News April 8, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడి‌గా ఉన్న ప్రణీత్ రావు SIB సేకరించిన పాత డేటాను ధ్వంసం చేసినట్లు సమాచారం. దాదాపు 4 దశాబ్దాల కీలక నిఘా డేటాను ధ్వంసం చేసి మూసీలో వేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారడంతో ప్రణీత్ రావు గ్యాంగ్ 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు.

News April 8, 2024

తమ్ముడి లక్ష్యం కోసం నేను సైతం: చిరంజీవి

image

జనసేన పార్టీకి రూ.5 కోట్లు విరాళం ఇవ్వడంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘అందరూ అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించింది. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించా’ అని పేర్కొన్నారు.

News April 8, 2024

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా

image

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకోగా.. కేవలం 20 రోజుల్లోనే OTTలోకి వచ్చేస్తోంది. శ్రీ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అందించారు.

News April 8, 2024

రతన్ టాటా మాటలు తనను మార్చేశాయన్న మయాంక్.. కానీ..!

image

లక్నో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ చేసిన ఓ కామెంట్ నెట్టింట వైరలవుతోంది. రతన్ టాటా చెప్పిన ఓ సూక్తి తన జీవితాన్ని మార్చేసిందని ఆయన తెలిపారు. ‘సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు నమ్మకం లేదు. నేను తీసుకున్న నిర్ణయాలను సరైన నిర్ణయాలుగా మార్చుతా’ అని రతన్ టాటా చెప్పినట్లు మయాంక్ పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు తానెప్పుడూ చేయలేదని టాటా గతంలో క్లారిటీ ఇచ్చారు.

News April 8, 2024

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

image

TG: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సిద్దిపేట త్రీ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డి నిన్న రహస్యంగా సమావేశం నిర్వహించారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

News April 8, 2024

పేసు గుర్రాలను భారత్ రక్షించుకోవాలి

image

గంటకు 150 కిమీ వేగంతో వచ్చే బంతుల్ని ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ వాటిని సంధించడం మరింత కష్టం. మయాంక్ యాదవ్, ఉమ్రాన్, యశ్ ఠాకూర్ వంటి పేసర్లు ఈ వేగంతో బౌలింగ్ చేస్తున్నారు. కానీ వీరిపై బీసీసీఐ జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న ఆందోళనలున్నాయి. వ్యక్తిగత కోచ్‌లు, ఫిట్‌నెస్ కోసం అవసరమైన సౌకర్యాలు, ప్రత్యేక పర్యవేక్షణల్ని కల్పించి యువ కెరటాలను గాయాల నుంచి రక్షించుకోవాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.

News April 8, 2024

పేపర్ల దహనంపై స్పందించిన సీఐడీ

image

AP: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయం సమీపంలో హెరిటేజ్ పత్రాలు దహనం చేసిన <<13014494>>ఘటనపై<<>> సీఐడీ స్పందించింది. ‘ఐదు కేసుల్లో విజయవాడ ఏసీబీ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశాం. ఒక్కో దానిలో 8 వేల నుంచి 10వేల పేజీలున్నాయి. కొన్ని పత్రాలు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయి. వాటిని దహనం చేశాం. కేసులకు సంబంధించిన అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించాం’ అని సీఐడీ ప్రకటించింది.

News April 8, 2024

విపక్షాలు నాపై విషం చిమ్ముతున్నాయి: మోదీ

image

ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలకు దిగారు. అవినీతిపై యుద్ధం ప్రకటిస్తే తనపై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని దుయ్యబట్టారు. ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అవినీతిని అంతం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ఏనాడూ పేదలను పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం చేసిన కృషితో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారన్నారు.

News April 8, 2024

వైఎస్ పాలనకు జగన్ పాలనకు చాలా తేడా : షర్మిల

image

AP: వైఎస్సార్ పాలనకు జగన్ పాలనకు చాలా తేడా ఉందని కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. వివేకా హత్యకేసులో నిందితులకు జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారని దుయ్యబట్టారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. హంతకులు గెలవకూడదనే తాను కడప నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ నాలుగున్నరేళ్లు నిద్రపోయి.. ఆరు నెలల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు.

News April 8, 2024

BREAKING: స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: అన్ని ప్రభుత్వ స్కూళ్లలో క్రమం తప్పకుండా వాటర్ బెల్ కార్యక్రమం కొనసాగించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ‘విద్యార్థుల్లో డీహైడ్రేషన్ నివారణకు రోజుకు 3సార్లు వాటర్ బెల్ నిర్వహించాలి. ఏప్రిల్ 23 వరకు ప్రతిరోజూ DEOలు దీన్ని పర్యవేక్షించాలి. మూత్రం రంగును బట్టి శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు గుర్తించేలా అవగాహన కల్పించాలి. ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు వాటర్ బెల్ మోగించాలి’ అని పేర్కొంది.