India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ నాటి MD హరిరామ్ ఆస్తుల జప్తుకు ఇరిగేషన్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. మర్కూక్లో 28, బొమ్మలరామారంలో 6ఎకరాలు, పటాన్చెరులో 20గుంటలు, షేక్పేట, కొండాపూర్లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగిలో 2 ఇళ్లు, ఫ్లాట్లు, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ప్లాట్లు, అమరావతిలో స్థలం, కొత్తగూడెంలో బిల్డింగ్ను జప్తు చేయనున్నారు.

ఏపీలో డీజీపీ, పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉన్నాయని హైకోర్టు మండిపడింది. డిపార్టుమెంటును మూసేయడం మంచిదని అసంతృప్తి వ్యక్తం చేసింది. TTD పరకామణి విషయంలో లోక్ అదాలత్లో రాజీ రికార్డుల సీజ్కు HC SEP 19న ఆదేశాలిచ్చింది. CIDలో సీజ్ అధికారం గల IG పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పని చేయలేదన్న పోలీస్ శాఖను తప్పుబట్టింది. సదుద్దేశం ఉంటే తమకు ఆ విషయం చెప్పేవారని లేదా మరో IG స్థాయి అధికారితో ఆ పని చేయించేవారంది.

తెల్లజుట్టును దాయడానికో, ఫ్యాషన్ కోసమో జుట్టుకు రంగువేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముందు జుట్టు ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రఫ్, డ్రైగా ఉన్న జుట్టుకు రంగువేసినా సరిగ్గా అంటదు. ఎవరో చేశారని కాకుండా మీకు ఏ రంగు నప్పుతుందో చూసుకొని అదే వేసుకోవాలి. కలర్ వేసే ముందు హెయిర్లైన్ చుట్టూ వాజిలైన్ రాయాలి. చేతులకు గ్లోవ్స్ ధరించాలి. <<-se>>#haircare<<>>

వాహనదారులకు NHAI అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. టోల్ ప్లాజాల్లోని శుభ్రంగాలేని టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే రూ.1,000 రివార్డ్ ఫాస్టాగ్ అకౌంట్లో వేస్తామని పేర్కొంది. ఇది OCT 31 వరకు అందుబాటులో ఉంటుంది. ‘రాజమార్గ్ యాత్ర’ యాప్లో టైమ్ స్టాంప్తో క్లీన్గాలేని టాయిలెట్స్ పిక్స్ అప్లోడ్ చేయాలి. అర్హత కలిగిన వారికి రివార్డు అందిస్తారు. NHAI నిర్వహించే టాయిలెట్లకే ఇది వర్తిస్తుంది.

TG: BC రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసును రిఫరెన్స్గా చూపింది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50% రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది.

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.

ఐఐటీ ఇండోర్ 16 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ, ఏదైనా ఐఐటీ నుండి డిజైనింగ్ డిప్లొమా/ ఆర్ట్స్/అప్లైడ్ ఆర్ట్స్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iiti.ac.in/

1. రామాయణంలో రాముడు, సుగ్రీవులు ఏ కాండంలో కలుస్తారు?
2. పాండవులు అరణ్యవాసం ఎన్నేళ్లు చేశారు?
3. విష్ణువు మూడో అవతారం ఏది?
4. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలసి ఉంటాడు?
5. కదళీ ఫలం అంటే ఏంటి?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>>

<<17996798>>EPFO<<>> మరిన్ని నిర్ణయాలు..
* చదువు కోసం 10, పెళ్లి విషయంలో 5సార్లు పాక్షిక విత్ డ్రా చేసుకోవచ్చు. గతంతో వీటిపై పరిమితి(3 సార్లు) ఉండేది.
* విత్ డ్రా చేయడానికి గతంలో ప్రకృతి విపత్తు, నిరుద్యోగం తదితర కారణాలు చూపాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ నిబంధన ఎత్తేశారు.
* కనీస బ్యాలెన్స్ 25% కచ్చితంగా కొనసాగించాలి. దాంతో అధిక వడ్డీ రేటు పొందే వీలుంటుంది.
* విత్ డ్రా కోసం కనీస సర్వీస్ కాలాన్ని 12 నెలలకు తగ్గించారు.

AP: తోతాపురి మామిడి విక్రయించిన రైతులకు ప్రభుత్వం నగదు విడుదల చేసింది. 40,795 మంది రైతుల ఖాతాల్లో రూ.185.02 కోట్ల సబ్సిడీని జమ చేసింది. ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకూ ఎక్స్గ్రేషియా నిధులు రిలీజ్ చేసింది. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 19 జిల్లాల్లో 106 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5.30కోట్లు జమ చేసింది.
* రోజూ అగ్రికల్చర్ వార్తల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి..
Sorry, no posts matched your criteria.