News October 16, 2024

మగ బిడ్డకు జన్మనిచ్చిన రేణుకాస్వామి భార్య

image

కన్నడ హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా రేణుకాస్వామి భార్య సహన మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉందని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. హీరోయిన్ పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపారని రేణుకాస్వామిని దర్శన్ అనుచరులు చిత్రహింసలకు గురిచేసి చంపారనే ఆరోపణలు దక్షిణాదిలో సంచలనం సృష్టించాయి. కాగా రేణుకా స్వామి మరణించిన సమయంలో సహన 5 నెలల గర్భిణి.

News October 16, 2024

ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

image

దాదాపు రెండేళ్లుగా ఇద్దరు స్టార్లు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఎట్టకేలకు వీరి సినిమాలు రిలీజ్ కానుండటంతో అభిమానుల్లో ఆత్రుత నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ (JAN 10), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో ‘పుష్ప-2’ (DEC 6) సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాల నుంచి సాంగ్స్, టీజర్స్ విడుదలయ్యాయి. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.

News October 16, 2024

సింగిల్ టేక్‌లో 11 నిమిషాల సీన్: వరుణ్ ధవన్

image

వరుణ్ ధవన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ‘సిటాడెల్’. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని 11 నిమిషాల పాటు సింగిల్ టేక్‌లో చేసినట్లు వరుణ్ వెల్లడించారు. ఇది సిరీస్ క్లైమాక్స్‌లో రానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇది నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో అందుబాటులో ఉండనుంది.

News October 16, 2024

ఐఏఎస్‌ల పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ

image

TG: క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్‌లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.30గంటలకు వాదనలు విననుంది. ఏపీకి వెళ్లాలంటూ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్‌ను క్యాట్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

News October 16, 2024

బియ్యాన్ని నానబెట్టి వండితే..

image

బియ్యాన్ని నానబెట్టి వండితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
*జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
*బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.
**ఎక్కువ సేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని చెబుతున్నారు.

News October 16, 2024

పుట్టకముందే విమానం పేల్చేసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్!

image

కెనడా ఓ సంచలన విషయం బయటపెట్టిందండోయ్! 39 ఏళ్ల క్రితం అంటే 1985లో AI విమానం 182ను అటాక్ చేసింది 31 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ అని తేల్చేసింది. ‘పుట్టడానికి ఎనిమిదేళ్ల ముందే మేజర్ టెర్రర్ అటాక్ చేశాడంటే ఎనిమిదేళ్ల వయసులో ఏం చేయగలడో ఊహించుకోవచ్చు’ అని ట్రూడో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు స్టేట్‌మెంట్ ఇచ్చారు. 9/11 సహా ప్రపంచంలో జరిగిన ప్రతి దాడికీ అతడి కనెక్షన్ ఉందేమోనని USకు చెప్తానని ట్రూడో అన్నారు.

News October 16, 2024

‘విశ్వంభర’కు వినాయక్ సాయం!

image

దర్శకుడు వి.వి.వినాయక్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’కు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ విషయంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా చిరంజీవి, వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఠాగూర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

News October 16, 2024

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

image

TG: ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జడ్జి అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14కు వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో రేవంత్‌ను ఈడీ ఏ1 నిందితుడిగా పేర్కొంది. ఆయన రూ.50 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంది.

News October 16, 2024

రేణిగుంట విమానాశ్రయంలో వరద.. విమానం చెన్నైకి మళ్లింపు

image

AP: హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వెళ్తున్న విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. తిరుపతి జిల్లాలో భారీ వర్షాలతో రేణిగుంట విమానాశ్రయం రన్‌వే పైకి నీళ్లు చేరాయి. ల్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఆ విమానాన్ని చెన్నైకి మళ్లించారు.

News October 16, 2024

విజయం కోసం పేర్లు మార్చుకోవాల్సిందేనా?

image

సినీ ప్రముఖులు సైతం న్యూమరాలజీని ఫాలో అవుతుంటారు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవడం, స్టార్‌గా గుర్తింపు రాకపోవడం తదితర కారణాలతో పేర్లలో మార్పులు, చేర్పులు చేసుకున్న నటీనటులున్నారు. ఇటీవలే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్న విషయం తెలిసిందే. గతంలోనూ లక్ష్మీ రాయ్ – రాయ్ లక్ష్మీగా, కిచ్చా సుదీప్ – సుదీపగా, Sundeep Kishan – Sundeep Kishnగా పేరు మార్చుకున్నారు.