India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తుండటం పంజాబ్లో ఆసక్తికరంగా మారింది. ఇందిరను కాల్చిన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ పంజాబ్లోని ఫరీద్కోట్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయన 2004, 2009లో బఠిండా నుంచి, 2007లో భదౌర్ అసెంబ్లీ స్థానం, 2014లో ఫతేగఢ్ సాహిబ్ స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే ఎప్పుడూ విజయం సాధించలేదు.
ఈ వేసవిలో తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు చెందిన 24కోట్ల మంది పిల్లల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని యూనిసెఫ్ హెచ్చరించింది. విపరీతమైన వేడే ఇందుకు కారణమని తెలిపింది. త్వరలో రికార్డ్ స్థాయిలో ఎండలు దంచికొట్టనున్న వేళ పిల్లలు సంబంధిత వ్యాధుల బారిన పడొచ్చని, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వాంఖడేలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ స్టార్లు విరాట్, మ్యాక్స్వెల్ విఫలమయ్యారు. కోహ్లీ 9 బంతుల్లో 3 రన్స్కు ఔట్ కాగా మ్యాక్స్వెల్ 4 బంతులాడి డకౌట్ అయ్యారు. ఈక్రమంలో మ్యాక్సీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్లో అత్యధికసార్లు(17) డకౌటైన ఆటగాడిగా దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ సరసన చేరారు.
తెలంగాణ జిల్లాల్లోని పేద క్రికెట్ ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు 2500 మంది క్రికెటర్లకు నిపుణులైన కోచింగ్ సిబ్బందితో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీనికోసం ప్రతి జిల్లా క్రికెట్ సంఘానికి రూ. 15 లక్షల నిధులిచ్చామన్నారు. ఈ నెల 15 నుంచి అప్లై చేసుకోవాలని సూచించారు.
ఇన్స్టాగ్రామ్లో సెక్స్టార్షన్/లైంగిక వేధింపులు నుంచి టీనేజర్లకు రక్షణగా ఏఐ టూల్ లాంచ్ చేయనున్నట్లు మెటా వెల్లడించింది. న్యూడిటీ ప్రొటెక్షన్ అనే టూల్ ప్రయోగ దశలో ఉందని తెలిపింది. మెసేజింగ్ ద్వారా మైనర్లకు అసభ్యకర ఫొటోలు వస్తే వాటిని గుర్తించి బ్లర్ చేసేలా టూల్ను డిజైన్ చేస్తున్నట్లు వివరించింది. దీంతో యూజర్లకు అనవసర కంటెంట్ కనపడదని, వారికి ఆ ఇమేజ్ చూడాలా? వద్దా అనే ఛాయిస్ ఉంటుందని తెలిపింది.
AP: టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఛైర్మన్గా భూమనను తొలగించాలని కోరారు. టీటీడీ ఉద్యోగులను ఆయన స్థలాలు, అలవెన్సుల పేరుతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో బీజేపీ, జనసేన నేతలు పేర్కొన్నారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలోని నకిలీ ఓట్లను తొలగించాలని కోరారు.
తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది. 2 రోజులుగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
AP: రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాము కూటమిగా ఏర్పడినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. జగన్ను ఇక్కడి నుంచి తన్ని తరిమేస్తున్నాం. వాలంటీర్లలో కొందరే తప్పులు చేశారు. కొన్ని పండ్లు చెడిపోతే బుట్టలో మిగతా పండ్లు చెడిపోతాయి. వాలంటీర్లకు అధికారంలోకి రాగానే రూ.10వేలు వేతనం ఇస్తాం. వారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి’ అని పవన్ సూచించారు.
తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం మాత్రం మానేయనని బాలీవుడ్ నటి నోరా ఫతేహీ అన్నారు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని, ఆ పాపాలను కడుక్కోవడానికే దేవుణ్ని ప్రార్థిస్తుంటారని ఆమె పేర్కొన్నారు. ‘నా 14ఏళ్ల నుంచి నేను రంజాన్ ఉపవాసం ఉంటున్నా. అది నాలో చొచ్చుకుపోయింది’ అని ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్లో భారత్ ప్రయాణం ముగిసింది. ప్రీ-క్వార్టర్ఫైనల్లో పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణోయ్ ఓటమిపాలయ్యారు. చైనాకు చెందిన సిక్స్త్ సీడ్ హాన్ యువే చేతిలో సింధు పోరాడి 18-21, 21-13, 17-21 తేడాతో ఓడారు. దీనికి ముందు ఆమెతో 5సార్లు తలపడిన సింధు ఎప్పుడూ ఓడిపోలేదు. ఇక సెవెన్త్ సీడ్గా బరిలోకి దిగిన ప్రణోయ్, తైపీకి చెందిన అన్సీడెడ్ లిన్ చున్-యీ చేతిలో 43 నిమిషాల్లోనే ఓడిపోయారు.
Sorry, no posts matched your criteria.