News October 16, 2024

ప్లాట్ కొనేముందు ఓసారి చెక్ చేసుకోండి!

image

హైడ్రా భయంతో HMDA పరిధిలో ప్లాట్ కొనేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈక్రమంలో ధ్రువీకరించిన లేఅవుట్లలోనే ప్లాటు కొనడం శ్రేయస్కరమని రియల్ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మీరు చూస్తున్న లేఅవుట్ అనధికారికంగా ఏర్పాటు చేసిందా? ప్రభుత్వ అనుమతులున్నాయా? అనే విషయాన్ని తెలుసుకోవడం మంచిది. వీటిని <>HMDA తన అధికారిక వెబ్‌సైట్‌<<>>లో ఉంచింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ పరిధిలోనివి చెక్ చేసుకోండి.

News October 16, 2024

ప్రతి రోజు రూ.207కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం: మంత్రి సీతక్క

image

TG: గత తొమ్మిదిన్నరేళ్లలో BRS ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని మంత్రి సీతక్క అన్నారు. రోజుకు రూ.207కోట్ల వడ్డీలే చెల్లించాల్సి వస్తోందని, నెలకు సగటున రూ.6వేల కోట్ల వడ్డీలకే సరిపోతోందన్నారు. రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పులు ఏమైనట్లు అని KTR చేసిన ట్వీట్‌పై మంత్రి ఇలా స్పందించారు.

News October 16, 2024

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

image

రబీ సీజన్ త్వరలో ప్రారంభమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 రబీ మార్కెటింగ్ సీజన్‌లో ఆరు పంటలకు MSPని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమల ధరను రూ. 2275 నుంచి రూ. 2425, బార్లీ ధర రూ. 1850 నుంచి రూ.1980, పప్పు రూ.6425 నుంచి రూ.6700, ఆవాలు – రూ. 5650 నుంచి రూ.5950, శనగ రూ. 5440 నుంచి రూ. 5650, కుసుమలు రూ.5800 నుంచి రూ.5940కు పెంచింది.

News October 16, 2024

సిద్దరామయ్య చెప్పడంతోనే రిజైన్ చేశా: MUDA చీఫ్

image

కర్ణాటక సీఎం సిద్దరామయ్య చెప్పడంతోనే ముడాకు రిజైన్ చేశానని చీఫ్ ఎంకే మారిగౌడ స్పష్టం చేశారు. ‘UDD సెక్రటరీకి రిజిగ్నేషన్ ఇచ్చేశాను. సీఎం రిజైన్ చేయమని ఆదేశించారు. అందుకే చేశాను. ఆరోగ్యం బాగాలేకపోవడం మరో కారణం. ముడాపై దర్యాప్తు జరగనివ్వండి. ఆ తర్వాత అసలు నిజం తెలుస్తుంది. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఈ అంశంలో సీఎం నాపై ఒత్తిడి చేయలేదు’ అని ఆయన అన్నారు. సిద్దరామయ్యకు మారిగౌడ అత్యంత సన్నిహితుడు.

News October 16, 2024

ఐఏఎస్‌లకు హైకోర్టు షాక్

image

క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లకు షాక్ తగిలింది. ఇలాంటి వ్యవహారంలో తాము జోక్యం చేసుకుంటే ముగింపు ఉండదని జడ్జి వ్యాఖ్యానించారు. ముందుగా వెళ్లి ఏపీలో రిపోర్ట్ చేయాలని ఐఏఎస్‌లను ఆదేశించారు. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ తీర్పునివ్వడంతో ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, కరుణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

News October 16, 2024

MI బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే

image

ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే నియమితులయ్యారు. MI హెడ్ కోచ్ జయవర్దనే నేతృత్వంలో మలింగతో పాటు ఈయన బౌలింగ్ బాధ్యతలు చూసుకుంటారు. ముంబైకి చెందిన ఈ మాజీ పేస్ బౌలర్ 2024 టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమ్‌ ఇండియా కోచింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఈయన భారత్ తరఫున 2 టెస్టులు, 3 వన్డేలు ఆడారు.

News October 16, 2024

48 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్

image

బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా దానిని ఢిల్లీకి మళ్లించారు. గత 48 గంటల్లో ఇలా నకిలీ బెదిరింపు కాల్స్ రావడం ఇది 11వ సారి. మంగళవారం 8, సోమవారం 2 వచ్చాయి. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, DGCA అధికారులు వేర్వేరుగా సమావేశమయ్యారు. డార్క్‌వెబ్ ద్వారా ఈ కాల్స్ వస్తున్నాయని, కొందరు దోషుల్ని గుర్తించారని తెలిసింది.

News October 16, 2024

అన్నక్యాంటీన్ల రంగులపై హైకోర్టులో విచారణ

image

AP: అన్నక్యాంటీన్లకు TDP రంగులు వేస్తున్నారని దాఖలైన పిటిషన్‌‌‌పై హైకోర్టు విచారించింది. గతంలో సచివాలయాలకు బ్లూ కలర్ వేయడంతో వాటిని తొలగించాలని ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకి తెలిపారు. రంగులు తొలగించడానికి సమయం పట్టడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం దాఖలైందన్నారు. గతంలో క్యాంటీన్లకు ఏ కలర్ వేశారని కోర్టు ప్రశ్నించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, విచారణను 6వారాలకు వాయిదా వేసింది.

News October 16, 2024

INDvsNZ: తొలి టెస్టు తొలిరోజు ఆట రద్దు

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టులో తొలిరోజు ఆట రద్దయింది. అక్కడ భారీ వర్షం కురుస్తుండడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. వర్షం మళ్లీ రాకపోతే రేపు ఉ.8.45కి టాస్ వేసి 9.15గంటలకు మ్యాచ్ ప్రారంభిస్తారు.

News October 16, 2024

‘మేడిన్ ఇండియా’ బుల్లెట్ ట్రైన్ నిర్మించేది ఇక్కడే

image

‘మేడిన్ ఇండియా’ తొలి బుల్లెట్ ట్రైన్లను రూపొందించే అవకాశం బెంగళూరులోని BEMLకు దక్కింది. డిజైనింగ్, తయారీ, 2 హైస్పీడ్ ట్రైన్ సెట్స్ కోసం కంపెనీకి ICF రూ.867 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో కోచ్ ధర రూ.27.86 కోట్లు. ‘భారత హైస్పీడ్ రైల్ జర్నీలో ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయి. 280 KMPH స్పీడ్‌తో ట్రైన్ సెట్లను దేశీయంగా డిజైన్ చేయబోతున్నాం’ అని BEML తెలిపింది. 2026 ఆఖర్లో వీటిని డెలివరీ చేస్తుందని సమాచారం.