India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఇంటర్ కాలేజీలకు ప్రభుత్వం మార్చి 30 నుంచి మే 31 వరకు హాలిడేస్ ప్రకటించింది. గురుకులాలు మాత్రం మే 16 నుంచి 31 వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించాయి. ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు, ప్రస్తుతం మెయిన్స్, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న సెకండియర్ విద్యార్థులతో సమానంగా మే 15వరకు వేసవి తరగతులు నిర్వహించనున్నాయి. హాలిడేస్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయనున్నారు.
TG: ప్రైవేటు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ సంఖ్య, కన్సల్టెంట్ డాక్టర్ల పేర్లను విధిగా బోర్డులపై ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య మండలి ఆదేశించింది. ఫార్మా-డీ డిగ్రీ కలిగిన వారిని, ఆయుష్ డాక్టర్లను డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయొద్దని, నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ముంబై ఇండియన్స్ క్రికెటర్లు సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, పీయూష్ చావ్లాతో పాటు LSG ఆటగాడు కృనాల్ పాండ్య కూడా గణేషుడి సేవలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో హార్దిక్ నేతృత్వంలో ముంబై వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. టోర్నీలో ఇప్పటివరకు ఒకే ఒక్క విజయం తన ఖాతాలో వేసుకుంది.
ఓటు వినియోగంపై ఓ సెలూన్ యజమాని వినూత్న ప్రచారం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి తన సెలూన్లో ఉచితంగా హెయిర్ కట్ చేస్తానని మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ ప్రకటించారు. ఓటేసి వచ్చి వేలికి సిరా గుర్తు చూపించి ఫ్రీగా కటింగ్ చేయించుకోవచ్చని షాపు ముందు బోర్డు పెట్టాడు. కాగా రెండో విడతలో భాగంగా మహారాష్ట్రలో ఈనెల 26న 8 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
మూడు నెలల్లో 3 గాయాలతో పోరాడినట్లు ముంబై ఇండియన్స్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. స్పోర్ట్స్ హెర్నియా, చీలమండ, కుడి మోకాలికి గాయాలైనట్లు తెలిపారు. ఒక్కో గాయం నుంచి బయటపడినట్లు పేర్కొన్నారు. ఎన్సీఏలో ఉదయాన్నే నిద్రలేచి కసరత్తులు చేయడం, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడ్డాయన్నారు. ఢిల్లీతో మ్యాచులో ఎంట్రీ ఇచ్చిన సూర్య డకౌటైన సంగతి తెలిసిందే.
TG: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికే వ్యతిరేకమని దుయ్యబట్టారు. రజాకార్లకు తోడుగా ఉండే వారంతా తన ప్రత్యర్థులేనన్నారు. రాబోయే ఎన్నికల్లో తనదే విజయమని.. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్పై లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలుస్తానని జోస్యం చెప్పారు.
మేనరికం, దగ్గరి బంధువులను పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన వ్యాధులతోపాటు నేత్ర సంబంధ సమస్యలు సంక్రమించే ప్రమాదం ఉందని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడయింది. కార్నియాలో మచ్చలు, శుక్లాలు, గ్లకోమా, రెటినైటిస్ పిగ్మెంటోసా తలెత్తే ముప్పు ఉందని తేలింది. కంటిని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉందంది. సమస్యలను ముందే గుర్తిస్తే శస్త్ర చికిత్సలు, మందుల ద్వారా నివారించవచ్చని పేర్కొంది.
అమెరికాలో ఓ కొడుకు చేసిన తప్పుకు అతడి తల్లిదండ్రులకు శిక్ష పడింది. 2021లో మిచిగాన్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎథాన్ క్రంబ్లీ అనే టీనేజర్ తుపాకీతో నలుగురిని చంపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని పేరెంట్స్ కోర్టులో చెప్పారు. అలాంటి పిల్లాడికి తుపాకీ ఎందుకిచ్చారని.. అది ముమ్మాటికీ తప్పేనని చెబుతూ కోర్టు వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
AP: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు ఉదయం విడుదల కానున్నాయి. ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పాట్లు చేసింది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగగా, మొత్తం 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 4వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. అందరికంటే ముందుగా WAY2NEWSలో ఇంటర్ ఫలితాలను చూసుకోండి.
AP: పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తానని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు. నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని, పవన్కు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. తాను నటించిన ‘లవ్మౌళి’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పిఠాపురంలోని శ్రీపాదవల్లభుడిని దర్శించుకున్న ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. ‘లవ్మౌళి’ ఈనెల 19న విడుదల కానుంది.
Sorry, no posts matched your criteria.