక్స్ ఎప్పుడూ ఉంటారని, వారి మాటలతో ఒత్తిడికి లోనవ్వనని తెలిపారు. తనకు ప్రేక్షకుల అభిప్రాయమే ముఖ్యమని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

News January 25, 2025

దక్షిణ జార్జియాను ఢీకొట్టనున్న భారీ ఐస్‌బర్గ్‌!

image

అంటార్కిటికా నుంచి విడిపోయిన ఓ భారీ మంచుకొండ(A23a) బ్రిటిష్ భూభాగం వైపు దూసుకెళ్తోంది. ఇది మున్ముందు దక్షిణ జార్జియా ద్వీపాన్ని ఢీకొనే అవకాశముంది. ఆ ప్రాంతానికి 280KM దూరంలో ఉన్న ఈ ఐస్‌బర్గ్ బలమైన గాలులు, సముద్ర ప్రవాహాల వల్ల వేగంగా కదులుతోంది. 4K చ.కి.మీ. వైశాల్యం ఉండే మంచుకొండ ఆ ద్వీపాన్ని ఢీకొట్టి అక్కడే చిక్కుకునే ప్రమాదముంది. దీంతో అందులోని పెంగ్విన్లు, సీల్స్‌కు ఆహారం దొరకడం కష్టమవుతుంది.

News January 25, 2025

నేడు షమీ ఆడతారా?

image

భారత స్టార్ బౌలర్ షమీ నేడు ఇంగ్లండ్‌తో జరిగే 2వ T20 ఆడటంపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న షమీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశారు. అయితే మోకాలికి బ్యాండేజ్ వేసి ఉండటంతో మ్యాచ్ ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి T20 ఆడతారని భావించినా డగౌట్‌కే పరిమితమయ్యారు. అటు షమీ ఆరోగ్య పరిస్థితిపై BCCI ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫ్యాన్స్ మాత్రం షమీ ఆడాలని కోరుకుంటున్నారు.

News January 25, 2025

వ్యాయామం చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి!

image

వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే అయినా జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెపై భారం పడి కుప్పకూలిపోయే ప్రమాదముంది. శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. ఒంట్లో నీటి % తగ్గకుండా చూసుకోవాలి. వ్యాయామాలు చేసేందుకు ఫిట్‌గా ఉన్నామా? లేదా? తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే చేయడం బెటర్. శరీరాకృతి కోసం స్టెరాయిడ్స్ వాడకూడదు. కడుపునిండా భోజనం చేసి ఎక్సర్‌సైజ్ చేయకూడదు.

News January 25, 2025

డాలర్‌తో రూపాయి క్షీణతపై మోదీకి కాంగ్రెస్ సెటైర్

image

డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని విమర్శించింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం నుంచి ప్రస్తుత మోదీ పాలన వరకు రూపాయి క్షీణించడంలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందో తెలుపుతూ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. ఇందులో మోదీదే అత్యధిక వాటా అంటూ పేర్కొంది. పై ఫొటోలో దానికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. రూపాయి విలువ భారీ పతనం మోదీ పాలనలో జరిగిందని అందులో కాంగ్రెస్ పేర్కొంది.

News January 25, 2025

జియో భారత్ ఫోన్లలో కొత్త ఫీచర్

image

జియో భారత్ ఫోన్లలో ‘జియో సౌండ్ పే’ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది దేశంలోని 5కోట్ల మంది చిరువ్యాపారులకు ఉపయోగపడుతుందని జియో ఇన్ఫొకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సునీత్ దత్ చెప్పారు. వినియోగదారుల ఆన్‌లైన్ పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్సులు అవసరం లేదని, ఫ్రీగా ‘జియో సౌండ్ పే’తో ఫోన్‌లోనే మెసేజ్ వినొచ్చని తెలిపారు. దీంతో ప్రతి వ్యాపారికి ఏడాదికి రూ.1500 సేవ్ అవుతుందన్నారు.