India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు కుర్రాడు గోపీచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. బ్లూ ఆరిజిన్ న్యూ షెఫర్డ్-25 మిషన్ కోసం ఆయన ఎంపికయ్యారు. ఆయనతోపాటు మరో ఐదుగురు స్పేస్లోకి వెళ్లనున్నారు. మిషన్ ప్రయోగ తేదీ ఇంకా వెల్లడించలేదు. కాగా 30 ఏళ్ల గోపీచంద్ ఏపీలోని విజయవాడకు చెందిన కుర్రాడు. ఆయన ఒక పైలట్, ఏవియేటర్. ఆయన విద్యాభ్యాసం ఫ్లోరిడా, దుబాయ్లో కొనసాగింది. ప్రస్తుతం గోపీ అమెరికాలో నివసిస్తున్నారు.
ఆర్సీబీ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే మ్యాచ్లో అతడు ఆడటంపై అనుమానం నెలకొంది. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా మ్యాక్సీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో అతడికి రెస్ట్ ఇవ్వాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్లో ఆర్సీబీ 6 మ్యాచ్లాడి కేవలం ఒకటే గెలిచింది.
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైన నాలుగు నెలల్లోనే వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు. మరోవైపు ఆ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయని హరీశ్ అన్నారు. ఎన్నికలకు ముందు క్వింటాకు రూ.2500 ఇచ్చి వడ్లు కొంటామని రేవంత్ అన్నారని, కానీ.. జనగామలో రూ.1500 మాత్రమే ధర పలుకుతోందని పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. పాసైన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆలోచిస్తుండగా ఫెయిలైన వారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి గెలుపోటములు తాత్కాలికం. చీకటి శాశ్వతం కాదు. దాని వెంట వెలుగు వస్తూనే ఉంటుంది. ఇదే చివరి అపజయం అని సానుకూల దృక్పథంతో మళ్లీ ప్రయత్నించాలని సూచిస్తున్నారు. 12th ఫెయిల్ మూవీ రియల్ హీరో మనోజ్, సచిన్ లాంటి ప్రముఖులు కూడా ఫెయిలైన వారే.
లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడంతో ఢిల్లీలో త్వరలోనే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు తెలుస్తోంది. తమకు రాష్ట్రపతి పాలనపై విశ్వసనీయ సమాచారం ఉందని ఆప్ మంత్రి ఆతిశీ అన్నారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి అధికారుల బదిలీలు, నియామకాలు లేవన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు హాజరుకావడం లేదని ఆమె పేర్కొన్నారు. కాగా.. ఆమె ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది.
విలక్షణ నటుడు షాయాజీ షిండే ఆసుపత్రిపాలయ్యారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించి, యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం షిండే పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేయనున్నారు. గతంలోనూ ఒకసారి షిండే ఛాతీనొప్పికి గురయ్యారు.
TG: రైతులను ఇబ్బంది పెట్టవద్దని CM రేవంత్ చెప్పినా పలుచోట్ల పరిస్థితి మారడం లేదు. మార్కెట్లకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. ట్రేడర్లు, మిల్లర్లు దందా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నాణ్యత పేరుతో క్వింటాకు రూ.500-రూ.600 అడ్డగోలుగా కోత విధిస్తున్నారట. మార్కెట్లలో మిల్లర్లు, ట్రేడర్లు, సిబ్బంది కుమ్మక్కై తమను దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్లో చాలామంది డబ్బు, ఫేమ్ కోసమే పెళ్లి చేసుకుంటున్నారని హీరోయిన్ నోరా ఫతేహి అన్నారు. ‘ప్రేమించినట్లు నటించి డబ్బు, పేరు కోసం వారు తాపత్రయపడుతున్నారు. ఏళ్ల తరబడి వారితోనే జీవిస్తూ జీవితం నాశనం చేసుకుంటున్నారు. వారి కెరీర్ ఎక్కడికెళ్తుందో తెలియదు. తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి డిప్రెషన్లో జీవిస్తున్నారు. వారు ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
AP: శిరోముండనం కేసులో తీర్పు వాయిదా పడింది. 27 ఏళ్ల క్రితం ఐదుగురు దళిత యువకులకు గుండు కొట్టించి, మీసం తీయించిన ఘటనలో ఇవాళ తుది తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో తీర్పును ఈనెల 16కు వాయిదా వేశారు.
TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో BRS MLC కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ED, CBI చెరోవైపు ఆమెను విచారణ పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు కోర్టు కూడా ఆమె బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తోంది. మరోవైపు IT కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెపై ముప్పేట దాడి కొనసాగుతుండటంతో ఎన్నికలయ్యేవరకూ బెయిల్ రాదని అంటున్నారు.
Sorry, no posts matched your criteria.