News May 7, 2025

రాజ్యాంగానికి లోబడే వక్ఫ్ సవరణ చట్టం: కేంద్రం

image

వక్ఫ్ సవరణ చట్టాన్ని సమర్థించుకుంటూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. వక్ఫ్ బోర్డులు పారదర్శకంగా పని చేయడం లేదని పేర్కొంది. ఈ చట్టంపై స్టే విధించవద్దని కోరింది. రాజ్యాంగానికి లోబడే చట్ట సవరణ చేశామని సుప్రీంకోర్టుకు తెలిపింది.

News May 7, 2025

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారం స్వాధీనం!

image

AP: ఒంగోలులో మూడు రోజుల క్రితం టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిందితులు వాడిన స్కూటీ లభ్యమైంది. చీమకుర్తి బైపాస్ రోడ్డులోని ఓ దాబా వద్ద స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా విచారణ వేగవంతం చేశారు. హత్య సమయంలో నిందితులు 2 స్కూటీలపై వచ్చి ఒకటి దాబా దగ్గర వదిలి వెళ్లగా, దానిపై రక్తం మరకలు ఉన్నట్లు తెలుస్తోంది.

News May 7, 2025

క్యాబినెట్‌లో NDSA రిపోర్ట్‌పై చర్చిస్తాం: ఉత్తమ్

image

TG: మేడిగడ్డ బ్యారేజ్‌పై NDSA రూపొందించిన <<16206712>>నివేదికపై<<>> మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బ్యారేజ్ ఎందుకూ పనికిరాదని NDSA తేల్చిందన్నారు. రూ.లక్ష కోట్లతో BRS నాసిరకం ప్రాజెక్టు నిర్మించిందని మండిపడ్డారు. రూ.వేల కోట్లు దోచుకునేందుకు కాళేశ్వరం నిర్మించారని ఫైరయ్యారు. క్యాబినెట్‌లో NDSA నివేదికపై చర్చించాకే తర్వాతి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.

News May 7, 2025

విరాట్ అనవసరంగా రిటైర్ అయ్యారు: రైనా

image

టీ20Iల నుంచి కోహ్లీ అనవసరంగా రిటైరయ్యారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డారు. ‘కనీసం 2026 T20 వరల్డ్ కప్ వరకూ కోహ్లీ ఆడాల్సింది. IPLలో అతడి ఫిట్‌నెస్ స్థాయులు, ఆడే విధానం చూస్తుంటే తొందరపడ్డారనే అనిపిస్తోంది. ఆయనింకా తన అత్యుత్తమ దశలోనే ఉన్నారు. మరికొంత కాలం కొనసాగాల్సింది’ అని పేర్కొన్నారు. IPL-2025లో కోహ్లీ ఇప్పటి వరకు 392 రన్స్‌ చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నారు.

News April 25, 2025

అల్లు అర్జున్ సినిమాలో మృణాల్?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జూన్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. సన్ పిక్చర్స్ ఈ మూవీకి నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది.

News April 25, 2025

పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. షా ఆదేశాలు

image

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేేపట్టారు.

News April 25, 2025

ఆర్మీ కంటపడ్డాడు.. ఖతమయ్యాడు

image

లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భారత సైన్యం <<16209767>>మట్టుబెట్టిన<<>> విషయం తెలిసిందే. పహల్గామ్ దాడి నిందితుల కోసం ఆర్మీ, J&K పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టగా అల్తాఫ్ వారి కంటపడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీ ఫైరింగ్‌లో అల్తాఫ్ హతమయ్యాడు. అటు కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఆర్మీ చీఫ్ ద్వివేది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

News April 25, 2025

BREAKING: ఇస్రో మాజీ ఛైర్మన్ కన్నుమూత

image

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్(84) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని నివాసంలో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో ఛైర్మన్‌గా కొనసాగారు. PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.

News April 25, 2025

‘సారంగపాణి జాతకం’ రివ్యూ&రేటింగ్

image

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూప జంటగా తెరకెక్కిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ థియేటర్లలో విడుదలైంది. జాతకాలను నమ్మే హీరో పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనేది సినిమా స్టోరీ. ప్రియదర్శి సహజ నటన, వెన్నెల కిశోర్, వైవా హర్ష కామెడీ మెప్పిస్తాయి. హీరోయిన్ రూప యాక్టింగ్, ఇంద్రగంటి రచన ఆకట్టుకుంటాయి. కాస్త స్లోగా అనిపించడం, ఊహించేలా కథ సాగడం మైనస్.
WAY2NEWS RATING: 2.75/5.

News April 25, 2025

యుద్ధ భయం.. భారీగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్

image

ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతోంది. ఉదయం నుంచే మందకొడిగా సాగిన సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 567 పాయింట్లు కోల్పోయి 79,234వద్ద సాగుతోంది, నిఫ్టీ 200పాయింట్ల నష్టంతో 24,045వద్ద ట్రేడవుతోంది. భారత్-పాకిస్థాన్ యుద్ధ భయం నేపథ్యంలో మార్కెట్ కుదేలవుతోంది.