India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మ్యూజికల్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 19న కన్సర్ట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ షోకు రావాలని ఆహ్వానించేందుకు డీఎస్పీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నిర్మాత బండ్ల గణేశ్తో కలిసి సీఎం, డిప్యూటీ సీఎం భట్టిలను ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్కు ఆయన గిటార్ను బహుమతిగా అందించారు. కాగా, HYDలో ఈ కన్సర్ట్ స్టార్ట్ చేసి దేశంలోని పలుచోట్ల నిర్వహించనున్నారు.
బెంగళూరు స్టేడియంలో వర్షం తగ్గుముఖం పట్టింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఇవాళ ఉదయం కాస్త తగ్గింది. అంతలోనే మళ్లీ మొదలైంది. దీంతో భారత్-కివీస్ తొలి టెస్ట్కు టాస్ కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు వాన తగ్గగా ఔట్ఫీల్డ్ను ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. మరోసారి వర్షం కురవకపోతే ఆట ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కానీ బెంగళూరులో వాతావరణం ఇంకా వాన పడే విధంగానే ఉంది.
AP: ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షల ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. పేపర్ 1A, 1B ఆన్సర్ ‘కీ’తో పాటు క్వశ్చన్ పేపర్లు https://aptet.apcfss.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ‘కీ’పై అభ్యంతరాలను ఈనెల 18వ తేదీలోపు టెట్ <
ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదంపై పోరాటమే SCO ప్రాథమిక లక్ష్యమని EAM జైశంకర్ ఇస్లామాబాద్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది మరింత కీలకమన్నారు. SCOకు నిజాయితీ సంభాషణలు, నమ్మకం, పొరుగువారితో స్నేహం, ఛార్టర్కు కట్టుబడి ఉండటం అవసరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, సప్లై చైన్ అవాంతరాలు వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలకు అప్పులు ఆందోళనకరంగా మారాయని వెల్లడించారు.
TG: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500(ఏడాదికి ఎకరాకు రూ.15వేలు) ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.
TG: హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహానగర భవిష్యత్తు కోసమే దీనిని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, త్వరలోనే రూ.13 వేల కోట్లు చేస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ సినిమాకు ఇప్పటికే రూ.264.31 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రం కోసం రజినీ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిపాయి. ఆయన ఏకంగా రూ.125 కోట్లు ఛార్జ్ చేశారట. జడ్జిగా నటించిన అమితాబ్ రూ.7 కోట్లు, రజినీ భార్యగా నటించిన మంజూ వారియర్ రూ.2-3 కోట్లు, ఫహాద్ ఫాజిల్ రూ.2-4 కోట్లు, రానా రూ.5 కోట్లు ఛార్జ్ చేశారని తెలిపాయి.
AP: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రేపు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ సీఎంగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో JKPCC చీఫ్ తారిక్ హమీద్ కర్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతానికి J&K ప్రభుత్వ మంత్రివర్గంలో చేరట్లేదని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలనే డిమాండ్కు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దీని కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని ఇదే హామీని ఇచ్చారని గుర్తు చేశారు.
తొలి టెస్టులో సత్తాచాటేందుకు నెట్స్లో ప్రాక్టీస్ చేసిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ వర్షం పడుతుండటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణిస్తే న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తానన్నట్లు ఆయన ఎదురుచూస్తున్న ఫొటో వైరలవుతోంది. వర్షంలోనూ తన కిట్తో గ్రౌండ్లో తిరుగుతూ కనిపించారు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ మొదలుకావాల్సి ఉండగా వర్షం కారణంగా ఇంకా టాస్ కూడా పడలేదు.
Sorry, no posts matched your criteria.