India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మే నెల చివర్లో దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వివిధ రాష్ట్రాల నుంచి నిష్క్రమిస్తున్నాయి. 2 రోజుల్లో రాష్ట్రం నుంచి కూడా వెళ్లిపోయే ఆస్కారం ఉండగా.. 3, 4 రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ కానున్నాయి. ఈ క్రమంలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఆస్కారముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ప్రకాశం, ఏలూరు, ప.గో. తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

వరిని ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట వస్తుంది. అయితే చైనాలోని ‘యున్నన్ అకాడమీ’ ఆరుసార్లు కోతకు వచ్చే వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. దీనికి ‘పెరెన్నియల్ రైస్- Pr23’ అని పేరు పెట్టింది. దీన్ని ఓసారి నాటితే మూడేళ్లలో వరుసగా 6 సీజన్లపాటు దిగుబడిని తీసుకోవచ్చు. దీన్ని 17 దేశాలు సహా తమిళనాడు, ఒడిశాలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

దేశంలో ఒకే టీచర్తో నడిచే గవర్నమెంట్ స్కూళ్లున్న రాష్ట్రాల్లో AP టాప్లో ఉంది. 2024-25 అకడమిక్ ఇయర్లో APలో 12,912, UP-9,508, జార్ఖండ్-91,72, MH-8,152, KA-7,349, TG-5,001(11వ స్థానం) స్కూళ్లలో ఒకే టీచరున్నారు. దేశంలో ఇలాంటివి 1,04,125 స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో 33 లక్షల స్టూడెంట్స్ ఉన్నారు. విద్యార్థులు చేరని స్కూళ్ల టీచర్లను వీటిలోకి పంపేందుకు రేషనలైజేషన్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

1. రామాయణంలో అతిపెద్ద కాండము ఏది?
2. మహాభారతం రాయడానికి వ్యాసుడికి ఎంత కాలం పట్టింది?
3. విశాలాక్షుడు అని ఎవర్ని అంటారు?
4. ‘పితృ పక్షం’ అనేది ప్రధానంగా ఏ రెండు పండుగల మధ్య వస్తుంది?
5. భౌమ వారం అంటే ఏ వారం?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

ఇండియన్ బ్యాంక్లో వివిధ విభాగాల్లో 171 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి CA/CWA/ICWA, పీజీ, బీఈ/బీటెక్, ఎంసీఏ/ఎమ్మెస్సీ, డిగ్రీ, MBA, PGDBA, PGDBMతోపాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 23-36 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://indianbank.bank.in/

TG: హెలీ టూరిజానికి రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్లోని రామప్ప, లక్నవరానికీ విస్తరించాలని యోచిస్తోంది. ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్సైట్ తీసుకురానుంది.

చైనా PR-23 వరిని ఒక్కసారే నాటి మూడేళ్లలో 6 పంటలను కోసే అవకాశం ఉండటంతో సాగు ఖర్చు 29% తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. పంట 119 రోజుల్లోనే కోతకు వస్తుంది. తొలి కోతలో హెక్టారుకు 6.8-7.5 టన్నులు, తర్వాత కోతల్లో 5.4-6.3 టన్నుల దిగుబడి వస్తోంది. భారత్లో సగటు వరి దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులే. ఆసియా, ఆఫ్రికాలోని 17 దేశాల్లో విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో కూడా PR-23 వంగడం మెరుగైన దిగుబడినిస్తోంది.

తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో కమాండో ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని CRPF ప్లాన్ చేస్తోంది. ఇందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించేందుకు సర్వే జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ఆపరేషన్ తర్వాత అక్కడ IEDs, బాంబులను నిర్వీర్యం చేసేందుకు ఎక్సర్సైజ్ చేపట్టాం. ఆ పని పూర్తికావచ్చింది. శాశ్వత స్థావరం ఏర్పాటు కోసం లాజిస్టిక్స్, ఇన్ఫ్రా అంశాలను పరిశీలిస్తున్నాం’ అని చెప్పాయి.

ఈ ఏడాది నోబెల్ పీస్ ప్రైజ్ వెనిజులా అపోజిషన్ లీడర్ మరియా కొరినా మచాడోకు దక్కిన విషయం తెలిసిందే. ఆమె పేరు ముందే లీకైనట్లు కమిటీ అనుమానిస్తోంది. నోబెల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు మరియా గెలుస్తారని బెట్టింగ్ ప్లాట్ఫామ్లో 3.75% ఉన్న అంచనా 73%కి పెరిగిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గూఢచర్యం జరిగి ఉండవచ్చని నోబెల్ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ హార్ప్వికెన్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

* బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
* జూబ్లీహిల్స్ బై పోల్కు నేడు నోటిఫికేషన్
* బూత్లకు రాలేకపోయిన చిన్నారులకు ఇవాళ, రేపు ఇంటింటికి వెళ్లి పోలియో డ్రాప్స్ వేయనున్న వైద్య సిబ్బంది
* 2,620 మద్యం దుకాణాలకు 5,663 దరఖాస్తులు.. ఈ నెల 18తో ముగియనున్న గడువు
* గ్రూప్-1 అధికారులుగా నియమితులైన వారిలో 131 మందిని 26 జిల్లాలకు ఎంపీడీవోలుగా నియామకం
Sorry, no posts matched your criteria.