News October 8, 2025

మోదీకి కంగ్రాట్స్ చెప్పిన జగన్

image

ప్రధాని మోదీ ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ చీఫ్ జగన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ‘ఈ మైలురాయి దేశసేవ పట్ల మీ అంకితభావం, పట్టుదల, నిబద్ధతను తెలియజేస్తోంది. మీరు ఇలాగే పని చేస్తూ విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

News October 8, 2025

రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధిస్తాం: ఉత్తమ్

image

తెలంగాణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 67.57 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దీని నుంచి 1.48 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని తెలిపారు. 90.46 లక్షల టన్నుల సన్నాలు, 57.84 లక్షల టన్నుల దొడ్డురకం ధాన్యం పంట చేతికొస్తుందని చెప్పారు. క్వింటాల్ సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని.. ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యం కొంటుందన్నారు.

News October 8, 2025

జుట్టు రాలిపోతోందా? ఇవి మీ డైట్‌లో ఉంటే..!

image

చాలామందికి యుక్త వయసులోనే జుట్టు రాలిపోతుండటం ఆందోళనకరం. జుట్టు బలంగా ఉండేందుకు ఎన్ని షాంపులు, నూనెలు వాడినా శరీరానికి పోషకాలు అందడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. రోజూ గుమ్మడి గింజలు తింటే జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయని సూచిస్తున్నారు. వీటిల్లో జింక్, మెగ్నీషియం, కుకుర్బిటాసిన్ అమైనో యాసిడ్స్‌తో పాటు సహజ నూనెలు DHT హార్మోన్‌ను అడ్డుకొని జుట్టు రాలడాన్ని నిరోధించి వృద్ధికి తోడ్పడతాయట.

News October 8, 2025

తొక్కిసలాట ఘటన.. సుప్రీంకు విజయ్ పార్టీ

image

తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటపై సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ సినీ హీరో విజయ్ పార్టీ <<17926042>>టీవీకే<<>> సుప్రీంకోర్టును ఆశ్రయించింది. SC న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. సీనియర్ అధికారి అస్రా గార్గ్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. గత నెల 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే.

News October 8, 2025

53 అంగన్‌వాడీ హెల్పర్ ఉద్యోగాలు

image

AP: విశాఖపట్నం జిల్లాలో 53 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ &సాధికారత కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. స్థానికంగా స్థిరంగా నివసిస్తూ, 7వ తరగతి పాసైనవారు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి. భీమునిపట్నం డివిజన్‌లో 11, విశాఖపట్నం డివిజన్‌లో 42 పోస్టులు ఉన్నాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

News October 8, 2025

స్విట్జర్లాండ్ నుంచి వచ్చి.. శివ భక్తురాలిగా మారి..

image

స్విట్జర్లాండ్‌కు చెందిన సుసి బ్రాస్‌ రెండేళ్ల క్రితం సినిమాల్లో నటించాలని భారత్‌కు వచ్చింది. అయితే ఆమె ఓసారి వైశాలి సోన్‌పుర్‌లో ఉన్న బాబా హరిహర్నాథ్‌ ఆలయాన్ని సందర్శించింది. ఉద్యోగం పోవడంతో తులసిమాల ధరించి పంచాక్షరిని జపం మొదలుపెట్టింది. మాంసాహారాన్ని త్యజించింది. ఆలయానికి సమీపంలోనే అద్దెకుంటూ దైవసేవలో గడుపుతోంది. ఓ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన సుసి భక్తి ప్రశాంతతను ఇస్తోందని తెలిపింది.

News October 8, 2025

చాహల్ రిలేషన్.. మరోసారి అలా చేయను: ధనశ్రీ

image

క్రికెటర్ చాహల్‌తో రిలేషన్‌పై మాజీ భార్య ధనశ్రీ వర్మ మరోసారి కామెంట్ చేశారు. ‘నా పార్ట్నర్ తప్పు చేశాడని తెలిసినా సపోర్ట్ చేశాను. అందుకు తర్వాత పశ్చాత్తాపం చెందా. మళ్లీ అలా చేయాలి అనుకోవట్లేదు’ అని ఆమె స్పష్టం చేశారు. బిగ్‌బాస్ తరహా రియాల్టీ షో ‘రైజ్ అండ్ ఫాల్’లో ఉన్న శ్రీ.. హౌజ్‌మేట్ నిక్కీతో విభేదాలపై మరొకరితో చెబుతూ ఇలా అన్నారు. కాగా ‘2 నెలల్లోనే దొరికిపోయాడు’ అని ఇదే షోలో ఇటీవల కామెంట్ చేశారు.

News October 8, 2025

చింతిస్తూ పొన్నం వివరణ.. వివాదం ముగిసిందా?

image

TG: సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై కామెంట్ చేయలేదని పొన్నం వివరణ ఇచ్చారు. ‘మరొకరిపై నా మాటలను వక్రీకరించడంతో అడ్లూరి నొచ్చుకున్నారని తెలిసి చింతిస్తున్నా’ అని పేర్కొన్నారు. 30సం.ల తమ స్నేహం రాజకీయాలకు మించినదని, కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం కృషి చేస్తామని తెలిపారు. కాగా దళిత సంఘాల హెచ్చరికలతో పొన్నం ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అటు కాసేపట్లో PCC చీఫ్ ఇద్దరు మంత్రులతో విడివిడిగా మాట్లాడనున్నారు.

News October 8, 2025

బీసీ రిజర్వేషన్లు.. విచారణ వాయిదా

image

TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోపై మధ్యాహ్నం 12.30కు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు, తీర్పును చదివి తదుపరి విచారణ చేపడతామని పేర్కొంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు హైకోర్టు వద్దకు చేరుకున్నారు.

News October 8, 2025

NCLTలో 32 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో 32 స్టెనోగ్రాఫర్, ప్రైవేట్ సెక్రటరీస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులైన కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ నాలెడ్జ్ గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.45వేలు, ప్రైవేట్ సెక్రటరీకి రూ.50వేలు జీతం అందిస్తారు. వెబ్ సైట్: https://nclt.gov.in/