India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ ఏజెన్సీలో గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచే సరికొత్త రాజ్మా రకం విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో రెడ్, వైట్ రకాలుండగా, కొత్తగా ‘జ్వాలా’ రకం అధిక దిగుబడిని, ఆదాయాన్ని అందిస్తోంది. జ్వాలా రకం రాజ్మా పంటకాలం 120-125 రోజులు. ఎకరాకు 3-5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సాధారణ రాజ్మా రకం ధర కిలో రూ.60-రూ.70 ఉంటే.. ఈ జ్వాలా రకం కిలో రూ.140-రూ.150గా ఉంది. ఎకరాకు రూ.30 వేల – రూ.40వేలు ఆదాయం వస్తుంది.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) 542 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వెహికల్ మెకానిక్, MSW(పెయింటర్, DES)పోస్టులు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగలవారు OCT 11నుంచి NOV 24వరకు అప్లై చేసుకోవచ్చు. PET, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

RRC నార్త్ సెంట్రల్ రైల్వే 46 పోస్టులకు క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, ఐటీఐ, ఇంటర్, టెన్త్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. స్పోర్ట్స్లో సాధించిన విజయాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://rrcpryj.org/

AP: CM చంద్రబాబు ఇవాళ కుప్పంలో ‘సంజీవని’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా 30 ఏళ్లు దాటిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే టెస్టులు చేయడం వల్ల ముందే గుర్తించవచ్చని భావిస్తున్నారు. ఈ రోజు కుప్పంలో, ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో, అనంతరం మిగతా జిల్లాల్లో ఈ స్కీమ్ను అమలు చేయనున్నారు. 104 వాహనాల్లోనూ టెస్టులు చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు.

నేడు USAలో క్లచ్ చెస్ టోర్నీ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులు, చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ గాస్పరోవ్(రష్యా) ఇందులో తర్వాత పోటీ పడనున్నారు. ఈ దిగ్గజాలు ఇప్పటివరకు పోటీ పడిన గేమ్స్లో కాస్పరోవ్దేపై చేయి. మరోవైపు వరల్డ్ నం.1 కార్ల్సన్, భారత ప్లేయర్ గుకేశ్ ఈ టోర్నీలో తలపడనున్నారు. అన్ని ఫార్మాట్లలో గుకేశ్పై కార్లసన్దే ఆధిపత్యం ఉంది.

విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీ 54 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది. దరఖాస్తు ఫీజు రూ.2వేలు, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్సైట్: https://www.visvabharati.ac.in/

AP: అనకాపల్లిలో రేపు YCP చీఫ్ జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి లభించింది. ఈ విషయాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత వెల్లడించారు. వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్, వేపగుంట, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో రావాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ పర్మిషన్ లేకుండా ఎలాంటి మార్పులు, హాల్ట్ చేయకూడదని పేర్కొన్నారు. జన సమీకరణకు అనుమతి లేదని, ఊరేగింపులు, రోడ్ మార్చ్లపై నిషేధం ఉందన్నారు.

శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయే||
తెల్లటి వస్త్రాలు ధరించి, విశ్వమంతా వ్యాపించినవాడా! చంద్రుని తేజస్సుతో పాటు 4 భుజాలు గలవాడా! ప్రసన్న ముఖుడిని నేను ధ్యానిస్తున్నాను. నా విఘ్నాలను తొలగించు’ అనేది ఈ శ్లోకార్థం. తెలుపు వస్త్రాలు పవిత్రతకు చిహ్నం. చతుర్భుజాలు పురుషార్థాలను సూచిస్తాయి. సర్వవ్యాపిని ధ్యానించి, కార్యసిద్ధిని కోరే అద్భుత ప్రార్థన ఇది.

CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ 30 పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. వీటిలో సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్ , PhD అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్సైట్: https://www.immt.res.in/

గత రెండు, మూడు నెలలుగా సినీ ఇండస్ట్రీ హిట్ సినిమాలతో కళకళలాడుతోంది. బాలీవుడ్ మూవీ ‘సయారా’ నుంచి మొదలుకొని ‘కాంతార ఛాప్టర్-1’ వరకు ఇదే జోరు కొనసాగుతోంది. సైయారా, కొత్త లోక, మిరాయ్, OG సినిమాలు సినీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాయి. ఈ చిత్రాలకు హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగానూ రికార్డులు నెలకొల్పాయి. ఇప్పుడు ‘కాంతార ఛాప్టర్-1’ అదే పరంపరను కొనసాగిస్తోంది. మీరు ఏ సినిమా చూశారు?
Sorry, no posts matched your criteria.