News January 23, 2025

నూతన DGP ఈయనేనా?

image

AP: DGP ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ సమయం దగ్గర పడటంతో కొత్త DGP ఎవరనే చర్చ జరుగుతోంది. నూతన DGPగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DGగా ఉన్నారు. ఎన్నికలప్పుడు హరీశ్‌ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే. పదవీకాలం పొడిగింపు కోసం తిరుమలరావు, పోలీస్ బాస్ పోస్ట్ కోసం CID DG రవిశంకర్ పోటీలో ఉన్నట్లు సమాచారం.

News January 23, 2025

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న ఉదయం అన్ని స్కూళ్లల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఆదేశించారు. HMలు, విద్యాసంస్థల ప్రధానాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. విద్యార్థులు ఉదయం జాతీయ గీతం ఆలపిస్తూ మార్చ్ పాస్ట్ నిర్వహించాలని సూచించారు.

News January 23, 2025

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మదగజరాజా’

image

విశాల్‌ నటించిన ‘మదగజరాజా’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సత్యకృష్ణన్‌ ప్రొడక్షన్‌ సిద్ధమైంది. సంక్రాంతికి తమిళనాట రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. వరలక్ష్మి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్‌ ప్రేక్షకులను అలరిస్తోందని మూవీ టీం తెలిపింది. 12ఏళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాలతో ఇంతకాలం విడుదల కాలేదు.

News January 23, 2025

రేపటి నుంచి విశాఖలో ABVP రాష్ట్ర మహాసభలు

image

AP: విశాఖలో రేపటి నుంచి ABVP రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. AU ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో మూడు రోజుల పాటు 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు. 25న ఏబీవీపీ కార్యకర్తలతో శోభాయాత్ర జరుగుతుందని చెప్పారు. సంస్థ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా త్వరలో ‘పంచ పరివర్తన్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాచంద్ర తెలిపారు.

News January 23, 2025

ఆ పోస్టులకు మార్చి 2న రాత పరీక్ష

image

AP: జైళ్ల శాఖలో డ్రైవర్ పోస్టుల భర్తీకి మార్చి 2న రాత పరీక్ష నిర్వహించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. గతంలో నిర్వహించిన డ్రైవింగ్ పరీక్షలో అర్హత సాధించిన 311 మందికి నెల్లూరు జిల్లా మూలపేటలోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రిఫార్మేషన్ సర్వీసెస్(APSTARS) పాత సెంట్రల్ జైలు ఆవరణలో పరీక్ష నిర్వహించనుంది. MLV అభ్యర్థులు ఉదయం 8గంటలకు, HMV అభ్యర్థులు మధ్యాహ్నం 12గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

News January 23, 2025

బుమ్రా, భువనేశ్వర్‌ను దాటేసిన హార్దిక్ పాండ్య

image

T20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో భువనేశ్వర్, బుమ్రాను హార్దిక్ పాండ్య దాటేశారు. ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన తొలి T20లో 2 వికెట్లు తీసిన హార్దిక్ తన ఖాతాలో 91 వికెట్లు వేసుకున్నారు. ఈ జాబితాలో భువనేశ్వర్‌కు 90, బుమ్రాకు 89 వికెట్లు ఉన్నాయి. అటు ఇండియా తరఫున T20ల్లో అత్యధిక వికెట్లు తీసిన లిస్టులో చాహల్‌ను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ సింగ్ 97 వికెట్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు.

News January 23, 2025

100 కోట్ల ఓటర్ల దిశగా భారత్

image

భారత్‌లో ఓటర్ల సంఖ్య 99.1కోట్లకు చేరిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ సంఖ్య 96.88కోట్లుగా ఉండేది. ఓటర్లలో యువతే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. 18-29ఏళ్ల వయస్సున్న వారు ఏకంగా 21.7కోట్ల మంది ఉన్నట్లు తెలిపింది. భారత్ త్వరలోనే 100కోట్ల మంది ఓటర్లతో రికార్డ్ సృష్టించనుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.

News January 23, 2025

పురుషులే ఎత్తు, బరువు పెరుగుతున్నారు!

image

శతాబ్ద కాలంలో మహిళల కంటే పురుషులే 2రెట్లు వేగంగా ఎత్తు, బరువు పెరిగారని ఓ అధ్యయనం వెల్లడించింది. రోహాంప్టన్‌ వర్సిటీకి చెందిన ప్రొ.లూయిస్‌ హాల్సే నేతృత్వంలోని పరిశోధకుల బృందం WHOతో పాటు పలు దేశాల రికార్డుల నుంచి సమాచారం సేకరించింది. దీని ప్రకారం 2 జెండర్లలో ఎత్తు, బరువులో చోటు చేసుకున్న మార్పులను గమనించింది. ఆపై మానవ అభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ) జీవన ప్రమాణాలతో పోల్చిచూసినట్లు హాల్సే చెప్పారు.

News January 23, 2025

భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలకు USA ప్రాధాన్యం: జైశంకర్

image

భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలకు అమెరికా ప్రాధాన్యం ఇస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోతో భేటీ అయిన జైశంకర్ మాట్లాడారు. ద్వైపాక్షిక ఒప్పందాలతో పాటు భారత్‌తో బంధాన్ని బలపరుచుకోవడానికి USA ఇష్టపడుతోందని తన పర్యటనలో అర్థమైందన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారత్ తరఫున జైశంకర్ హాజరయ్యారు.

News January 23, 2025

అభిషేక్ శర్మ బాల్ ఎక్సర్‌సైజ్ గమనించారా?

image

కోల్‌కతాలో జరిగిన తొలి T20లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. 34బంతుల్లోనే 8 సిక్సులు, 5 ఫోర్లతో 79 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. కాగా, బ్యాటింగ్‌కు రావడానికి ముందు అభిషేక్ బంతితో చేసిన ఎక్సర్‌సైజ్ SMలో వైరల్‌గా మారింది. బంతి సీమ్‌ను వివిధ పొజిషన్లలో చూస్తూ చేసిన ఈ ప్రాక్టీస్ బ్యాటింగ్ చేసే సమయంలో ఊపయోగపడింది. మ్యాచ్‌లో ఈ బాల్ ఎక్సర్‌సైజ్ గమనించి ఉంటే COMMENT చేయండి.