News October 8, 2025

ALERT: ప్రవేశాలకు రెండు రోజులే గడువు

image

TG: అంబేడ్కర్ ఓపెన్‌ యూనివర్సిటీలో 2025-26 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్లకు దరఖాస్తు గడువు అక్టోబర్ 10తో ముగియనుంది. బీఏ, బీకాం, బీఎస్సీలో చేరేందుకు ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ప్రవేశాల కోసం www.braouonline.inలో అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులకు రిటైల్ రంగంలో ఉపాధి కల్పించడానికి RASCI సంస్థతో యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది.

News October 8, 2025

నవోదయ ప్రవేశాల గడువు మళ్లీ పెంపు

image

నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో సీట్ల భర్తీకి అప్లికేషన్ గడువును మరోసారి పొడిగించారు. మొదట సెప్టెంబర్​ 23తో దరఖాస్తు గడువు ముగియగా దానిని అక్టోబర్​ 7 వరకు పెంచారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అక్టోబర్​ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని JNV అధికారులు తెలిపారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 7న నిర్వహించనున్నారు.

News October 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 29 సమాధానాలు

image

1. వశిష్ట మహాముని భార్య ‘అరుంధతి’.
2. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది.
3. తిరుమలలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
4. శివుడు వాయు లింగంగా కొలువైన ఆలయం ‘శ్రీకాళహస్తి’.
5. జీవితంలోని పురుషార్థాలు 4. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 8, 2025

చికిత్స తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి వస్తుందా?

image

మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకర క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిపోయినట్టు కనిపించినా కొన్నిసార్లు తిరిగిరావొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని క్యాన్సర్ కణాలు నిద్రాణ స్థితిలో ఉండి గుర్తించలేనివిగా ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత కూడా చెకప్‌లు చేయించుకోవాలి. అలాగే శరీరంలో ఏవైనా అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>

News October 8, 2025

ట్రిపుల్ టెస్ట్ సర్వే అంటే ఏంటి?

image

TG: BC రిజర్వేషన్ల‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్లు ట్రిపుల్ టెస్ట్ సర్వే అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు. 2021లో వికాస్ కిషన్‌రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ MH, ఇతరుల కేసుల్లో SC ట్రిపుల్ టెస్ట్‌ను ఏర్పాటు చేసింది. అదేంటంటే?
✎ OBC వెనుకబాటుతనంపై కమిషన్ ఏర్పాటు చేయాలి.
✎ ఆ కమిషన్ ఇచ్చే డేటా బేస్ చేసుకొని రిజర్వేషన్ % నిర్ణయించాలి.
✎ SC, ST, OBC రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదు.

News October 8, 2025

జియో భారత్ కొత్త ఫోన్.. ఫీచర్లేమిటంటే

image

జియో భారత్ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. పెద్దలు, పిల్లల వినియోగానికి అనుగుణమైన సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. లొకేషన్ మానిటరింగ్, యూసేజ్ మేనేజింగ్ వ్యవస్థతోపాటు బ్యాటరీ బ్యాకప్ 7 రోజుల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాల్స్, మెసేజ్‌ల నియంత్రణ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రారంభ ధర ₹799గా నిర్ణయించింది. ఇప్పటికే తెచ్చిన జియో పీసీలలో AI క్లాస్ రూమ్ ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నామని తెలిపింది.

News October 8, 2025

హైకోర్టు నుంచి సీఎం ఇంటికి మంత్రులు, ఏజీ

image

TG: BC రిజర్వేషన్ల అంశం హైకోర్టులో తేలకపోవడంతో CM రేవంత్ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి AG, లాయర్లు, మంత్రులను తన నివాసానికి రావాలని సూచించారు. రేపు కోర్టులో వాదనలు, ఎలాంటి తీర్పు ఉండబోతుందనే తదితర అంశాలను చర్చించనున్నారు. అటు విచారణ వాయిదా పడటంతో SEC నోటిఫికేషన్‌పై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు కోర్టు ప్రాంగణంలోనే ఏజీతో మంత్రుల బృందం సమావేశమైంది.

News October 8, 2025

మహిళల్లోనే డిప్రెషన్ అధికం.. కారణమిదే!

image

సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళల్లో డిప్రెషన్ రెట్టింపు ఉంటుంది. ఇందుకు జీన్స్(జన్యువులు) కారణమని తాజా అధ్యయనం తెలిపింది. పురుషుల కంటే మహిళల్లో 6,000 జీన్ వేరియంట్స్ అదనంగా ఉంటాయని ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో పబ్లిష్ అయిన స్టడీ పేర్కొంది. జనరిక్ ఫ్యాక్టర్స్ వల్లే ఉమెన్స్‌లో డిప్రెషన్‌ రిస్క్ పెరుగుతుందని వెల్లడించింది. ఈ జీన్ వేరియంట్స్ వారసత్వంగా లేదా సహజంగా కూడా ఏర్పడతాయంది.

News October 8, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* అమరావతిలో CRDA ప్రాజెక్టు కార్యాలయాన్ని ఈనెల 13న 9.54AMకు ప్రారంభించనున్న CM చంద్రబాబు
* లిక్కర్ స్కాం కేసు: MP మిథున్ రెడ్డి పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని సిట్‌కు ACB కోర్టు ఆదేశం.. US జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ ఇప్పించాలని కోరిన MP
* 21 మందితో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీని నియమించిన ప్రభుత్వం
* రాష్ట్రంలో 274 రోడ్ల మరమ్మతులకు రూ.1,000 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

News October 8, 2025

PCOSకి చెక్ పెట్టే చియా సీడ్స్

image

ప్రస్తుతకాలంలో చాలామందిని బాధించే సమస్య PCOS. దీనివల్ల బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడంలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే PCOSకి చియాసీడ్స్ పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను నెమ్మది చేసి, చక్కెర శోషణను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గిస్తుంది.