India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. రాష్ట్రస్థాయిలో విజయవాడలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉ.9 గంటలకు కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. 18 మంది వేద పండితులు, అర్చకులను అధికారులు సత్కరిస్తారు. అలాగే ప్రతి జిల్లాలో ఇద్దరు అర్చకులు, ఓ వేద పండితుడిని సత్కరించి ఓ ప్రశంసా పత్రం, రూ.10,116 సంభావన, కొత్త వస్త్రాలు అందజేస్తారు.
* అరకు (ఎంపీ)-పాచిపెంట అప్పలనర్స
* రంపచోడవరం-లోతా రామారావు
* కురుపాం-మండంగి రమణ
* అరకు-దీసరి గంగరాజు, గాజువాక-జగ్గునాయుడు
* గన్నవరం-కళ్ళం వెంకటేశ్వరరావు
* నెల్లూరు సిటీ-మూలం రమేశ్
* కర్నూలు-గౌస్ దేశాయి, సంతనూతలపాడు-ఉబ్బా ఆదిలక్ష్మి
* విజయవాడ సెంట్రల్-బాబురావు, మంగళగిరి-శివశంకర్
AP: తెలుగు ప్రజలకు సీఎం జగన్ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది ప్రజలందరికీ శుభాలు జరగాలి. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలి. అన్ని వృత్తుల వారు ఆనందంగా ఉండాలి. ప్రతి ఇల్లూ కళకళలాడాలి. మన సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి’ అని ఆకాంక్షించారు.
ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ PBKS, SRH జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చండీగఢ్ వేదికగా రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ రెండు టీమ్స్ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు 21 సార్లు తలపడ్డాయి. 14 మ్యాచుల్లో SRH గెలవగా, 7 మ్యాచుల్లో PBKS విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో హైదరాబాద్ 5వ స్థానంలో, పంజాబ్ 6వ స్థానంలో ఉన్నాయి. నేడు గెలుపెవరిది? కామెంట్ చేయండి.
భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈనెల 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనుండగా, ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 17న శ్రీరామనవమి సందర్భంగా ఉ.10:30 గంటల నుంచి మ.12:30 గంటల వరకు మిథిలా మండపంలో శ్రీసీతారామ కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 18న మహా పట్టాభిషేకం జరగనుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన కల్కి 2898ఏడీ, రాజాసాబ్, సలార్-2, స్పిరిట్, కన్నప్ప(కీలక పాత్ర)తో బిజీగా ఉండగా.. ఇప్పుడు హను రాఘవపూడి చిత్రం కూడా ఒప్పుకొన్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తీయనున్నట్లు హను ప్రకటించారు. కాగా.. మున్ముందు వరుసగా సినిమాలుండటంతో ప్రభాస్ ప్రస్తుతం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.
ఉగాది రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి. దైవదర్శనం చేసుకుని, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇళ్లను, వ్యాపార నిలయాలను మామిడి, పూల తోరణాలు, అరటి బోదెలతో అలంకరించాలి. దేవతార్చన, పంచాంగ పూజ చేయాలి. ఉగాది పచ్చడి, భక్ష్యాలు, పూర్ణాలు నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం, కవిత్వ, సాహిత్య గోష్ఠుల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది.
ఏపీ పాలిసెట్-2024 <
ఎక్సైజ్ పాలసీ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మధ్యాహ్నం 2:30 గంటలకు తీర్పును వెల్లడించనున్నారు. ఈనెల 3న ఈడీ, కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
వేసవి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు 48 స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు ద.మ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్-నాగర్సోల్ (07517), నాగర్సోల్-సికింద్రాబాద్ (07518), తిరుపతి-మచిలీపట్నం (07121), మచిలీపట్నం-తిరుపతి (07122), CST ముంబై-కరీంనగర్ (01067), కరీంనగర్-CST ముంబై (01068), యశ్వంత్పూర్-కాలాబుర్గి(06505), కాలాబుర్గి-యశ్వంత్పూర్ (06506) మధ్య నడుస్తాయని తెలిపింది.
Sorry, no posts matched your criteria.