India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీబీ, ఆస్తమా, గ్లాకోమా, తలసేమియా, మెంటల్ హెల్త్కు సంబంధించిన మెడిసిన్ ధరలను 50 శాతం పెంచేందుకు ఎన్పీపీఏ ఆమోదం తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయనే ఫార్మాస్యూటికల్ కంపెనీల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది. బెంజిపెన్సిలిన్, ఆట్రోపైన్, స్ట్రెప్టోమైసిన్, సాల్బుటమాల్, పిలోకార్పైన్, సెఫడ్రాక్సిల్, డెస్ఫెర్రొగ్జామైన్, లిథియం మందులు ఈ జాబితాలో ఉన్నాయి.
AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వాయువ్య దిశగా 12KM వేగంతో కదులుతున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. చెన్నైకి 360KM, పుదుచ్చేరికి 390KM, నెల్లూరుకు 450KM దూరంలో ఉన్నట్లు పేర్కొంది. ఇది రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
న్యూజిలాండ్, భారత్ మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం కారణంగా టాస్ వాయిదా పడింది. కాసేపటి క్రితమే వాన ఆగిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ వర్షం మొదలైతే తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. కాగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో బెంగళూరులో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
పెళ్లిళ్ల సీజన్ వేళ వినియోగదారులకు పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్ రూ.78వేలకు చేరువైంది. నిన్న, మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.490 పెరిగి రూ.77,890కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.450 పెరిగి రూ.71,400గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ రూ.100 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,800గా ఉంది.
ఆసియా మార్కెట్ల నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ రావడం, కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో దేశీయ బెంచ్మార్క్ సూచీలు నేడు ఫ్లాట్గా మొదలయ్యాయి. నిఫ్టీ 25,067 (10), సెన్సెక్స్ 81,834 (13) వద్ద ట్రేడవుతున్నాయి. NSEలో 73 స్టాక్స్ 52WEEK గరిష్ఠాన్ని తాకాయి. HDFC లైఫ్, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, SBI లైఫ్, HDFC బ్యాంక్ టాప్ గెయినర్స్. M&M, నెస్లే, ట్రెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐచర్ మోటార్స్ టాప్ లూజర్స్.
AP: అతిభారీ వర్షాలతో తాజాగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు నేడు సెలవు ప్రకటించారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లాక హాలిడే ప్రకటించడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వర్షాల ప్రభావంతో అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో స్కూళ్లు బంద్ అయ్యాయి. సెలవు ప్రకటించినా ATPలో పలు కాలేజీలు యథావిధిగా నడుస్తున్నాయి.
తమ దేశంలో ఖలిస్థానీ నేతలపై దాడులకు వ్యూహరచన చేసింది సీనియర్ RAW అధికారి, హోంమంత్రి అమిత్ షా అని కెనడా అధికారులు NSA అజిత్ దోవల్కు సమాచారం ఇచ్చినట్టు వాషింగ్టన్ పోస్టు ఓ కథనం ప్రచురించింది. ‘భారత్లో ఓ సీనియర్ లీడర్, ఓ సీనియర్ RAW అధికారి’ అని కెనడా అధికారులు రిఫరెన్స్ ఇచ్చారని పేర్కొంది. ఆ సీనియర్ లీడర్ అమిత్ షానే అని వారు గుర్తించినట్టు తెలిపింది. Indian Govt దీనిపై తమకు వివరణ ఇవ్వలేదంది.
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గతంలో స్వయంగా రాసిన లేఖను హర్ష్ గోయెంకా షేర్ చేశారు. రతన్ హ్యాండ్ రైటింగ్ ఎంతో బ్యూటిఫుల్గా ఉందని ఆయన పేర్కొన్నారు. 1996లో రతన్ టాటా మాజీ ప్రధాని పీవీ నరసింహారావును ఉద్దేశించి లేఖ రాశారు. ఇందులో భారత్లో పీవీ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను కొనియాడారు. ప్రతి భారతీయుడు ఆయనకు కృతజ్ఞతతో రుణపడి ఉండాలంటూ పీవీ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
దౌత్య వివాదంలో కెనడాకే అమెరికా మద్దతిచ్చింది. అది చేసిన ఆరోపణలు అత్యంత సీరియస్ అని, వాటిని భారత్ ఇంకా సీరియస్గా తీసుకొని దర్యాప్తునకు సహకరించాలని నీతులు చెప్పింది. తాము ఒకటి అనుకుంటే భారత్ ప్రత్యామ్నాయ దారి ఎంచుకుందని US DEPT అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పారు. రెండు దేశాల పరస్పర ఆరోపణలపై తానేమీ చెప్పలేనన్నారు. ఆరోపణలపై తాజా స్టేటస్ అడగ్గా దీనిపై ఆ రెండు దేశాలే స్పందించాల్సి ఉందన్నారు.
TG: రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పులు చేసినట్లు KTR ఆరోపించారు. ‘అప్పు తప్పు అన్నోళ్లని ఇప్పుడు దేనితో కొట్టాలి? ఎన్నికల హామీలేవీ తీర్చలేదు. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? ఎవరి జేబులోకి వెళ్లినట్టు? కమీషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా? BRS హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.