News January 11, 2025

కారు రేసు నుంచి తప్పుకొన్న అజిత్

image

దుబాయ్‌లో జరిగే కార్ రేసులో పాల్గొనడం లేదని నటుడు అజిత్ ప్రకటించారు. ఇటీవల జరిగిన ప్రాక్టీస్ రేసులో ఆయన కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో కారు రేసు నుంచి తాను వైదొలగుతున్నట్లు తెలిపారు. తన టీమ్ పోటీలో కొనసాగుతుందని స్పష్టతనిచ్చారు.

News January 11, 2025

మెజారిటీ దాడులు రాజకీయ ప్రేరేపితమే: బంగ్లా పోలీసులు

image

బంగ్లాదేశ్‌లో మైనారిటీల‌పై పెరిగిన దాడులు మ‌త‌ప‌ర‌మైన‌వి కాదని, అవి రాజ‌కీయ ప్రేరేపిత దాడుల‌ని పోలీసుల నివేదిక స్ప‌ష్టం చేస్తోంది. షేక్ హ‌సీనా దేశం విడిచాక 1,769 దాడులు జ‌రిగాయి. అందులో 1,234 పొలిటిక‌ల్లీ మోటివేటెడ్ కాగా, మ‌రో 20 మాత్ర‌మే మ‌త ప్రేరేపిత దాడుల‌ని పోలీసులు చెబుతున్నారు. అందులో 161 ఘ‌ట‌న‌లు అవాస్త‌వ‌మ‌ని తేల్చారు. దాడుల‌పై 62 కేసులు న‌మోదు చేసిన పోలీసులు 35 మందిని అరెస్టు చేశారు.

News January 11, 2025

వామ్మో.. హైదరాబాద్‌లో 13,028 పాములా!

image

అటవీప్రాంతంలో కనిపించాల్సిన పాములు హైదరాబాద్‌లో భారీగా గుర్తించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (FOS) నగరంలో గతేడాది ఏకంగా 13,028 పాములను రక్షించింది. 2015లో 3,389 పాములను గుర్తిస్తే, పదేళ్లలో వీటి సంఖ్య 13,028కి చేరింది. ఇలా పదేళ్లలో 75వేలకు పైగా పాములను పట్టుకుంది. ఇందులో సగం కంటే ఎక్కువ కోబ్రాలే ఉండటం గమనార్హం.

News January 11, 2025

బాధితులకు రేపు పరిహారం: బీఆర్ నాయుడు

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలు, గాయపడ్డ బాధితులకు రేపటి నుంచి టీటీడీ పరిహారం అందించనుంది. టీటీడీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాశ్ రెడ్డి APలో.. మిగతా వారు తమిళనాడు, కేరళలో పర్యటించి పరిహారం అందిస్తారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.2లక్షలు ఇస్తారు.

News January 11, 2025

మా కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం: కేటీఆర్

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంపైన జరిగిన దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అది కాంగ్రెస్ గూండాల దాడి అని ఆరోపించారు. ‘మా పార్టీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండారాజ్యం నడుస్తోంది. ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. దాడికి పాల్పడిన గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని ట్విటర్లో డిమాండ్ చేశారు.

News January 11, 2025

ప్రముఖ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్

image

ప్రముఖ హిందీ నటుడు, కమెడియన్ టీకూ తల్సానియా(70) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు భార్య దీప్తి వెల్లడించారు. ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు గుండెపోటు అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. 1986లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టీకూ దాదాపు 200 చిత్రాలు, 11 సీరియళ్లలో కీలక పాత్రలు పోషించారు. ఆయన కూతురు శిఖ కూడా సత్యప్రేమ్ కీ కథ, వీర్ దీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించారు.

News January 11, 2025

వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం: రామానాయుడు

image

AP: పోలవరం ప్రాజెక్టును YCP సర్కార్ 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఏడాదిన్నర కష్టపడి డయాఫ్రం వాల్ నిర్మిస్తే YCP దానిని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పార్లమెంటరీ కమిటీకి ఆయన స్వాగతం పలికారు. 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. సీఎం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

News January 11, 2025

ప్రధాని మోదీ యూట్యూబ్ సంపాదన ఎంతంటే?

image

ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక యూట్యూబ్‌ ఛానల్ ఉంది. ఆయన చేపట్టే అన్ని ప్రారంభోత్సవాలు, అధికారిక కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు ఇందులో ప్రసారమవుతాయి. ఈ ఛానల్‌కు 26 మిలియన్లకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 29,272 వీడియోలు పోస్ట్ చేశారు. వీటికి మొత్తంగా 636 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం ఈ ఛానల్ ద్వారా మోదీకి నెలకు రూ.1.62 కోట్ల నుంచి రూ.4.88 కోట్ల ఆదాయం వస్తోంది.

News January 11, 2025

ఆ వ్యూహాత్మ‌క ప్రాంతాల్లో సైన్యం బలోపేతమే లక్ష్యం.. భారత్ కీలక నిర్ణయాలు

image

లద్దాక్ ప్రాంతంలో చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్న వ్యూహాత్మ‌క ప్రాంతాల్లో భారత సైన్యం మరింత బలోపేతం కానుంది. అక్కడ ర‌క్ష‌ణ సామ‌ర్థ్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ (NBWL) 11 కీలక ప్రాజెక్టులను ఆమోదించింది. టెలికం నెట్‌వర్క్ ఏర్పాటు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు, ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్ శిబిరాలు, ఆర్టిలరీ రెజిమెంట్ పోస్టుల ఏర్పాటు తదితర ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపింది.

News January 11, 2025

కూల్ డ్రింక్స్ తాగడం వల్ల 3.4 లక్షల మంది మృతి!

image

శీతలపానీయాలు (Sugar-Sweetened Beverages) తాగడం ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. SSBల వల్ల అధిక బరువు, షుగర్ వస్తుందని, కొలెస్ట్రాల్& బీపీ పెరిగి గుండె జబ్బులొస్తాయని తెలిపారు. అనారోగ్యం పాలై 2020లో 3.4 లక్షల మంది చనిపోయారన్నారు. పట్టణ యువత, చదువుకున్నవారే ఇవి అధికంగా సేవిస్తున్నారు. శుద్ధమైన నీరు అందుబాటులో ఉంటే శీతలపానీయాలను తాగొద్దని సూచించారు. SHARE IT