India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తోతాపురి మామిడి విక్రయించిన రైతులకు ప్రభుత్వం నగదు విడుదల చేసింది. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల సబ్సిడీని జమ చేసింది. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకూ ఎక్స్గ్రేషియా నిధులు రిలీజ్ చేసింది. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 19 జిల్లాల్లో 106 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5.30కోట్లు జమ చేసింది.
* రోజూ అగ్రికల్చర్ వార్తల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి..

పూజ సమయంలో పూలు లేకపోతే చాలామంది వాటి బదులు అక్షింతలు కలిపి పూజ చేస్తుంటారు. అయితే పూలను అక్షింతలతో కలిపి పూజించవద్దని పండితులు చెబుతున్నారు. దీనివల్ల విఘ్నాలు వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఇంట్లో ఒకటి, రెండు పూలు మాత్రమే ఉంటే.. వాటిని ముందు దేవుడి పాదాల వద్ద ఉంచి, ఆ తర్వాత అక్షింతలను సమర్పించాలి. పూలు లేనప్పుడు కేవలం అక్షింతలతో పూజ చేసినా శుభ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. <<-se>>#POOJA<<>>

నాబార్డ్ 6 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ( BCA, IT), ME, M.TECH, MCA, MBA, CA, PGDM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. వెబ్సైట్: https://www.nabard.org/

మనం కూరల్లో ఎక్కువగా వాడే టమాటాతో అనేక సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చర్మ సంరక్షణలో టమాటా ఎలా వాడాలంటే.. * టమాటా గుజ్జు తీసి దానిలో కాస్త కీరా రసం కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. * రెండు చెంచాల పెరుగులో టమాటా రసం, బాదం పేస్ట్ కలిపి ముఖానికి రాయడం వల్ల నిర్జీవంగా ఉన్న చర్మం తాజాగా మారుతుంది. <<-se>>#skincare<<>>

PM కిసాన్ నిధులు పక్కదారి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకరికే నిధులు అందాలి. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం భార్యాభర్తలు ఇద్దరికీ, భూమి పూర్వపు యజమానికి కూడా నిధులు జమవుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. మొత్తం 31 లక్షల కేసులను గుర్తించగా రాష్ట్రాలు 19.02 లక్షల కేసులను పరిశీలించాయి. వాటిలో 17.87 లక్షల మంది దంపతులు ఇద్దరూ నిధులు పొందుతున్నట్లు తేలింది.

AP: విశాఖలో ఏర్పాటు కానున్న 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం నేడు కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. రూ.88,628CR(10 బి.డాలర్ల)తో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో MOU కుదరనుంది. ఢిల్లీలో 10AMకు CM చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, మంత్రి లోకేశ్ సమక్షంలో MOUపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ప్రభుత్వం చెబుతోంది.

తిరుమల కొండతో పాటు, స్వామి పుష్కరిణిని కూడా గరుత్మంతుడు వైకుంఠం నుంచి భూమిపైకి తెచ్చాడు. ఇది శ్రీదేవి, భూదేవిలకు ప్రియమైనది. దీన్ని సర్వతీర్థాలకు జన్మస్థానంగానూ భావిస్తారు. విరజా నదిలా సకల పాపాలను పోగొట్టే శక్తి దీనికి ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఐహిక ఫలాలన్నీ లభిస్తాయి. ఈ పుష్కరిణిని దర్శించడం, స్మరించడం, సేవించడం వలన సమస్త శుభాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 4 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDBM, PGDM, BSC, MSC(అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్కు నెలకు ₹90వేల నుంచి ₹2.40లక్షలు, సీనియర్ మేనేజర్కు ₹80వేల నుంచి ₹2.20లక్షలు జీతం అందుతుంది. వెబ్సైట్: https://www.nationalfertilizers.com/

AP: కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఇవాళ ఏలూరు, కృష్ణా, NTR, పల్నాడు, GNT జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరో 4 రోజులు కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది.

ఎవరికైనా ఫ్రెండ్స్ అంటే చాలామందే ఉంటారు. కానీ, బెస్ట్ ఫ్రెండ్ అనగానే ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు. మీరు నవ్వితే వాళ్లు నవ్వుతారు, మీరు ఏడిస్తే ఓదారుస్తారు, మీరు గెలిస్తే వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు, మీకు కష్టమొస్తే వాళ్లు అడ్డంగా నిలబడిపోతారు. ఎవరి లైఫ్లోనైనా అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు. మీ జీవితంలో గెలిచారని చెప్పొచ్చు. మరి అలాంటి ట్రూ ఫ్రెండ్ మీ లైఫ్లోనూ ఉన్నారా? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.