News January 18, 2025

ప్యాకేజీ ఓకే.. సొంతంగా గనులు కేటాయించండి: అమర్నాథ్

image

AP: వెంటిలేటర్ మీద ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఆక్సిజన్‌లా మాత్రమే పనిచేస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. రూ.11,400 కోట్లు అప్పులకే సరిపోతాయన్నారు. ఫ్యాక్టరీని కాపాడాలంటే సొంతంగా గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. YCP హయాంలో ప్రైవేటీకరణను వ్యతిరేకించినట్లు కేంద్ర మంత్రి <<15182866>>కుమారస్వామి<<>> స్వయంగా చెప్పారని పేర్కొన్నారు.

News January 18, 2025

నితీశ్‌కు నిరాశ

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన తెలుగు తేజం నితీశ్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. పేస్ ఆల్‌రౌండర్లలో పాండ్య వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. దీంతో తెలుగు క్రికెట్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. మరోవైపు పేసర్ సిరాజ్‌, బ్యాటర్ తిలక్ వర్మను కూడా జట్టులోకి తీసుకోలేదు. దీంతో తెలుగు స్టేట్స్ నుంచి CTలో ప్రాతినిధ్యం లేకుండాపోయింది.

News January 18, 2025

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కూ అదే జట్టు.. కానీ

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన 15 మంది సభ్యుల <<15185531>>జట్టే<<>> ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లోనూ పాల్గొంటుందని కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అగార్కర్ తెలిపారు. కానీ బుమ్రా స్థానంలో హర్షిత్ రాణా వస్తారని వెల్లడించారు. అయితే తొలి రెండు వన్డేలకు బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగే మూడో వన్డే నుంచి అతడు జట్టులోకి వచ్చి, CTలోనూ పాల్గొంటారని తెలుస్తోంది.

News January 18, 2025

అనుమానాలు పటాపంచలు.. CTలో బుమ్రా

image

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అనుమానమేనన్న వార్తలకు తెరపడింది. ఇవాళ అతని పేరును సెలక్టర్లు ప్రకటించారు. దీంతో స్టార్ బౌలర్ కోలుకున్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది. BGTలో భారత బౌలింగ్ దళాన్ని బుమ్రా ఒంటి చేత్తో ముందుకు నడిపించిన విషయం తెలిసిందే. ట్రోఫీ కోల్పోయినప్పటికీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నారు.

News January 18, 2025

రాయలసీమను రతనాల సీమగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

image

AP, కేంద్రంలో NDA ప్రభుత్వం ఉండటం వల్లే అమరావతి, పోలవరం పనులు ముందుకెళ్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లూ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ తీరిపోతున్నాయని చెప్పారు. మైదుకూరులో మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా చేయడమే తన లక్ష్యమన్నారు. గోదావరి-పెన్నా, పోలవరం-బనకచర్ల అనుసంధానమైతే గేమ్‌ఛేంజర్‌ అవుతుందని పేర్కొన్నారు.

News January 18, 2025

సంజయ్‌ను ఉరి తీయండి: ప్రజల నినాదాలు

image

అభయ హత్యాచార కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌ను ఉరి తీయాలని కోర్టు బయట మెడిసిన్ విద్యార్థులు, ప్రజలు నినాదాలు చేశారు. ఇలా అయితేనే మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడేందుకు భయపడతారని అన్నారు. కాగా కేసు తీవ్రత దృష్ట్యా ఈ మధ్యాహ్నం భారీ బందోబస్తు మధ్య రాయ్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. ప్రత్యేక బృందాలతో పాటు 300 మందికి పైగా పోలీసులు కోర్టు చుట్టూ మోహరించారు.

News January 18, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత జట్టు ప్రకటన

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు.
టీమ్: రోహిత్ శర్మ (C), గిల్(VC), జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్.

News January 18, 2025

నేను నేరం చేయలేదు: కోర్టులో సంజయ్

image

కోల్‌కతా హత్యాచార ఘటనలో దోషిగా కోర్టు నిర్ధారించిన <<14530358>>సంజయ్ రాయ్<<>> తాను నిర్దోషిని అని వాదించాడు. ఈ రోజు కోర్టు తీర్పు వెల్లడించే ముందు జడ్జితో ‘నేను ఈ నేరం చేయలేదు’ అని చెప్పాడు. గతంలో కూడా ఇతడు ఇదే తరహా కామెంట్లు చేశాడు. అటు అతడు ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నామని రాయ్ కుటుంబం పేర్కొంది. కోల్‌కతాలోని శంభునాథ్ స్లమ్‌లో ఒక గదిలో ఉండే వీరి కుటుంబం.. పోరాడే శక్తి సైతం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

News January 18, 2025

పవన్ కళ్యాణ్ అభిమానులకు మళ్లీ నిరాశే?

image

హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాబిన్ హుడ్’ మార్చి 28న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఆయన నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సైతం అదేరోజున విడుదలకానుంది. నితిన్ మూవీ అప్డేట్‌తో HHVM వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నాయి. అదే జరిగితే రాబిన్‌ హుడ్‌తో పాటు VD12, మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే తేదీలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

News January 18, 2025

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసులో తీర్పు వెల్లడి

image

యావత్ దేశం చలించిన <<13905124>>అభయ<<>> హత్యాచార కేసులో సీల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. సంజయ్ రాయ్‌ను దోషిగా తేలుస్తూ తీర్పిచ్చింది. కలకత్తా RG కర్ మెడికల్ కాలేజ్‌లో ట్రైనీ డాక్టర్ 2024 AUG 9న దారుణ అత్యాచారం, హత్యకు గురైంది. నిర్భయ తీవ్రతను తలపించేలా జరిగిన ఈ దుశ్చర్యపై CBI దర్యాప్తు జరిపి OCT 7న ఛార్జిషీట్ వేసింది. డైలీ విచారణ అనంతరం నేడు దోషిగా తేల్చిన జడ్జి అనిర్బన్ దాస్ సోమవారం శిక్ష ఖరారు చేయనున్నారు.