News October 16, 2024

ఫ్యూయెల్ కోసం వెళ్లి 94 మంది మృతి

image

నైజీరియాలోని మాజియాలో ఫ్యూయెల్ ట్యాంకర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 94మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 50 మంది గాయపడ్డారు. ఎదురుగా ఉన్న ట్రక్కును తప్పించే క్రమంలో ఈ ట్యాంకర్ పడిపోయింది. అయితే ఫ్యూయెల్ తీసుకొనేందుకు స్థానికులు ఆ ట్యాంకర్‌ను చుట్టుముట్టారు. ఆ సమయంలోనే ట్యాంకర్ పేలిందని పోలీసులు తెలిపారు.

News October 16, 2024

ఆస్ట్రేలియాలో గెలవాలంటే అతడు బాగా ఆడాల్సిందే: పార్థివ్

image

ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా గెలవాలంటే శుభ్‌మన్ గిల్ కచ్చితంగా బాగా ఆడాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ‘భారత్ తరఫున గత పర్యటనల్లో వన్‌డౌన్ బ్యాటర్ పుజారా అద్భుతంగా ఆడారు. ఇప్పుడు ఆ స్థానంలో గిల్ ఆడుతున్నారు. టెస్టుల్లో గెలుపునకు 3, 4 స్థానాల ఆటగాళ్లు రన్స్ చేయడం కీలకం. ఇది గిల్‌కి రెండో పర్యటన కాబట్టి అతడిని సీనియర్ ప్లేయర్‌గానే పరిగణించాలి’ అని పేర్కొన్నారు.

News October 16, 2024

ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం

image

AP: ఉచిత ఇసుక అంశంలో ఫిర్యాదులు రావడంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై చర్చించేందుకే ఎల్లుండి పార్టీ సమావేశం నిర్వహిస్తున్నామని క్యాబినెట్ భేటీలో తెలిపారు. ఇసుక అంశంలో MLAల జోక్యంపై వచ్చిన ఫిర్యాదులపై చర్చిస్తామన్నారు. లబ్ధిదారులపై రవాణా ఛార్జీలు తప్ప ఇతర ఛార్జీలు పడకూడదని, ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే రుసుము వసూలు చేయొద్దన్నారు. అక్రమాలు జరగకుండా ఇన్‌ఛార్జ్ మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు.

News October 16, 2024

కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన యూట్యూబ్

image

యూట్యూబ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. స్లీప్ టైమర్, రీసైజబుల్ మినీ ప్లేయర్, ఫేవరెట్ ప్లే లిస్ట్, బ్యాక్ స్పీడ్ కంట్రోల్ వంటి వాటిని పరిచయం చేసింది. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయో స్పష్టంగా వివరించింది. ఒకవేళ యూట్యూబ్ చూస్తూ యూజర్ పడుకున్నా వీడియో పాస్ అయ్యేలా స్లీప్ టైమర్ ఉండనుంది. బ్యాక్ స్పీడ్ 0.25 సెకండ్స్ నుంచి 0.05 సెకండ్స్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.

News October 16, 2024

మహాయుతి కూటమి సీఎం అభ్యర్థి ఎవరంటే?

image

వచ్చే నెలలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై డిప్యూటీ CM దేవేంద్ర ఫడ్నవీస్ హింట్ ఇచ్చారు. ఆ అభ్యర్థి ఇక్కడే ఉన్నారంటూ, శివసేన అధినేతనే తదుపరి సీఎం అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందన్నారు. దీంతో ఏక్‌నాథ్ షిండే పేరును చెప్పకనే చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి లేరని సెటైర్లు వేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి.

News October 16, 2024

ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో కుక్, డివిలియర్స్, నీతూ డేవిడ్

image

అలెస్టర్ కుక్, నీతూ డేవిడ్, ఏబీ డివిలియర్స్‌కు (ICC) హాల్ ఆఫ్ ఫేమ్‌(2024)లో చోటు దక్కింది. కుక్(ఇంగ్లండ్) 161 టెస్టులు- 12,472 రన్స్, 92 ODIల్లో 3,205 రన్స్, 4 టీ20ల్లో 61 రన్స్ చేశారు. నీతూ డేవిడ్(భారత్) 10 టెస్టులాడి 41 వికెట్లు, 92 వన్డేల్లో 141 వికెట్లు తీశారు. డివిలియర్స్(సౌతాఫ్రికా) 114 టెస్టుల్లో 8,765 రన్స్, 228 వన్డేల్లో 9,577 పరుగులు, 78 టీ20ల్లో 1,672 రన్స్ చేశారు.

News October 16, 2024

జైలులోనే చనిపోయేవాడిని: కేజ్రీవాల్

image

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ BJPపై సంచలన ఆరోపణలు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు తనకు ఇన్సులిన్ ఇవ్వడాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు. ఒకవేళ తనకు సమయానికి ఇన్సులిన్ అందకపోతే తాను జైలులోనే మరణించేవాడినని పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయకున్నా BJP సర్కార్ తనను అరెస్ట్ చేయించిందని ఆయన ఆరోపించారు.

News October 16, 2024

STOCK MARKET: మళ్లీ 25,000 కిందకు నిఫ్టీ

image

బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం ఇన్వెస్టర్లలో నెగటివ్ సెంటిమెంటును పెంచింది. BSE సెన్సెక్స్ 81,501 (-318), NSE నిఫ్టీ 24,971 (-86) వద్ద క్లోజయ్యాయి. HDFC లైఫ్, Dr రెడ్డీస్, గ్రాసిమ్, ఎయిర్‌టెల్, HDFC బ్యాంక్ టాప్ గెయినర్స్. ట్రెంట్, M&M, హీరోమోటో, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్స్. నేడు ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టి, టెలికం సూచీలు పెరిగాయి.

News October 16, 2024

ఐఏఎస్‌లు అయినంత మాత్రాన స్టే ఇవ్వాలా?: హైకోర్టు

image

క్యాట్ తీర్పుపై <<14372641>>ఐఏఎస్‌లు<<>> దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై TG హైకోర్టులో వాదనలు ముగిశాయి. ‘ఐఏఎస్‌లు అయినంత మాత్రాన స్టే ఇవ్వాలంటే ఎలా?’ అని కోర్టు ప్రశ్నించింది. బాధ్యతాయుతమైన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దని సూచించింది. ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేయడానికి 10-15 రోజుల టైమ్ కావాలని AP, TG ప్రభుత్వాలు ధర్మాసనానికి తెలిపాయి.

News October 16, 2024

గుర్లలో డయేరియా పరిస్థితిపై సీఎం ఆరా

image

AP: విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాతో 2 రోజుల్లో ఐదుగురు <<14366235>>మృతి చెందిన <<>>ఘటనపై CM చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో బాధితుల పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స, గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను CM ఆదేశించారు.