News April 15, 2024

TODAY HEADLINES

image

➢14 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల
➢పెట్రోల్ ధరలు తగ్గిస్తాం: మోదీ
➢AP:కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయట్లేదు: పవన్
➢బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా: CBN
➢AP:పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ అటెంప్ట్: సజ్జల
➢TG:గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం: మంత్రి సురేఖ
➢BJP అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు: MP లక్ష్మణ్
➢IPL: లక్నోపై కోల్‌కతా, ముంబైపై చెన్నై విజయం

News April 15, 2024

ఏపీకి వడగాలుల అలర్ట్

image

వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు.. మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ నంద్యాల(D) గోస్పాడులో 43.4 డిగ్రీలు, విజయనగరం(D) తుమ్మికపల్లిలో43.3 డిగ్రీలు, ఆముదాలవలసలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పింది.

News April 15, 2024

అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు ఉంటాయి: ఎంపీ లక్ష్మణ్

image

TG: బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలన టీవీ సీరియల్ ఎపిసోడ్‌లా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తోడు దొంగలేనని ఆరోపించారు.

News April 14, 2024

ఉత్కంఠ పోరులో చెన్నై విజయం

image

వాంఖడే స్టేడియంలో చెన్నైతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమి చెందింది. రోహిత్ శర్మ సెంచరీ (63 బంతుల్లో 105 రన్స్) బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇషాన్ కిషన్ 23, తిలక్ వర్మ 31 రన్స్ చేయగా.. సూర్యకుమార్ (0), పాండ్యా (2) నిరాశపర్చారు. చెన్నై బౌలర్లలో పతిరణ నాలుగు వికెట్లతో చెలరేగారు. తుషార్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.

News April 14, 2024

రైతులకు రూ.500 బోనస్ ఇవ్వకపోతే సచివాలయ ముట్టడి: హరీశ్ రావు

image

TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ధాన్యం పండించే రైతులకు రూ.500 బోనస్ ఇవ్వకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు లాభం జరిగితే తాము సంతోషిస్తామని, ఈసీకి ఫిర్యాదు చేయబోమని స్పష్టం చేశారు. ప్రజలు కేసీఆర్, కాంగ్రెస్ పాలనకు తేడాను గమనించాలని కోరారు.

News April 14, 2024

ఆ ముగ్గురిపై అనర్హత వేటు ఖాయం: KCR

image

TG: కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు ఖాయమని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకోసం తాము పోరాటం చేస్తామన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నికకు సిద్ధం కావాలని రాజయ్యకు సూచించారు. ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. వరంగల్‌ BRS ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపునకు కృషి చేయాలని ఆదేశించారు.

News April 14, 2024

BREAKING: రోహిత్ శర్మ ‘సిక్సర్ల’ రికార్డు

image

టీ20 క్రికెట్‌(లీగ్+ఇంటర్నేషనల్)లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. 500 సిక్సర్లు బాదిన తొలి ఇండియన్‌గా నిలిచారు. ఇవాళ చెన్నైపై 3 సిక్సులు కొట్టడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఓవరాల్‌గా 1,056 సిక్సులతో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత పొలార్డ్(860), ఆండ్రూ రస్సెల్(678), కొలిన్ మున్రో(548) ఉన్నారు.

News April 14, 2024

సెబీలో ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ వాయిదా

image

సెబీలో 97 ఆఫీసర్ గ్రేడ్-A ఉద్యోగాలకు నిన్న ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని సంస్థ తెలిపింది. ఈ పోస్టులకు జనరల్, లీగల్, ఐటీ, ఇంజినీరింగ్, రీసెర్చ్ విభాగాల్లో UG/PG పూర్తిచేసిన వారు అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా నియామకం ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1,49,000 జీతం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 14, 2024

ఈ అభ్యర్థి అప్పులు రూ.649.50 కోట్లు

image

తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో ఓ ఎంపీ అభ్యర్థి అప్పులు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అరక్కోణం పార్లమెంట్ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్‌.జగద్రక్షకన్‌ తనకు రూ.649.50 కోట్ల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో తర్వాతి స్థానాల్లో శివగంగై బీజేపీ అభ్యర్థి దేవనాథన్‌ యాదవ్‌ రూ.98.30కోట్లు, వేలూరు డీఎంకే అభ్యర్థి కదిర్‌ ఆనంద్‌ రూ.51.61కోట్ల అప్పులున్నట్లు వెల్లడించారు.

News April 14, 2024

DHONI: ఏంది సామీ ఈ క్రేజ్?

image

ORMAX Media సర్వే ప్రకారం IPL-2024లో మూడో వారంలోనూ మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా చెన్నై స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచారు. తొలి రెండు వారాలు కూడా ధోనీనే మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా ఉన్నారు. ఈ సీజన్‌లో ధోనీ తన బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తనదైన స్టైల్‌లో సిక్సర్లు బాది ప్రేక్షకులకు ఎంటర్టైన్‌మెంట్ అందించారు. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 37 పరుగులు చేశారు.