News April 10, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 10, బుధవారం
చైత్రము
శు.విదియ: సాయంత్రం: 5:32 గంటలకు
భరణి: తెల్లవారుజామున 3:05 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11:43 నుంచి మధ్యాహ్నం 12:33 గంటల వరకు
వర్జ్యం: అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజామున 2:57 వరకు
తిరిగి మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 3:22 వరకు

News April 10, 2024

TODAY HEADLINES

image

* తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలు
* AP: వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తాం: చంద్రబాబు
* AP: పిఠాపురం నుంచే విజయకేతనం: పవన్ కళ్యాణ్
* AP: చంద్రబాబు, పవన్, మోదీలకు థ్యాంక్స్: YSRCP
* TG: కవిత రిమాండ్ ఈ నెల 23 వరకు పొడిగింపు
* TG: రేవంత్‌కు కాంగ్రెస్ నుంచే ప్రమాదం: కిషన్‌రెడ్డి
* TG: BRS మీటింగ్‌లో పాల్గొన్న ఉద్యోగుల సస్పెండ్
* సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
* IPLలో పంజాబ్‌పై SRH విజయం

News April 10, 2024

నీరు, కార్బన్‌డైఆక్సైడ్‌తో ఇంధనం!

image

పర్యావరణ హితమని EVల హవా కొనసాగుతున్న వేళ USలో ఇన్ఫీనియమ్ సంస్థ విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. నీరు, కార్బన్‌డైఆక్సైడ్‌ (CO2)తో ఇంధనాన్ని తయారు చేస్తోంది. ఎలక్ట్రోలైజర్స్‌తో నీటి నుంచి హైడ్రోజన్‌‌ను వేరు చేస్తారు. రియాక్టర్‌లో హైడ్రోజన్‌‌, CO2 మధ్య రియాక్షన్ జరిగి ఇంధనం తయారవుతుంది. రోజుకు 8,300 లీటర్ల ఇంధనం ఉత్పత్తి అవుతోందట. 2030కి ఈ ఇంధన మార్కెట్ $50బిలియన్లకు చేరొచ్చని అంచనా.

News April 9, 2024

భారత్‌లో ఈద్ ఎప్పుడు చేసుకోవాలంటే..

image

భారత్‌లో మంగళవారం చంద్రుడు కనిపించని నేపథ్యంలో గురువారం ఈద్ జరుపుకోవాలని ఢిల్లీలోని ఫతేపురి మస్జిద్ ఇమామ్ ముఫ్తీ ముకర్రం అహ్మద్ తెలిపారు. యూపీ, ఎంపీ, బెంగాల్, తెలంగాణ, బిహార్‌లో కనుక్కున్నామని, ఎక్కడా చంద్రుడు కనిపించలేదని ఆయన వివరించారు. లక్నోలోని మర్కాజీ చాంద్ కమిటీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే కేరళ, జమ్మూకశ్మీర్‌లో మాత్రం రేపు చేసుకుంటున్నట్లు మత పెద్దలు తెలిపారు.

News April 9, 2024

BREAKING: ఉత్కంఠ పోరులో SRH విజయం

image

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 రన్స్ తేడాతో గెలిచింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 180/6 స్కోరుకు పరిమితమైంది. PBKS బ్యాటర్లు శశాంక్ 46*, అశుతోశ్ 33* చివర్లో వరుసగా బౌండరీలు బాదడంతో ఓ దశలో పంజాబ్ గెలిచేటట్లే కనిపించింది. SRH బౌలర్లలో భువనేశ్వర్ 2, నటరాజన్, ఉనాద్కత్, కమిన్స్, నితీశ్ తలో వికెట్ పడగొట్టారు.

News April 9, 2024

అక్కడ మ్యూజిక్ స్పీడ్ పెరిగినా, తగ్గినా ఆర్టిస్టులకు బ్యాండే!

image

‘మరీ హై కాకుండా, మరీ లోగా కాకుండా మీడియంగా కొట్టరా’.. ఓ సినిమాలోని ఈ డైలాగ్‌ను రష్యన్ రిపబ్లిక్‌ ఆఫ్ చచ్‌న్యా సీరియస్‌గా తీసుకుందేమో! నిమిషానికి 80-116 బీట్లు ఉన్న టెంపోలనే పరిగణిస్తామని మ్యూజిక్‌పై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. అంతకంటే స్లో లేదా స్పీడ్‌ ఉన్న మ్యూజిక్‌ను నిషేధిస్తూ, రీరైట్ చేసుకోవడానికి ఆర్టిస్టులకు JUN 1 వరకు గడువు ఇచ్చింది. చచ్‌న్యా సంస్కృతిని కాపాడేందుకే ఇలా చేసిందట.

News April 9, 2024

ఈ ఎలక్ట్రిక్ బైక్‌కు 8లక్షల కిలోమీటర్ల వారంటీ!

image

బెంగళూరుకు చెందిన అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ తమ ఈ-బైక్స్‌కు వారంటీ స్కీమ్ తేవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. F77 మోడల్‌కు UV కేర్ మ్యాక్స్ ప్యాకేజీ కింద 8లక్షల KM/ 8ఏళ్ల వారంటీని ప్రకటించింది. UV కేర్ (60వేల KM), UV కేర్+ (లక్ష KM) ప్యాకేజీలూ ఉన్నాయి. గతంలోనూ ఈ స్కీమ్స్ ఉన్నా తాజాగా వాటి రేంజ్ పెంచింది. భారత్‌లో దొరికే బ్యాటరీల్లో నాణ్యత లోపించడంతో ఈ స్కీమ్ తెచ్చినట్లు సంస్థ తెలిపింది.

News April 9, 2024

బందీల్లో 40మంది చనిపోయారు: హమాస్

image

హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిలో 40మంది చనిపోయినట్లు తెలుస్తోంది. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్, ఖతర్, ఈజిప్టు నిఘా సంస్థల అధినేతలతో అమెరికా నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్ బిల్‌బర్స్ ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ఇజ్రాయెల్ బందీల మరణం గురించి హమాస్ సమాచారం ఇచ్చిందని ఆంగ్ల మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మొత్తంగా ఎంతమంది బందీలు చనిపోయారన్నదానిపై స్పష్టత లేదని వెల్లడించాయి.

News April 9, 2024

పాలకొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ

image

AP: పాలకొండ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎస్టీ నియోజకవర్గమైన ఇక్కడి నుంచి టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా పోటీపడటంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వేలు జరిగాయి. ఈ సర్వేలో జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు లభించడంతో పవన్ ఆయనను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

News April 9, 2024

పరీక్షలపై కీలక ప్రకటన

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు వేసిన అభ్యర్థుల చేతి వేలికి సిరా ఉంటే ప్రవేశ పరీక్షలకు అనుమతించరనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దు. ఇదంతా తప్పుడు ప్రచారం. నిరాధారం. NTA అలాంటి నిబంధనలు/మార్గదర్శకాలు విడుదల చేయలేదు. యువత పుకార్లు నమ్మకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి రాబోయే పరీక్షలకు సన్నద్ధం కావాలి’ అని సూచించింది.