News October 5, 2024

టుడే హెడ్ లైన్స్

image

* లడ్డూ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం
* తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన CBN
* పరిపాలనలో బాబు ఫెయిల్: జగన్
* మోదీ డైరెక్షన్‌లో పవన్ నటన: షర్మిల
* TG: ధరణి స్థానంలో కొత్త చట్టం: మంత్రి పొంగులేటి
* సీఎం రేవంత్ మోసగాడు: హరీశ్ రావు
* సురేఖపై రూ.100 కోట్ల దావా వేస్తా: నాగార్జున
* ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మృతి

News October 5, 2024

చైనాలో ఏటా టన్నుల కొద్దీ పాములు స్వాహా!

image

చైనీయులు ఏటా ఏకంగా 10వేల టన్నులకు పైగా పాముల్ని స్వాహా చేస్తున్నారని ఆ దేశ వన్యప్రాణ సంరక్షణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా షాంఘై, గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సుల్లో సర్పాలకు మహా డిమాండ్. ఒక్క షాంఘైలోనే 6వేల వరకూ పాము మాంసం హోటళ్లు ఉండటం గమనార్హం. తాచుపాముల నుంచి సముద్రపు పాముల వరకూ అన్నింటినీ చైనీయులు ఇష్టంగా తినేస్తారు. దీని వల్ల పర్యావరణ అసమతుల్యత తలెత్తే ప్రమాదం ఉందంటూ సంస్థ హెచ్చరించింది.

News October 5, 2024

గంభీర్ నా సోదరుడి లాంటివాడు: అక్మల్

image

టీమ్ ఇండియా కోచ్ గంభీర్, పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తరచూ గొడవ పడేవారన్న సంగతి తెలిసిందే. 2010లో ఆసియా కప్ సందర్భంగా ఒకరినొకరు సవాలు చేసుకోగా అంపైర్లు జోక్యం చేసుకుని విడిపించారు. అయితే అదంతా గ్రౌండ్ వరకేనని అక్మల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తమ ఇద్దరికీ వివాదాలేవీ లేవని, ఆయన తనకు సోదరుడితో సమానమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరం మంచి స్నేహితులమని వివరించారు.

News October 5, 2024

భారత మహిళల జట్టు ఓటమి

image

WT20 వరల్డ్ కప్‌ తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 రన్స్ చేసింది. 161 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఏ దశలోనూ టార్గెట్ ఛేదించేలా కనిపించలేదు. మంధాన(12), షఫాలీ(2) హర్మన్(15), రోడ్రిగ్స్(13), రిచా(12) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో IND 102కే ఆలౌట్ అయింది.

News October 5, 2024

మద్యపాన ప్రియులకు క్యాన్సర్ ముప్పు

image

మద్యం ఎక్కువ సేవించేవారికి క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని అమెరికన్ క్యాన్సర్ పరిశోధన సంఘం తాజాగా హెచ్చరించింది. ప్రధానంగా కాలేయం, కడుపు, అన్నవాహిక, పెద్ద పేగు, రొమ్ము, మెడ, తల భాగాలకు క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంటుందని తెలిపింది. మద్యపానం అదుపులో లేకపోతే జీవన ప్రమాణం గణనీయంగా తగ్గిపోతుందని హెచ్చరించింది. ఆ ఒక్క అలవాటును నియంత్రిస్తే 40శాతం క్యాన్సర్లను తగ్గించవచ్చని పేర్కొంది.

News October 4, 2024

ఇరాన్vsఇజ్రాయెల్: ఎవరి బలం ఎంతంటే..

image

ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య సైనిక బలాబలాల గురించి చూస్తే..
క్రియాశీల బలగాలు: ఇరాన్‌-6,10,000మంది, ఇజ్రాయెల్‌- 1,70,000మంది
రిజ్వర్వు బలగాలు: ఇరాన్-3,50,000, ఇజ్రాయెల్-4,65,000
రక్షణ బడ్జెట్: ఇరాన్-9.9 బిలియన్ డాలర్లు, ఇజ్రాయెల్-24.4 బిలియన్ డాలర్లు
ఫైటర్ జెట్లు: ఇరాన్-186, ఇజ్రాయెల్-241
హెలికాప్టర్లు, ట్యాంకులు: ఇరాన్-129, 2000, ఇజ్రాయెల్-146, 1300
సబ్‌మెరైన్లు: ఇరాన్-19, ఇజ్రాయెల్-5

News October 4, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలోని పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు అనంతపురంలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 4, 2024

టీ20 సిరీస్ మాదే: బంగ్లా కెప్టెన్

image

టీమ్ ఇండియాతో జరగబోయే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ధీమా వ్యక్తం చేశారు. ‘మా జట్టులో యువ క్రికెటర్లు ఉన్నారు. వారందరూ భారత్‌పై సత్తా చాటుతారు. టీ20 సిరీస్‌కు మేం అన్ని విధాలా సిద్ధమయ్యాం. దూకుడుగా ఆడాలని భావిస్తున్నాం. సిరీస్ గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతాం. టీ20ల్లో ఆ రోజున ఎవరు బాగా ఆడితే వారిదే విజయం’ అని ఆయన చెప్పుకొచ్చారు.

News October 4, 2024

నూతన స్పోర్ట్స్ పాలసీపై సీఎం సమీక్ష

image

TG: 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త స్పోర్ట్స్ పాలసీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలన్నారు. హైదరాబాద్‌లోని స్టేడియాలను ఒక హబ్‌గా చేయడంతో పాటు స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

News October 4, 2024

నా అనుమ‌తి లేకుండా లోప‌లికి ఎలా ప్రవేశిస్తారు?: ఖ‌ర్గే

image

రాజ్య‌స‌భలో ప్ర‌తిప‌క్ష నేత‌గా పార్ల‌మెంటులో త‌న‌కు కేటాయించిన గ‌దిలోకి అనుమ‌తి లేకుండా CPWD, CISF, టాటా ప్రాజెక్ట్‌ సిబ్బంది ప్ర‌వేశించ‌డంపై ఖ‌ర్గే మండిపడ్డారు. దీనిపై రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌కు లేఖ రాశారు. ‘ఇది అసాధారణ పరిణామం. ఎంపీగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నాకున్న అధికారాలు, నిబంధనలను ఉల్లంఘించడమే. ఎవరి ఆదేశానుసారం వారు ప్రవేశించారు?. దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి’ అని ఖర్గే పేర్కొన్నారు.