News January 18, 2025

నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్

image

AP: నేటి నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2020 తర్వాత ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. తిరుపతి(D) సుళ్లూరుపేటలోని నేలపట్టు, అటకానితిప్ప, బీవీ పాలెం, శ్రీసిటీ ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ జరగనుంది. 3 రోజుల్లో 5-6 లక్షల మంది పర్యాటకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

News January 18, 2025

సైఫ్‌పై దాడి.. ఈ ప్రశ్నలకు సమాధానమేది?

image

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి ఘటనలో పలు విషయాలు అంతుచిక్కడం లేదు. *ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి దాడి తర్వాత ఎలా తప్పించుకున్నాడు? *బిల్డింగ్‌ లేఅవుట్ అతనికి ముందే తెలుసా? *సైఫ్ ఆటోలోనే ఎందుకు వెళ్లారు? *సైఫ్‌తో పెద్ద వారు కాకుండా 7 ఏళ్ల చిన్నారి ఎందుకు వెళ్లాడు? వంటి ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. నిందితుడు పోలీసులకు చిక్కితే వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News January 18, 2025

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జారీ

image

AP: ఏప్రిల్‌కు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఇవాళ ఉ.10గంటలకు రిలీజ్ చేయనుంది. ఈ సేవల లక్కీడిప్ కోసం ఈ నెల 20న ఉ.10గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఈ నెల 23న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం, ఉ.11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లు జారీ చేయనుంది. 24న ఉ.10 గంటలకు రూ.300 కోటా, మ.3 గంటలకు వసతి గృహ టికెట్లు ఇవ్వనుంది.

News January 18, 2025

బీజేపీ మ్యానిఫెస్టోలోనూ మా పథకాలే: కేజ్రీవాల్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ పథకాలపై విమర్శలు చేస్తూనే BJP చీఫ్ నడ్డా ఉచితాలను ప్రకటించారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఉచితాలు హానికరం కాదని చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ గతంలో తమపై చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకోవాలన్నారు. తాము అమలు చేస్తున్న పథకాలనే బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని విమర్శించారు.

News January 18, 2025

ఆ రోజున కుంభమేళాకు 10 కోట్ల మంది వచ్చే అవకాశం: యోగీ

image

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు ఈ నెల 29 అమవాస్య రోజున 8-10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని UP సీఎం యోగీ ఆదిత్యనాథ్ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు, 24 గంటల విద్యుత్, నీటి సరఫరా, అత్యున్నత స్థాయి భద్రత ఉండాలని తెలిపారు. అమవాస్య రోజు కావడంతో భక్తులు పుణ్యస్నానానికి పోటెత్తుతారని పేర్కొన్నారు.

News January 18, 2025

ఈ ఏడాది గరిష్ఠంగానే భారత్‌ వృద్ధి రేటు: IMF

image

ఈ ఏడాదికిగానూ ప్రపంచదేశాల వృద్ధి రేటు అంచనాలతో ఐఎంఎఫ్ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది భారత వృద్ధి రేటు గరిష్ఠంగా 6.5గా ఉండగా ఈ ఏడాదీ అదే కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు అడ్వాన్స్‌డ్ ఎకానమీగా పేరొందిన USA వృద్ధి రేటు 2.7గా ఉండొచ్చని పేర్కొంది. మధ్య ఆదాయ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 4.2గా అల్ప ఆదాయ దేశాల్లో 4.6గా వృద్ధి రేటు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.

News January 18, 2025

సైఫ్‌పై దాడిలో ఆధారాలు గుర్తింపు: ఫడ్నవీస్

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటనలో పోలీసులు కొన్ని ఆధారాలను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి చిత్రాలను స్పష్టంగా కనుగొన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అతి త్వరలోనే నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. కాగా బాలీవుడ్ స్టార్లపై వరుస దాడుల నేపథ్యంలో మహా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

News January 18, 2025

నేడు రాష్ట్రానికి అమిత్ షా

image

AP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్‌లో బస చేయనున్నారు. రేపు గన్నవరంలో సమీపంలోని NIDM సెంటర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభిస్తారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

News January 18, 2025

ముడా కేసులో సిద్ధ రామయ్యకు ఈడీ షాక్

image

ముడా మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 142 ఆస్తులను అటాచ్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని, విపక్షాలు తనపై రాజకీయ కక్షతోనే కుట్ర పన్నారని సీఎం చెబుతున్నారు.

News January 18, 2025

జనవరి 18: చరిత్రలో ఈరోజు

image

1881: సంఘ సంస్కర్త, భాషావేత్త నాళం కృష్ణారావు జననం
1927: ప్రముఖ సంగీత విద్వాంసుడు, దర్శకుడు సుందరం బాలచందర్ జననం
1972: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం
1975: సినీ నటి మోనికా బేడి జననం
1996: సినీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ మరణం
2003: హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ మరణం