News January 11, 2025

గేమ్‌ఛేంజర్: తైవాన్ బేఫికర్.. చైనాకు టెన్షన్!

image

పక్కలో బల్లెంగా మారిన చైనాకు తైవాన్ చుక్కలు చూపించే రోజు వచ్చేసింది! తన సరికొత్త Qingtian హైపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను ఆవిష్కరించింది. ఇది మాక్ 6 స్పీడ్‌తో 2000KM ప్రయాణించి దాడిచేయగలదు. చైనా సిటీస్, మిలిటరీ బేస్‌లను టార్గెట్ చేయగలదు. దీనిని కూల్చేయడం ఈజీ కాదు. 2024 ఆఖర్లో తైవాన్ వీటి మాస్ ప్రొడక్షన్‌ను ఆరంభించింది. ఈ టెక్నాలజీ అందించేందుకు రష్యాతో పాటు ఓ మిత్రదేశం సాయం చేసినట్టు సమాచారం.

News January 11, 2025

పాపం.. 10 ఒలింపిక్ మెడల్స్ కోల్పోయారు!

image

లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చు భారీ నష్టంతో పాటు వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. అందులో మాజీ US ఒలింపిక్ స్విమ్మర్ గ్యారీ హాల్ జూనియర్ కూడా ఒకరు. మంటలు చుట్టుముట్టడంతో ఆయన తన ఇంటిని విడిచి ఉత్త చేతులతో వచ్చేసినట్లు పేర్కొన్నారు. తాను ఎంతో కష్టపడి సంపాదించిన 10 ఒలింపిక్ మెడల్స్ అందులోనే ఉండిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన 3 వేర్వేరు ఒలింపిక్ ఎడిషన్‌లలో 10 పతకాలు గెలుచుకున్నారు.

News January 11, 2025

ఏపీలో గ్రీన్‌కో రూ.35వేల కోట్ల పెట్టుబడులు: పవన్ కళ్యాణ్

image

AP: గ్రీన్ కో కంపెనీ దేశవ్యాప్తంగా ₹లక్షన్నర కోట్ల పెట్టుబడి పెడుతోందని Dy.CM పవన్ చెప్పారు. అందులో ₹35వేల కోట్లు రాష్ట్రానికే వస్తున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న సోలార్ పార్క్‌ను సందర్శించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘2,800 ఎకరాల్లోని ఈ ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదు. దీనివల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతం పర్యాటక కేంద్రం కానుంది’ అని చెప్పారు.

News January 11, 2025

ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు: US

image

ఎన్నికల్లో ఓట్లను తారుమారుచేసి వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో ఎన్నికయ్యారని అమెరికా కొన్ని నెలలుగా ఆరోపిస్తోంది. ఆయన మోసాన్ని నిర్ధారిస్తూ అరెస్టు చేసేందుకు కచ్చితమైన ఆధారాలను సమర్పించినవారికి $25 మిలియన్లు(రూ.215 కోట్లు) రివార్డుగా ఇస్తామని తాజాగా ప్రకటించింది. మదురో రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని, మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని అక్కడి విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.

News January 11, 2025

చైనా మాంజా.. IPSకు తప్పిన ప్రమాదం!

image

చైనా మాంజా వినియోగించడం వల్ల వాహనదారులకు గాయాలవుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన IPS అధికారి రమేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ‘దేవరా! ఇది నాకు చుట్టమల్లే చుట్టేయలేదు. శత్రువల్లే కాటేయబోయింది. ఈ రోజు ఉదయం నాకు తృటిలో ప్రమాదం తప్పింది. కాలికి మెడకు ఒకే సమయంలో చుట్టేసే మాంజా సమయానికి నా కంటబడింది. పతంగుల పండుగ సందర్భంగా తెగిన గాలి పటాల తాలూకు దారం మీ కంటపడగానే, చుట్టేయండి’ అని సూచించారు.

News January 11, 2025

రూ.10 లక్షలతో బుక్స్ కొన్న పవన్ కళ్యాణ్

image

AP: విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో Dy.CM పవన్ కళ్యాణ్ రూ.10 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల బుక్స్ ఆయన అధికంగా కొన్నారు. వీటిలో ఎక్కువగా డిక్షనరీలు తీసుకున్నారు. బుక్ ఫెయిర్‌లోని ‘ది మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ అనే పుస్తకం ఎన్ని ఉంటే అన్ని ఆర్డర్ చేశారు. ఈ పుస్తకాలతో తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ ఓ గ్రంథాలయం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.

News January 11, 2025

భాగ్యనగరం బోసి‘పోతోంది’!

image

పండగకు నగరవాసులందరూ ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తమ స్వగ్రామాలకు వెళ్లిపోతుండటంతో భాగ్యనగరం బోసిపోయింది. జనంతో కళకళలాడే రోడ్లు విదేశాల్లో రోడ్లలా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈరోజు, రేపు కూడా గడిస్తే పండుగకు వెళ్లేవారంతా వెళ్లిపోగా, హైదరాబాద్ రహదారులు మరింత నిర్మానుష్యంగా మారొచ్చని అంచనా. ప్రశాంతంగా ఉందని కొంతమంది అంటుంటే.. జనం లేక బోరింగ్‌గా కనిపిస్తోందని మరికొంతమంది పేర్కొంటున్నారు. మీ కామెంట్?

News January 11, 2025

భక్తుల మృతికి సీఎం బాధ్యుడు కాదా పవన్?: అంబటి

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ‘కలవని కల్తీ లడ్డుకు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యుడా? ఆరుగురు భక్తుల మృతికి ఇప్పటి సీఎం బాధ్యుడు కాదా పవన్ కళ్యాణ్?’ అని Xలో ప్రశ్నించారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అంబటి తాజాగా ఆరోపించిన విషయం తెలిసిందే.

News January 11, 2025

మరో పేషెంట్‌లో న్యూరాలింక్ చిప్ అమరిక విజయవంతం

image

ఎలాన్ మస్క్ సంస్థ న్యూరాలింక్ తయారుచేసిన చిప్‌ను మరో రోగి మెదడులో వైద్యులు విజయవంతంగా అమర్చగలిగారు. మస్క్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఇప్పటి వరకూ ముగ్గురిలో చిప్‌ను విజయవంతంగా అమర్చాం. అందరిలోనూ చిప్స్ బాగా పనిచేస్తున్నాయి’ అని పేర్కొన్నారు. శరీరంపై నియంత్రణ కోల్పోయిన వారి మెదడులో చిప్ అమర్చి, దాని సాయంతో వారు ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించగలిగేలా న్యూరాలింక్ చిప్ పనిచేస్తుంది.

News January 11, 2025

దేశవ్యాప్తంగా 930 మందిని డిజిటల్ అరెస్ట్ చేసిన మాస్టర్‌మైండ్ అరెస్ట్!

image

డిజిటల్ అరెస్టు స్కామ్‌ మాస్టర్‌మైండ్స్‌లో ఒకరైన చిరాగ్ కపూర్‌ను కోల్‌కతా పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసినట్టు NEWS18 తెలిపింది. అతడికి 930 కేసులతో సంబంధం ఉంది. మోసపోయిన దేబశ్రీ దత్తా Rs7.4L బదిలీ చేసిన JSFB A/C ద్వారా కూపీ లాగారు. ఆనంద్‌పూర్, పటౌలి, నరేంద్రపురి ప్రాంతాల్లో ఆఫీసులను గుర్తించి 104 passbooks, 61mobiles, 33 debit cards, 2QR code machines, 140sims, 40 seals స్వాధీనం చేసుకున్నారు.