News April 9, 2024

విదేశాల్లో బిజినెస్‌కు ఓలా క్యాబ్స్ గుడ్‌బై

image

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తప్పుకోనున్నట్లు ఓలా క్యాబ్స్ ప్రకటించింది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ఓలా సేవలు ఈనెలాఖరుతో ముగియనున్నట్లు తెలిపింది. ‘ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తులో పర్సనల్ వెహికల్స్‌కే పరిమితం కాకుండా క్యాబ్ సేవలకూ విస్తరిస్తాయి. భారత్‌లో మార్కెట్ విస్తరణకు మాకు మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకే దీనిపై దృష్టిపెట్టాలని నిర్ణయించాం’ అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

News April 9, 2024

ఏపీ సీఎస్‌పై NHRCకి ఫిర్యాదు

image

AP CS జవహర్‌రెడ్డిపై కేంద్ర మానవ హక్కుల సంఘానికి NDA కూటమి ఫిర్యాదు చేసింది. పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో ఎన్నికల సంఘం ఆదేశాలను పక్కదారి పట్టించారని కూటమి నేతలు పేర్కొన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని కోరారు. వాలంటీర్లను పక్కనపెట్టి ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయాలన్న EC ఆదేశాలు పాటించకపోవడంతో 33 మంది మరణించారన్నారు. కదల్లేని వారినీ సచివాలయాలకు రావాలని YCP ప్రచారం చేసిందని వివరించారు.

News April 9, 2024

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయంది. నిన్న నిజామాబాద్‌లో వర్షాలు కురిశాయి.

News April 9, 2024

బీజేపీలో చేరితే కేసుల విచారణ ఆగిపోతుంది: కవిత

image

తప్పుడు ప్రచారంతో రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను దిగజార్చారని MLC కవిత లేఖలో పేర్కొన్నారు. తన మొబైల్ నంబర్‌ను మీడియాలో ప్రసారం చేసి ప్రైవసీకి భంగం కలిగించారన్నారు. ఇప్పటికే 4 సార్లు విచారణకు హాజరయ్యానని.. అన్ని విధాలుగా సహకరించారని తెలిపారు. BJPలో చేరితే కేసుల విచారణ ఆగిపోతుందన్నారు. పార్లమెంటులో విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోకపోతే EDని పంపుతామని BJP నేతలన్నారని తెలిపారు.

News April 9, 2024

పిఠాపురం నుంచే విజయకేతనం: పవన్ కళ్యాణ్

image

AP: ప్రజలంతా బాగుండాలని భగవంతుడిని కోరుకున్నట్లు ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ‘క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నాం. కొత్త ఏడాది ప్రజలకు మేలు చేయాలి. మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలి. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు రావాలి. రైతులకు మేలు జరగాలి’ అని ఆకాంక్షించారు.

News April 9, 2024

BRS మీటింగ్‌లో పాల్గొన్న 106 మంది ఉద్యోగుల సస్పెండ్

image

TG: ఎన్నికల కోడ్ ఉల్లంఘించి BRS మీటింగ్‌లో పాల్గొన్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్సన్ వేటు పడింది. వీరిలో 38 మంది సెర్ప్, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నెల 7న సిద్దిపేటలో ఉద్యోగులతో స్థానిక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ విషయం ఇటీవల బహిర్గతం కావడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.

News April 9, 2024

వావ్.. అద్భుతమైన ఫొటోలు

image

అత్యంత అరుదైన సంపూర్ణ సూర్య గ్రహణం నిన్న ప్రజలకు కనువిందు చేసింది. అమెరికా, మెక్సికో, కెనడా, యూకే, ఐర్లాండ్ దేశాల్లో దాదాపు 4 నిమిషాల 28 సెకన్ల పాటు కొనసాగింది. 50 ఏళ్లలో ఇదే అత్యంత సుదీర్ఘ గ్రహణం. ఈ అద్భుతమైన ఫొటోలను నాసా సహా అనేక స్పేస్ ఏజెన్సీలు చిత్రీకరించాయి. వాటిని మీరూ వీక్షించండి.

News April 9, 2024

KKR ప్లేయర్‌కు బ్యాట్ బహుకరించిన ధోనీ

image

నిన్నటి మ్యాచ్‌లో గెలిచిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ కోల్‌కతా ప్లేయర్లతో ముచ్చటించారు. ఈక్రమంలో ఆయన సంతకం చేసిన బ్యాట్‌ను తనకు బహుమతిగా ఇచ్చినట్లు KKR ప్లేయర్ రహ్మనుల్లా గుర్బాజ్ ట్వీట్ చేశారు. ‘గతం గురించి చింతించడం మానేయండి. భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేయండి. ఈ క్షణంలో జీవించి సంతోషంగా ఉండండి’ అని ధోనీ తనతో చెప్పినట్లు గుర్బాజ్ పేర్కొన్నారు.

News April 9, 2024

ఈనెల 25 తేదీలోగా ఇంటర్ ఫలితాలు?

image

TG: ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈనెల 25వ తేదీలోగా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికాగా, టెక్నికల్ అంశాలను ఇంటర్ బోర్డు పరిశీలిస్తోంది. మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, OMR షీట్ కోడ్ డీ కోడ్ చేయడం వంటి పనులకు ఇంకొన్ని రోజులు టైమ్ పట్టనుంది. ఈ ప్రక్రియను 21వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. 2, 3 రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీని ఖరారు చేస్తారని సమాచారం.

News April 9, 2024

రేవంత్‌కు కాంగ్రెస్ నుంచే ప్రమాదం: కిషన్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రమాదం పొంచి ఉందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోదీ ప్రభుత్వం ఏర్పడనుందని చెప్పారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.