News April 8, 2024

‘హాయ్ నాన్న’కు పురస్కారాల పంట

image

శౌర్యవ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘హాయ్ నాన్న’. దేశీయంగా వివిధ అవార్డుల్ని సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్, అంతర్జాతీయంగానూ సత్తా చాటింది. న్యూయార్క్‌లో జరిగిన ‘ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్’లో ఏకంగా 11 పురస్కారాలను దక్కించుకుంది. ఉత్తమ చిత్రం సహా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి తదితర విభాగాల్లో మూవీకి అవార్డుల పంట పండింది. అంతర్జాతీయంగా ఈ సినిమాను ‘హాయ్ డాడీ’గా రిలీజ్ చేశారు.

News April 8, 2024

జడేజా అరుదైన ఘనత

image

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. ఇవాళ KKRతో మ్యాచులు రెండు క్యాచులు పట్టడం ద్వారా ఐపీఎల్‌లో 100 క్యాచులు పట్టిన ఆటగాళ్ల లిస్ట్‌లో చేరారు. దీంతో ముంబై ప్లేయర్ రోహిత్ శర్మతో కలిసి జడేజా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఓవరాల్‌గా ఈ లిస్ట్‌లో కోహ్లీ(110), రైనా(109), పొలార్డ్(103) ముందు వరసలో ఉన్నారు.

News April 8, 2024

దారుణం.. చిన్నారులపై ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపులు!

image

TG: పిల్లలకు పాఠాలు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. భువనగిరి జిల్లాలో ఓ స్కూల్‌లో చాక్లెట్ల ఆశచూపి 3వ తరగతి విద్యార్థినులపై ప్రధానోపాధ్యాయుడు మాధవరెడ్డి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇటీవల ఓ చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం బయటపడింది. న్యాయం కోసం చిన్నారుల తల్లిదండ్రులు నిరసనకు దిగడంతో పోలీసులు ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

News April 8, 2024

అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే?

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 16 విడతలుగా నిధులు విడుదల చేయగా.. 17వ విడత నిధులను మే ఆఖరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లో జమ చేయనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున రూ.6వేలు అందిస్తోంది. ఫిబ్రవరి 28న చివరి విడత నిధులు జమ అయ్యాయి.

News April 8, 2024

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు

image

AP: రాష్ట్రంలో ఈసీ వేటుతో బదిలీ అయిన IASలకు ఎన్నికలతో సంబంధం లేని శాఖలకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్టు CEOగా లక్ష్మీ షా, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా రాజాబాబు, TTD జేఈవోగా గౌతమి, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌గా అంబేడ్కర్, పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా వెంకట్రామిరెడ్డి, CCLA కార్యదర్శిగా ప్రభాకర్ రెడ్డిని నియమించింది.

News April 8, 2024

పీఎం మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్

image

ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయనపై ఓ ట్రాన్స్‌జెండర్‌ కూడా పోటీ చేస్తుండటం ఆసక్తికరం. అఖిల భారత హిందూ మహాసభ(ఏబీహెచ్ఎం)కు చెందిన హేమాంగి సఖి మాత బరిలో నిలిచారు. బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్‌గా పట్టాభిషిక్తులయ్యారు.

News April 8, 2024

చెన్నై టార్గెట్ ఎంతంటే?

image

చెన్నైతో జరుగుతున్న మ్యాచులో KKR 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. KKRలో కెప్టెన్ శ్రేయస్(34), నరైన్(27), రఘువన్శీ(24) పరుగులు చేశారు. CSK బౌలర్లలో జడేజా, దేశ్ పాండే చెరో 3, ముస్తఫిజుర్ 2, తీక్షణ ఒక వికెట్ తీశారు. చెన్నై టార్గెట్ 138.

News April 8, 2024

గంట ముందు టికెట్స్ క్యాన్సిల్.. IRCTCకి రూ.20వేలు ఫైన్

image

సికింద్రాబాద్ నుంచి విజయనగరం వెళ్లేందుకు ఓ మహిళ జనవరి 13, 2021న హౌరా స్పెషల్ ట్రైన్‌కు నాలుగు 2AC టికెట్లు బుక్ చేసింది. అయితే, ఫ్లాట్‌ఫామ్‌కి వచ్చి వేచిచూస్తుండగా టికెట్ క్యాన్సిల్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీనిపై అధికారులను ప్రశ్నించినా సమాధానం దొరకలేదు. దీంతో ఆమె వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై IRCTC సరైన కారణాలు చెప్పకపోవడంతో రూ.20వేలు పరిహారం చెల్లించాలని ఫోరమ్ ఆదేశించింది.

News April 8, 2024

మన జీవితంలో మిగిలిపోయే క్యారెక్టర్ ఇది: ఎన్టీఆర్

image

‘డీజే టిల్లు’ సినిమాలో ఉన్నట్లుగా సిద్ధూ బయట ఉండరని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. సిద్ధూకు ఎంత సేపూ సినిమా, క్యారెక్టర్‌కు న్యాయం చేయాలనే తపన ఉందని అన్నారు. ‘డీజే టిల్లు’ మూవీతో మన జీవితంలో మిగిలిపోయే క్యారెక్టర్ ఇచ్చారని కొనియాడారు. టిల్లు మన ఇంట్లో, మన చుట్టూ తిరిగే మనిషి అయ్యాడని అన్నారు. నవ్వలేను బాబోయ్ అనేంతగా టిల్లు పాత్రలో సిద్ధూ నవ్వించాడన్నారు.

News April 8, 2024

వరల్డ్‌కప్‌నకు వారిద్దరూ భారత జట్టులో ఉండాల్సిందే: లారా

image

వచ్చే టీ20 ప్రపంచ కప్‌నకు సంజూ శాంసన్, పంత్ ఇద్దరూ టీమ్ ఇండియాలో ఉండాలని వెస్టిండీస్ దిగ్గజం లారా అభిప్రాయపడ్డారు. కీపింగ్‌కు భారత జట్టులో పోటీ ఎక్కువ ఉన్న కారణంగా ఒకరినే ఎంపిక చేయాలా అన్న ప్రశ్నపై స్పందించారు. ‘వాళ్లిద్దరిలో ఒకరిని కాదు. ఇద్దర్నీ భారత్ సెలక్టర్లు జట్టులోకి తీసుకోవాలి. ఈ సీజన్‌లో వారు అద్భుతంగా ఆడుతున్నారు. శాంసన్ టైమింగ్, పంత్ ఫామ్ రెండూ బాగున్నాయి’ అని లారా పేర్కొన్నారు.