India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమ్మూకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు శ్రీనగర్లోని ఎస్కేఐసీసీలో ఆయనతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇతర కూటమి సభ్యులు హాజరుకానున్నారు. మరోవైపు హరియాణా సీఎం అభ్యర్థిని బీజేపీ నేడో రేపో ప్రకటించే అవకాశం ఉంది.
TG: సికింద్రాబాద్లో ముత్యాలమ్మ <<14352353>>విగ్రహాన్ని<<>> దుండగులు ధ్వంసం చేయడం ఆందోళన కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇది దుర్మార్గమని, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతం వారైనా సామూహికంగా కాపాడుకోవాలన్నారు. గత ఐదేళ్లలో ఏపీలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వాటిని నిలువరించేందుకు కఠిన చర్యలు అవసరమని చెప్పారు.
TG: ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత ఐవీఎఫ్ సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన మెడిసిన్, పరికరాలను కొనుగోలు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సమస్య తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో మాత్రమే IVF సేవలు ఉండగా, ఇకపై జిల్లాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.
TG: అవిభక్త కవలలు వీణా-వాణి 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్లోని శిశువిహార్లో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. కాగా 2006లో వీరిద్దరినీ వేరు చేసేందుకు ముంబైలోని బ్రీచ్ కండి ఆస్పత్రి వైద్యులు ప్రయత్నించినా కుదర్లేదు. ఆ తర్వాత వివిధ దేశాలకు చెందిన స్పెషలిస్టులు వచ్చినా వారిని విడదీయలేక చేతులెత్తేశారు. వయసు పెరుగుతుండటంతో రోజురోజుకు నరకయాతన అనుభవిస్తున్నారు.
AP: పోలవరం మెయిన్ డ్యాం పనులకు కేంద్రం రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా చెల్లించడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు కంపెనీలు మేఘా, బావర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వారంలోగా డయాఫ్రం వాల్, 14 రోజుల్లోగా ECRF డ్యాం డిజైన్లను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను నవంబర్ 1న ప్రారంభించి 2025 నవంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి హర్మన్ప్రీత్ కౌర్ను తప్పించాలని BCCI యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్తో బీసీసీఐ సమావేశం కానుందని, అప్పుడే కెప్టెన్సీపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. స్వదేశంలో జరిగే వన్డే WC 2025ను దృష్టిలో ఉంచుకుని జట్టుకు కొత్త కెప్టెన్ను నియమిస్తారని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రభావం తెలంగాణపైనా కనిపిస్తోంది. నిన్నటి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా ముసురు మొదలైంది. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో మరో రెండు రోజుల వరకు తెలంగాణలోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
AP: రాష్ట్రంలో అతి భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని జిల్లాలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. YSR, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆయన కేంద్ర మంత్రులను కలుస్తారని సమాచారం. మరోవైపు ఏఐసీసీ నేతలతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశముంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్తో కలిసి ఆయన హస్తిన పర్యటనకు వెళ్లే ఛాన్సుంది. క్యాబినెట్ విస్తరణపై ఏఐసీసీ నేతలతో చర్చించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాము ఏపీకి వెళ్లబోమని IASలు వాణీప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ వేసిన పిటిషన్లపై <<14364444>>CAT<<>> తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘IASలు ఇళ్లలోనే కూర్చొని సేవ చేస్తామంటే కుదరదు. సరిహద్దుల్లో సమస్యలు వస్తే వెళ్లరా? విజయవాడలో భారీ వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి సేవ చేయాలని లేదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. CAT తీర్పుపై IASలు HCలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Sorry, no posts matched your criteria.